హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నీలగిరి బ్లాక్లోని నాలుగో అంతస్తులో పనిచేస్తున్న ఓ కోచింగ్ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న పలువురు విద్యార్థులు లోపలే చిక్కుకుపోయారు.
మంటల కారణంగా భవనమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. భవనం సమీపంలోనే ఉన్న హైదరాబాద్ మెట్రో మార్గం వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో ట్రాఫిక్కు కూడా అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నిచ్చెనల సహాయంతో నాలుగో అంతస్తు బాల్కనీలో నిలబడి సహాయం కోరుతున్న విద్యార్థులను ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ముఖాలకు ముసుగులు ధరించి, దట్టమైన పొగ మధ్య సిబ్బంది ధైర్యంగా లోపలికి ప్రవేశించి రక్షణ చర్యలు చేపట్టారు. అప్రమత్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలు మరింత వ్యాపించకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్లోని విద్యుత్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు.
This post was last modified on February 20, 2026 1:00 pm
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
ఇంట్లో బైక్ను స్టార్ట్లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన…
క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా…
కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…
వైసీపీ అధినేత జగన్కు జనసేన పార్టీముఖ్య నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. కీలక సూచనలు చేశారు. అయితే.. జగన్ ఎవరి మాటా…