రాజకీయంగా తమకు తగినంత న్యాయం జరగడం లేదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు అసంతృప్తితో ఉన్నారా? ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నప్పటికీ సరిపడినన్ని సీట్లు తమకు కేటాయించడం లేదని వారు గుర్రుగా ఉన్నారా? ఇక, ఉప ముఖ్యమంత్రి పదవిపై కమ్మవారి కన్ను పడిందా?
ఈ సారి ఎలాగైనా డిప్యూటీ సీఎం పోస్టు తమ సామాజిక వర్గానికే కావాలని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్(కేజీఎఫ్) ఫిక్సయిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే, ఇదంతా ఏపీ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం కాదు..తమిళనాట తమకు మరింత ప్రాధాన్యమివ్వాలని అక్కడి కమ్మ సామాజిక వర్గ ప్రముఖుల డిమాండ్ వ్యవహారం.
నైపుణ్యాలపరంగా, సాంస్కృతిక పరంగా, వ్యాపారపరంగా, సామాజిక బాధ్యత పరంగా కమ్మ వ్యక్తులు ముందు వరుసలో ఉంటారని, అటువంటిది రాజకీయాల్లో ఎందుకు వెనకబడి ఉండాలని అన్నది వారి ప్రశ్న. ఈ క్రమంలోనే తమిళనాట అన్ని రాజకీయ పార్టీలకు కేజీఎఫ్ అల్టిమేటం జారీ చేసింది. వేలాది మందితో మెగా కమ్మ మహానాడు నిర్వహించి బల ప్రదర్శనతో తమ వాణి వినిపించింది.
ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల మంది కమ్మ సామాజిక చెందిన వారున్నారని, ఇది దేశ జనాభాలో 1.5 శాతం కన్నా ఎక్కువ అని కమ్మ ప్రముఖులు అన్నారు. తమిళనాట 65 లక్షల మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజలున్నా …రావాల్సినంత గుర్తింపు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సామాజిక ఐక్యతతోనే రాజకీయ బలం చాటుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. 8 శాతం ఓటు బ్యాంకు ఉన్నా12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే కమ్మవారున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో 8 శాతం కమ్మ ఓటింగ్, 3 కోట్ల మంది తెలుగు వారి ఓటింగ్ నిర్ణయాత్మమని, కనీసం 30 మందికి ఎమ్మెల్యే టికెట్లు, ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన వారికే తమ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ మహానాడుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కమ్మ ప్రముఖులు ఈ మహానాడుకు హాజరయ్యారు. తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్య రాజాతో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు ఈ మహానాడుకు హాజరయ్యారు.
This post was last modified on February 9, 2026 2:05 pm
ఎవడో యుద్దం చేసుకోవటం.. మరెవరో దానికి సంబంధించిన మూల్యాన్ని చెల్లించాల్సి రావటం. నిజానికి యుద్దంతో ఇదే తంటా. మనకు ఏ…
పరిమళ్ నత్వానీ. ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. కానీ, ఈయన పెద్ద పారిశ్రామిక వేత్త. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈయన…
టీ20 వరల్డ్ కప్ 2026 మొదటి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ప్రయాణం ముగిసింది. అజేయంగా సెమీస్కు వచ్చిన ఆ జట్టు.. కీలక…
హే భగవాన్ కంటెంట్ చూసి హే బలవంత్ గా మార్చమన్నారు. కపుల్ ఫ్రెండ్లి టైటిల్ లో వేరే అర్థం ఉందని…
చిరంజీవి అంటే.. మెగాస్టార్ చిరంజీవి కాదు. ఉత్తరాంధ్రలోని ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని…
ఒకప్పుడు హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన నటుడు శివాజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి చాలా సంవత్సరాలయ్యింది. చిరంజీవి…