Trends

పరీక్ష గదిలో సీసీ కెమెరాలు.. కాబోయే డాక్టర్స్ బీ కేర్!

 ఏపీలో వైద్య విద్య పరీక్షలలో నిఘా ఏర్పాటు చేశారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న వారు ఇక నుంచి సీసీ కెమెరాల నీడన పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వైద్య విద్య పరీక్షల్లో పారదర్శకతను మరింత పెంచే దిశగా ఈ చర్చలు తీసుకున్నారు. ఈ రోజు ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ‘రిమోట్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌’ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రారంభించారు. రాష్ట్రంలోని 37 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో నిర్వహించే యూజీ, పీజీ మెడికల్‌ వార్షిక, సప్లిమెంటరీ పరీక్షలను సీసీ కెమెరాల ద్వారా ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

గతంలో పలు కళాశాలలలో కాపీయింగ్, మాల్మాల్‌ప్రాక్టీస్‌ వంటి అక్రమాల జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. వీటికి అడ్డు కట్ట వేసేందుకు ఈ ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోని సీసీ కెమెరాలను నేరుగా యూనివర్సిటీలోని కమాండ్‌ కంట్రోల్‌ రూముతో అనుసంధానం చేశారు. అన్ని కోర్సులు కలిపి ఏడాదికి సుమారు 60 వేల మంది విద్యార్థులు యూనివర్సిటీ ద్వారా జరిగే పరీక్షలకు హాజరవుతున్నారు.

పరీక్షల సమయంలో విద్యార్థుల కదలికల దృశ్యాలు కమాండ్‌ కంట్రోల్‌ రూములోని కంప్యూటర్లలో 70 రోజుల వరకు భద్రపరచేలా ఏర్పాట్లు చేశారు. రికార్డింగ్‌ చెడిపోకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి వైద్య కళాశాలలో సగటున 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, కమాండ్‌ కంట్రోల్‌ రూములో ఆరు స్క్రీన్ల వీడియో వాల్‌, పది కంప్యూటర్లు ఉన్నాయి. సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఏఐ సాయంతో వెంటనే సమాచారం అందేలా వ్యవస్థ రూపొందించారు. ఇంటర్నెట్‌ అంతరాయం ఉన్న సమయంలోనూ పరీక్షల దృశ్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.

ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కార్యకలాపాలను ఓరిగో బిజ్‌ సొల్యూషన్స్‌ పర్యవేక్షించనుండగా, దూరాంక్‌ సంస్థ సాఫ్ట్‌వేర్‌ అందించింది. కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ.30 లక్షలు ఖర్చు కాగా, రెండేళ్ల నిర్వహణకు రూ.1.5 కోట్లు వ్యయం అవుతుంది. మొదటగా ఎంబీబీఎస్‌, పీజీ పరీక్షలను పర్యవేక్షించగా, దశలవారీగా డెంటల్‌, ఆయుర్వేద, హోమియో, నర్సింగ్‌ తదితర కోర్సుల పరీక్షలనూ ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకు రానున్నట్లు అధికారులు తెలిపారు.  

This post was last modified on January 22, 2026 9:48 pm

Share

Recent Posts

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

39 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

47 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

59 minutes ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

3 hours ago