Political News

డిప్యూటీ సీఎం సీటుపై కమ్మవారి కన్ను

రాజకీయంగా తమకు తగినంత న్యాయం జరగడం లేదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు అసంతృప్తితో ఉన్నారా? ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నప్పటికీ సరిపడినన్ని సీట్లు తమకు కేటాయించడం లేదని వారు గుర్రుగా ఉన్నారా? ఇక, ఉప ముఖ్యమంత్రి పదవిపై కమ్మవారి కన్ను పడిందా?

ఈ సారి ఎలాగైనా డిప్యూటీ సీఎం పోస్టు తమ సామాజిక వర్గానికే కావాలని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్(కేజీఎఫ్) ఫిక్సయిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే, ఇదంతా ఏపీ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం కాదు..తమిళనాట తమకు మరింత ప్రాధాన్యమివ్వాలని అక్కడి కమ్మ సామాజిక వర్గ ప్రముఖుల డిమాండ్ వ్యవహారం.

నైపుణ్యాలపరంగా, సాంస్కృతిక పరంగా, వ్యాపారపరంగా, సామాజిక బాధ్యత పరంగా కమ్మ వ్యక్తులు ముందు వరుసలో ఉంటారని, అటువంటిది రాజకీయాల్లో ఎందుకు వెనకబడి ఉండాలని అన్నది వారి ప్రశ్న. ఈ క్రమంలోనే తమిళనాట అన్ని రాజకీయ పార్టీలకు కేజీఎఫ్ అల్టిమేటం జారీ చేసింది. వేలాది మందితో మెగా కమ్మ మహానాడు నిర్వహించి బల ప్రదర్శనతో తమ వాణి వినిపించింది.

ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల మంది కమ్మ సామాజిక చెందిన వారున్నారని, ఇది దేశ జనాభాలో 1.5 శాతం కన్నా ఎక్కువ అని కమ్మ ప్రముఖులు అన్నారు. తమిళనాట 65 లక్షల మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజలున్నా …రావాల్సినంత గుర్తింపు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సామాజిక ఐక్యతతోనే రాజకీయ బలం చాటుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. 8 శాతం ఓటు బ్యాంకు ఉన్నా12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే కమ్మవారున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాబోయే ఎన్నికల్లో 8 శాతం కమ్మ ఓటింగ్, 3 కోట్ల మంది తెలుగు వారి ఓటింగ్ నిర్ణయాత్మమని, కనీసం 30 మందికి ఎమ్మెల్యే టికెట్లు, ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన వారికే తమ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ మహానాడుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కమ్మ ప్రముఖులు ఈ మహానాడుకు హాజరయ్యారు. తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్య రాజాతో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు ఈ మహానాడుకు హాజరయ్యారు.

This post was last modified on February 9, 2026 2:05 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

16 minutes ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

1 hour ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

1 hour ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

4 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago