నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది…! యూట్యూబర్గా అందరికీ సుపరిచితమే. వందలాది దేశాలు తిరిగి అక్కడి నుంచి వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు అదే అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు.
ప్రస్తుతం ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను దాని మాతృ సంస్థ మెటా నిలిపివేసింది. ఇంస్టాగ్రామ్ లో ఆయనకు 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. హిందూ దేవతలపై ఆయన చేసిన కామెంట్స్పై హైదరాబాద్ సీసీఎస్లో నమోదైన కేసులో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఈ చర్య అనంతరం అన్వేష్ మరో వీడియో విడుదల చేశారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను నిలుపుదల చేసినంత మాత్రాన తనకు పోయేది ఏమీ లేదంటూ వ్యంగ్యంగా చెప్పారు. అయితే అన్వేష్ తన హద్దు దాటి మాట్లాడుతున్నారని విమర్శలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి.
సొంత అభిప్రాయాలు కలిగి ఉండటం ప్రతి వ్యక్తి హక్కే. అయితే పెద్ద స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో ప్రభావం కలిగిన వ్యక్తి అయితే, అతని మాటలకు మరింత బాధ్యత అవసరం ఉంటుంది. ప్రజలు ఆయన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకునే అవకాశముండటంతో, ప్రతి మాట సామాజిక ప్రభావాన్ని చూపుతుంది.
వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసే సమయంలో సామాజిక బాధ్యత, సమాజంలోని వర్గాల మధ్య సమన్వయం, సామరస్యం దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాదరణ పొందిన వ్యక్తులు మరింత జాగ్రత్తగా, సమతుల్యంగా స్పందించడం అవసరం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on February 20, 2026 10:57 am
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
ఇంట్లో బైక్ను స్టార్ట్లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన…
క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా…
కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…
వైసీపీ అధినేత జగన్కు జనసేన పార్టీముఖ్య నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. కీలక సూచనలు చేశారు. అయితే.. జగన్ ఎవరి మాటా…