రాజకీయంగా తమకు తగినంత న్యాయం జరగడం లేదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు అసంతృప్తితో ఉన్నారా? ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నప్పటికీ సరిపడినన్ని సీట్లు తమకు కేటాయించడం లేదని వారు గుర్రుగా ఉన్నారా? ఇక, ఉప ముఖ్యమంత్రి పదవిపై కమ్మవారి కన్ను పడిందా?
ఈ సారి ఎలాగైనా డిప్యూటీ సీఎం పోస్టు తమ సామాజిక వర్గానికే కావాలని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్(కేజీఎఫ్) ఫిక్సయిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే, ఇదంతా ఏపీ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం కాదు..తమిళనాట తమకు మరింత ప్రాధాన్యమివ్వాలని అక్కడి కమ్మ సామాజిక వర్గ ప్రముఖుల డిమాండ్ వ్యవహారం.
నైపుణ్యాలపరంగా, సాంస్కృతిక పరంగా, వ్యాపారపరంగా, సామాజిక బాధ్యత పరంగా కమ్మ వ్యక్తులు ముందు వరుసలో ఉంటారని, అటువంటిది రాజకీయాల్లో ఎందుకు వెనకబడి ఉండాలని అన్నది వారి ప్రశ్న. ఈ క్రమంలోనే తమిళనాట అన్ని రాజకీయ పార్టీలకు కేజీఎఫ్ అల్టిమేటం జారీ చేసింది. వేలాది మందితో మెగా కమ్మ మహానాడు నిర్వహించి బల ప్రదర్శనతో తమ వాణి వినిపించింది.
ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల మంది కమ్మ సామాజిక చెందిన వారున్నారని, ఇది దేశ జనాభాలో 1.5 శాతం కన్నా ఎక్కువ అని కమ్మ ప్రముఖులు అన్నారు. తమిళనాట 65 లక్షల మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజలున్నా …రావాల్సినంత గుర్తింపు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సామాజిక ఐక్యతతోనే రాజకీయ బలం చాటుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. 8 శాతం ఓటు బ్యాంకు ఉన్నా12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే కమ్మవారున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో 8 శాతం కమ్మ ఓటింగ్, 3 కోట్ల మంది తెలుగు వారి ఓటింగ్ నిర్ణయాత్మమని, కనీసం 30 మందికి ఎమ్మెల్యే టికెట్లు, ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన వారికే తమ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ మహానాడుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కమ్మ ప్రముఖులు ఈ మహానాడుకు హాజరయ్యారు. తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్య రాజాతో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు ఈ మహానాడుకు హాజరయ్యారు.
This post was last modified on February 9, 2026 2:05 pm
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…