Political News

డిప్యూటీ సీఎం సీటుపై కమ్మవారి కన్ను

రాజకీయంగా తమకు తగినంత న్యాయం జరగడం లేదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు అసంతృప్తితో ఉన్నారా? ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నప్పటికీ సరిపడినన్ని సీట్లు తమకు కేటాయించడం లేదని వారు గుర్రుగా ఉన్నారా? ఇక, ఉప ముఖ్యమంత్రి పదవిపై కమ్మవారి కన్ను పడిందా?

ఈ సారి ఎలాగైనా డిప్యూటీ సీఎం పోస్టు తమ సామాజిక వర్గానికే కావాలని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్(కేజీఎఫ్) ఫిక్సయిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే, ఇదంతా ఏపీ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం కాదు..తమిళనాట తమకు మరింత ప్రాధాన్యమివ్వాలని అక్కడి కమ్మ సామాజిక వర్గ ప్రముఖుల డిమాండ్ వ్యవహారం.

నైపుణ్యాలపరంగా, సాంస్కృతిక పరంగా, వ్యాపారపరంగా, సామాజిక బాధ్యత పరంగా కమ్మ వ్యక్తులు ముందు వరుసలో ఉంటారని, అటువంటిది రాజకీయాల్లో ఎందుకు వెనకబడి ఉండాలని అన్నది వారి ప్రశ్న. ఈ క్రమంలోనే తమిళనాట అన్ని రాజకీయ పార్టీలకు కేజీఎఫ్ అల్టిమేటం జారీ చేసింది. వేలాది మందితో మెగా కమ్మ మహానాడు నిర్వహించి బల ప్రదర్శనతో తమ వాణి వినిపించింది.

ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల మంది కమ్మ సామాజిక చెందిన వారున్నారని, ఇది దేశ జనాభాలో 1.5 శాతం కన్నా ఎక్కువ అని కమ్మ ప్రముఖులు అన్నారు. తమిళనాట 65 లక్షల మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజలున్నా …రావాల్సినంత గుర్తింపు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సామాజిక ఐక్యతతోనే రాజకీయ బలం చాటుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. 8 శాతం ఓటు బ్యాంకు ఉన్నా12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే కమ్మవారున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాబోయే ఎన్నికల్లో 8 శాతం కమ్మ ఓటింగ్, 3 కోట్ల మంది తెలుగు వారి ఓటింగ్ నిర్ణయాత్మమని, కనీసం 30 మందికి ఎమ్మెల్యే టికెట్లు, ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన వారికే తమ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ మహానాడుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కమ్మ ప్రముఖులు ఈ మహానాడుకు హాజరయ్యారు. తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్య రాజాతో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు ఈ మహానాడుకు హాజరయ్యారు.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

5 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

7 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

8 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

9 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

10 hours ago