Trends

తాగేసి రూ.10కోట్ల కారుతో వ్యాపారి కొడుకు ఆరాచకం…

బలుపు చేష్టలు ఎంత భయానకంగా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడో వ్యాపారి కొడుకు. ఫుల్ గా తాగేసి.. ఇష్టారాజ్యంగా డ్రైవ్ చేయటమే కాదు.. అమాయకుల ప్రాణాల మీద ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరించిన తీరును చూస్తే నోట మాట రాదంతే.

ఉత్తరప్రదేశ్ లోని ఒక బడా వ్యాపారి కొడుకు ఫుల్ గా తాగేసి మద్యం మత్తులో రెచ్చిపోయాడు. రూ.10 కోట్ల విలువైన లంబోర్గిని కారుతో అతడు క్రియేట్ చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. అసలేం జరిగిందంటే..

యూపీలోని ప్రధాన నగరాల్లో ఒకటైన కాన్పూరు నగరంలో ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా. అతడి గారాలపట్టి శివం. ఇతగాడు ఆదివారం రాత్రి ఫుల్ గా తాగేసి మద్యం మత్తులో విలాసవంతమైన లంబోర్గిని కారును రాకెట్ స్పీడ్ తో రోడ్ల మీద పరుగులు తీయించాడు. ఈ కారణంగా పెను ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదకరంగా కారును నడిపి ఒక ఆటోను ఢీకొట్టిన ఉదంతంలో ఇతగాడు ప్రయాణిస్తున్న కారు ఏకంగా పది అడుగుల ఎత్తుకు గాల్లో ఎగిరి రోడ్డు మీద ఉన్న పాదచారులపైనా.. వాహనాలపైకి దూసుకెళ్లింది.
ఈ ఉదంతంలో ఏ పాపం తెలీని ఆరుగురు తీవ్ర గాయాల బారిన పడ్డారు.

ప్రమాదం జరిగినంతనే.. ఘటనా స్థలం నుంచి అతగాడు పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే.. స్థానికులు అతడ్ని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర ప్రమాద ఘటన గురించి తెలిసినంతనే మరో కారులో అక్కడకు చేరుకున్న వ్యాపారి కేకే మిశ్రా.. బౌన్సర్లతో  కలిసి వచ్చాడు.

స్థానికులపై ఆయన దౌర్జన్యానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైప్రొఫైల్ కేసు కావటంతో నిందితుడ్ని తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కేకే మిశ్రా విషయానికి వస్తే ఆయనకు చెందిన బన్షిదర్ ఎక్స్ పోర్ట్ ప్రైవేటు లిమిటెడ్ అనే పొగాకు కంపెనీ చాలా పెద్దది. గతంలో ఈ సంస్థపై ఐటీ దాడులు నిర్వహించి రూ.100 కోట్లకు పైనే పన్ను ఎగవేసినట్లుగా గుర్తించినట్లు చెబుతారు. మరి.. ఈ తరహా కేసుల విషయంలో యూపీ సీఎం యోగి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

This post was last modified on February 9, 2026 2:23 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అమరావతి అగ్నిప్రమాదం వెనుక అసలు నిజం

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనలో కుట్ర కోణమేమీ లేదని తేలిపోయయింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన…

37 minutes ago

సంక్రాంతి ‘బరి’ మీద మెగా డాటర్ గురి

వరుణ్ తేజ్ హీరోగా యుదు వంశీ దర్శకత్వం వహించే బరి షూటింగ్ ఇవాళ లాంఛనంగా ప్రారంభమయ్యింది. నీహారిక కొణిదెల నిర్మాత…

60 minutes ago

మళ్లీ జగన్ లాంటోళ్లు వస్తే… అమరావతిపై షర్మిల

మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే అనే ముందుచూపు చంద్రబాబు నాయుడు విజన్ కు నిదర్శనం అని వైయస్ షర్మిల…

2 hours ago

చిరంజీవి రవితేజ… జమీల్ జమాలి ఫ్రెండ్సే

అదేంటి దురంధర్ లో మంత్రి జమీల్ జమాలికి మన టాలీవుడ్ చిరంజీవి, రవితేజకు కనెక్షన్ ఏమనుకుంటున్నారా. కొన్ని సినిమా సంగతులు…

3 hours ago

గుంటూరు రాజకీయం వేడెక్కుతుంది

గుంటూరు తూర్పు.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న నియోజ‌క‌వ‌ర్గం ఇదే!. అయితే.. దీనిపైనే ఎక్కువ‌గా టాక్ న‌డుస్తోంది. దీనికి…

7 hours ago

ద‌క్షిణాదిపై కేంద్రం ప‌ట్టు.. ప్ర‌మోద‌మా? ప్ర‌మాద‌మా?

ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం (కూట‌మి) ప‌ట్టు పెంచుకుంటోందా? రాజ‌కీయంగా వ్యూహాత్మక స్టెప్పులు వేస్తోందా? అంటే.. ఒన‌నే అంటున్నారు…

10 hours ago