Trends

పాక్ బుద్ధి మారలేదు: క్రికెట్ ప్రచారంలోనూ భారత్‌పై అక్కసు!

మైదానంలో భారత్‌పై గెలవడం చేతకాక, పాకిస్థాన్ ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా తన అక్కసు వెళ్లగక్కుతోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) విడుదల చేసిన తాజా ప్రోమో ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఆస్ట్రేలియా పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నట్లు చూపిస్తూనే, భారత్‌ను కించపరిచేలా డైలాగులు పెట్టడం పాక్ క్రీడా విలువల పతనాన్ని సూచిస్తోంది.

ఈ ప్రోమో చివరిలో ఒక పర్యాటకుడు క్యాబ్ డ్రైవర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే.. “షేక్ హ్యాండ్ ఇవ్వడం మర్చిపోయారా? బహుశా మీరు మా పొరుగు దేశంలో బస చేసినట్టున్నారు” అని డ్రైవర్ చెప్పే డైలాగ్ ఉంది. భారత్ అనుసరిస్తున్న ‘నో హ్యాండ్‌షేక్’ పాలసీని ఎగతాళి చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని స్పష్టమవుతోంది. ఇలాంటి చౌకబారు కవ్వింపు చర్యలకు దిగడం పాక్ బోర్డు దిగజారుడుతనానికి నిదర్శనం అనే కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి. ఏ క్రికెట్ బోర్డ్ కూడా ఈ విధంగా చేయలేదు.

భారత జట్టు పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేయకపోవడం వెనుక బలమైన కారణం ఉంది. గతేడాది పహల్గామ్ దాడుల్లో అమరులైన భారత సైనికులకు సంఘీభావంగా, ఆ దేశ ఉగ్రవాద చర్యలకు నిరసనగా టీమిండియా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. గతేడాది జరిగిన ఆసియా కప్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని అమలు చేయగా, మహిళా క్రికెట్ జట్టు అండర్ 19 జట్లు కూడా దీనినే కొనసాగిస్తున్నాయి. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, దేశ గౌరవానికి సంబంధించిన విషయమని భారత్ చాటిచెప్పింది.

పాకిస్థాన్ జట్టు ఇటీవల భారత్‌తో జరిగిన దాదాపు అన్ని ప్రధాన టోర్నమెంట్లలో ఘోరంగా ఓడిపోయింది. మైదానంలో టీమిండియా సత్తా ముందు తలవంచిన పాక్, ఇప్పుడు ఇలాంటి ప్రోమోలతో మానసిక యుద్ధం చేయాలని చూస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో మళ్ళీ ఈ ఇరు జట్లు తలపడనున్నాయి. ఆట ద్వారా సమాధానం చెప్పడం మానేసి, ఇలాంటి వివాదాస్పద ప్రకటనలతో కాలక్షేపం చేయడం పాక్ క్రికెట్ పతనానికి దారితీస్తోందని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.

భారత్ తన పట్టువిడవకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం పట్ల కఠినంగా ఉండటాన్ని యావత్ దేశం గర్విస్తోంది. పాక్ ఎన్ని కుయుక్తులు పన్నినా, మైదానంలో టీమిండియా ఇచ్చే సమాధానమే అసలైన విజయం. ఫిబ్రవరిలో జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్‌లో కూడా భారత్ మరోసారి తన విశ్వరూపం చూపిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.

This post was last modified on January 22, 2026 9:46 pm

Share
Show comments
Published by
Satya
Tags: Pakistan

Recent Posts

బీజేపీ బాట‌లో వైసీపీ ఎంపీ?

రాజ‌కీయాల్లో జంపింగులు కొత్త‌కాదు. ఎవ‌రికి న‌చ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవ‌డ‌మూ కొత్త‌కాదు. ఎవ‌రికి అవ‌స‌రం.. అవ‌కాశం ఉన్న దిశ‌గా నాయ‌కులు,…

4 hours ago

ఎటు చూసినా… వైసీపీకి ఛాన్స్ లేదా బ్రో?

ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ క‌నిపించ‌డం లేదా? ఏ వ‌ర్గం కూడా వైసీపీకి ఆశించిన మేర‌కు చేరువ అయ్యే అవ‌కాశం…

7 hours ago

జమీల్ సాబ్ భయపడుతున్నారా?

గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…

8 hours ago

బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పు.. ఖాతాదారుడికి వాతలు?

గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…

8 hours ago

ట్యాంక్ బండ్ హీరోకు సీఎం ఆపన్న హస్తం

ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ…

9 hours ago

తెలివిగా ప్లాన్ చేసుకుంటున్న జన నాయకుడు

జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…

11 hours ago