నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది…! యూట్యూబర్గా అందరికీ సుపరిచితమే. వందలాది దేశాలు తిరిగి అక్కడి నుంచి వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు అదే అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు.
ప్రస్తుతం ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను దాని మాతృ సంస్థ మెటా నిలిపివేసింది. ఇంస్టాగ్రామ్ లో ఆయనకు 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. హిందూ దేవతలపై ఆయన చేసిన కామెంట్స్పై హైదరాబాద్ సీసీఎస్లో నమోదైన కేసులో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఈ చర్య అనంతరం అన్వేష్ మరో వీడియో విడుదల చేశారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను నిలుపుదల చేసినంత మాత్రాన తనకు పోయేది ఏమీ లేదంటూ వ్యంగ్యంగా చెప్పారు. అయితే అన్వేష్ తన హద్దు దాటి మాట్లాడుతున్నారని విమర్శలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి.
సొంత అభిప్రాయాలు కలిగి ఉండటం ప్రతి వ్యక్తి హక్కే. అయితే పెద్ద స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో ప్రభావం కలిగిన వ్యక్తి అయితే, అతని మాటలకు మరింత బాధ్యత అవసరం ఉంటుంది. ప్రజలు ఆయన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకునే అవకాశముండటంతో, ప్రతి మాట సామాజిక ప్రభావాన్ని చూపుతుంది.
వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసే సమయంలో సామాజిక బాధ్యత, సమాజంలోని వర్గాల మధ్య సమన్వయం, సామరస్యం దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాదరణ పొందిన వ్యక్తులు మరింత జాగ్రత్తగా, సమతుల్యంగా స్పందించడం అవసరం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on February 20, 2026 10:57 am
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…
అనుకున్నదే అయింది. ‘పెద్ది’ సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించేశారు. ఐతే మార్చి నెలాఖరు…