దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం వాతావరణమో, టెక్నికల్ సమస్యలో కాదు. కేవలం ఆ సంస్థ యాజమాన్యం చేసిన ఘోరమైన తప్పిదమే దీనికి మూలం. కొత్త నిబంధనల (FDTL) ప్రకారం పైలట్లకు ఇవ్వాల్సిన రెస్ట్ ఇవ్వకుండా, సరిపడా సిబ్బందిని నియమించుకోకుండా లాభాల కోసం కక్కుర్తి పడటమే ఈ సంక్షోభానికి అసలు కారణం. ప్రయాణికుల సౌకర్యం కంటే తమ బిజినెస్ మార్జిన్లకే ఇండిగో పెద్దపీట వేసింది.
నిజానికి ఈ కొత్త రూల్స్ గురించి జనవరి 2024లోనే తెలుసు. కొత్త పైలట్లను తీసుకోవడానికి, ఉన్నవారికి శిక్షణ ఇవ్వడానికి ఇండిగోకు ఏడాదికి పైగా సమయం దొరికింది. పైగా వారి సాఫ్ట్వేర్ సిస్టమ్స్ సిబ్బంది కొరత గురించి ముందే హెచ్చరిస్తాయి. అయినా సరే, ఆ వార్నింగ్స్ అన్నీ పక్కనపెట్టి, ఎలాగోలా నెట్టుకురావచ్చులే అనే అతి ధీమాతో టికెట్లు అమ్మేసింది. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు, తెలిసే చేసిన తప్పు.
ఇప్పుడు విమానాలు రద్దయ్యాక “మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం ” అంటే సరిపోతుందా? ఆ ప్రయాణం నమ్ముకుని ఎంతోమంది పెళ్లిళ్లు, పరీక్షలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు ప్లాన్ చేసుకున్నారు. అవన్నీ క్యాన్సిల్ అయితే వచ్చే మానసిక వేదనకు, బుక్ చేసుకున్న హోటల్స్, క్యాబ్ ఖర్చులకు ఎవరు బాధ్యత వహిస్తారు? రూ. 8 వేల టికెట్ క్యాన్సిల్ అయితే, అర్జంట్గా వేరే ఫ్లైట్లో వెళ్లడానికి రూ. 40 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. రీఫండ్ అనేది దీనికి ఏమాత్రం పరిహారం కాదు.
దేశీయ విమానయానంలో 60 శాతం వాటా ఉన్న ఇండిగో, తన ఆధిపత్యాన్ని ఇలా దుర్వినియోగం చేయడం దారుణం. అంతకంటే విచారకరమైన విషయం ఏంటంటే, ప్రయాణికుల సేఫ్టీ కోసం పెట్టిన రూల్స్ని, ఇండిగోను కాపాడటం కోసం డీజీసీఏ (DGCA) వెనక్కి తీసుకోవడం. సేఫ్టీ కంటే ఒక ప్రైవేట్ కంపెనీ షెడ్యూలే ముఖ్యమా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కాంపిటీషన్ కమిషన్ కూడా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
కేవలం జరిమానాలు వేసి వదిలేస్తే ఇలాంటివి మళ్లీ మళ్లీ జరుగుతాయి. ప్రజల సమయంతో, జీవితాలతో ఆటలాడుకుంటే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం నిరూపించాలి. లేదంటే కార్పొరేట్ సంస్థలు లాభాల కోసం సేఫ్టీని గాలికి వదిలేస్తూనే ఉంటాయి. ఇండిగో చేసింది కేవలం సర్వీస్ ఫెయిల్యూర్ మాత్రమే కాదు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం. దీనికి కచ్చితంగా జవాబుదారీతనం ఉండాల్సిందే అని ఇబ్బంది పడుతున్న వారు చెబుతున్నారు.
This post was last modified on December 8, 2025 10:09 am
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…