Trends

ప్రముఖ దేవాలయంలో హిందువులకు మాత్రమే ప్రవేశం?

ఉత్తరాఖండ్‌లోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయాల్లో ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని ఆలయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించింది. చార్‌ధామ్ పరిధిలోని ఈ ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలనే అంశాన్ని బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) బోర్డు సమావేశంలో ఆమోదించనున్నట్లు సమాచారం.

ఈ రెండు ఆలయాలతో పాటు కమిటీ పరిధిలోకి వచ్చే ఇతర దేవాలయాల్లోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని బీకేటీసీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు. ఆలయాల సంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణ దృష్ట్యా ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు కమిటీ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే గంగోత్రి ధామ్‌లో హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించగా, దీనిపై గంగోత్రి టెంపుల్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలకూ ఇదే తరహా నిబంధనలు అమలు చేయాలని కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చార్‌ధామ్ యాత్ర ప్రారంభానికి ముందే ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశముందని సమాచారం.

ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్‌ 23న తిరిగి తెరుచుకోనుంది. కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకునే తేదీని మహాశివరాత్రి రోజున ప్రకటించనున్నారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్‌ 19న అక్షయ తృతీయ సందర్భంగా తెరుచుకోనున్నాయి. అయితే, ఈ కొత్త ప్రవేశ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

Kumar

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

7 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

6 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

6 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

6 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago