Trends

పరీక్ష గదిలో సీసీ కెమెరాలు.. కాబోయే డాక్టర్స్ బీ కేర్!

 ఏపీలో వైద్య విద్య పరీక్షలలో నిఘా ఏర్పాటు చేశారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న వారు ఇక నుంచి సీసీ కెమెరాల నీడన పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వైద్య విద్య పరీక్షల్లో పారదర్శకతను మరింత పెంచే దిశగా ఈ చర్చలు తీసుకున్నారు. ఈ రోజు ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ‘రిమోట్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌’ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రారంభించారు. రాష్ట్రంలోని 37 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో నిర్వహించే యూజీ, పీజీ మెడికల్‌ వార్షిక, సప్లిమెంటరీ పరీక్షలను సీసీ కెమెరాల ద్వారా ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

గతంలో పలు కళాశాలలలో కాపీయింగ్, మాల్మాల్‌ప్రాక్టీస్‌ వంటి అక్రమాల జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. వీటికి అడ్డు కట్ట వేసేందుకు ఈ ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోని సీసీ కెమెరాలను నేరుగా యూనివర్సిటీలోని కమాండ్‌ కంట్రోల్‌ రూముతో అనుసంధానం చేశారు. అన్ని కోర్సులు కలిపి ఏడాదికి సుమారు 60 వేల మంది విద్యార్థులు యూనివర్సిటీ ద్వారా జరిగే పరీక్షలకు హాజరవుతున్నారు.

పరీక్షల సమయంలో విద్యార్థుల కదలికల దృశ్యాలు కమాండ్‌ కంట్రోల్‌ రూములోని కంప్యూటర్లలో 70 రోజుల వరకు భద్రపరచేలా ఏర్పాట్లు చేశారు. రికార్డింగ్‌ చెడిపోకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి వైద్య కళాశాలలో సగటున 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, కమాండ్‌ కంట్రోల్‌ రూములో ఆరు స్క్రీన్ల వీడియో వాల్‌, పది కంప్యూటర్లు ఉన్నాయి. సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఏఐ సాయంతో వెంటనే సమాచారం అందేలా వ్యవస్థ రూపొందించారు. ఇంటర్నెట్‌ అంతరాయం ఉన్న సమయంలోనూ పరీక్షల దృశ్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.

ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కార్యకలాపాలను ఓరిగో బిజ్‌ సొల్యూషన్స్‌ పర్యవేక్షించనుండగా, దూరాంక్‌ సంస్థ సాఫ్ట్‌వేర్‌ అందించింది. కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ.30 లక్షలు ఖర్చు కాగా, రెండేళ్ల నిర్వహణకు రూ.1.5 కోట్లు వ్యయం అవుతుంది. మొదటగా ఎంబీబీఎస్‌, పీజీ పరీక్షలను పర్యవేక్షించగా, దశలవారీగా డెంటల్‌, ఆయుర్వేద, హోమియో, నర్సింగ్‌ తదితర కోర్సుల పరీక్షలనూ ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకు రానున్నట్లు అధికారులు తెలిపారు.  

This post was last modified on January 22, 2026 9:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

43 minutes ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

3 hours ago

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

4 hours ago

హౌస్ ఫుల్, బ్లాక్ బస్టర్ అంతా ఉత్తిదేనా?

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…

4 hours ago

ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…

4 hours ago

దురంధర్-2 వాయిదా పడితే..?

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…

4 hours ago