Trends

పాక్ బుద్ధి మారలేదు: క్రికెట్ ప్రచారంలోనూ భారత్‌పై అక్కసు!

మైదానంలో భారత్‌పై గెలవడం చేతకాక, పాకిస్థాన్ ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా తన అక్కసు వెళ్లగక్కుతోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) విడుదల చేసిన తాజా ప్రోమో ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఆస్ట్రేలియా పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నట్లు చూపిస్తూనే, భారత్‌ను కించపరిచేలా డైలాగులు పెట్టడం పాక్ క్రీడా విలువల పతనాన్ని సూచిస్తోంది.

ఈ ప్రోమో చివరిలో ఒక పర్యాటకుడు క్యాబ్ డ్రైవర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే.. “షేక్ హ్యాండ్ ఇవ్వడం మర్చిపోయారా? బహుశా మీరు మా పొరుగు దేశంలో బస చేసినట్టున్నారు” అని డ్రైవర్ చెప్పే డైలాగ్ ఉంది. భారత్ అనుసరిస్తున్న ‘నో హ్యాండ్‌షేక్’ పాలసీని ఎగతాళి చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని స్పష్టమవుతోంది. ఇలాంటి చౌకబారు కవ్వింపు చర్యలకు దిగడం పాక్ బోర్డు దిగజారుడుతనానికి నిదర్శనం అనే కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి. ఏ క్రికెట్ బోర్డ్ కూడా ఈ విధంగా చేయలేదు.

భారత జట్టు పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేయకపోవడం వెనుక బలమైన కారణం ఉంది. గతేడాది పహల్గామ్ దాడుల్లో అమరులైన భారత సైనికులకు సంఘీభావంగా, ఆ దేశ ఉగ్రవాద చర్యలకు నిరసనగా టీమిండియా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. గతేడాది జరిగిన ఆసియా కప్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని అమలు చేయగా, మహిళా క్రికెట్ జట్టు అండర్ 19 జట్లు కూడా దీనినే కొనసాగిస్తున్నాయి. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, దేశ గౌరవానికి సంబంధించిన విషయమని భారత్ చాటిచెప్పింది.

పాకిస్థాన్ జట్టు ఇటీవల భారత్‌తో జరిగిన దాదాపు అన్ని ప్రధాన టోర్నమెంట్లలో ఘోరంగా ఓడిపోయింది. మైదానంలో టీమిండియా సత్తా ముందు తలవంచిన పాక్, ఇప్పుడు ఇలాంటి ప్రోమోలతో మానసిక యుద్ధం చేయాలని చూస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో మళ్ళీ ఈ ఇరు జట్లు తలపడనున్నాయి. ఆట ద్వారా సమాధానం చెప్పడం మానేసి, ఇలాంటి వివాదాస్పద ప్రకటనలతో కాలక్షేపం చేయడం పాక్ క్రికెట్ పతనానికి దారితీస్తోందని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.

భారత్ తన పట్టువిడవకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం పట్ల కఠినంగా ఉండటాన్ని యావత్ దేశం గర్విస్తోంది. పాక్ ఎన్ని కుయుక్తులు పన్నినా, మైదానంలో టీమిండియా ఇచ్చే సమాధానమే అసలైన విజయం. ఫిబ్రవరిలో జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్‌లో కూడా భారత్ మరోసారి తన విశ్వరూపం చూపిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.

This post was last modified on January 22, 2026 9:46 pm

Share

Recent Posts

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

30 minutes ago

టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి…

49 minutes ago

పిఠాపురం ఇకపై పవన్ కంచు కోట

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…

2 hours ago

రక్తంతో రాసుకున్న ‘ప్యారడైజ్’ శాసనం

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…

3 hours ago

డీఎస్సీపైనే వైసీపీకి ఎందుకంత మంకుపట్టు?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…

3 hours ago

కొత్త మార్పుల వైపు చరణ్ & సుకుమార్ ?

ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…

4 hours ago