దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం వాతావరణమో, టెక్నికల్ సమస్యలో కాదు. కేవలం ఆ సంస్థ యాజమాన్యం చేసిన ఘోరమైన తప్పిదమే దీనికి మూలం. కొత్త నిబంధనల (FDTL) ప్రకారం పైలట్లకు ఇవ్వాల్సిన రెస్ట్ ఇవ్వకుండా, సరిపడా సిబ్బందిని నియమించుకోకుండా లాభాల కోసం కక్కుర్తి పడటమే ఈ సంక్షోభానికి అసలు కారణం. ప్రయాణికుల సౌకర్యం కంటే తమ బిజినెస్ మార్జిన్లకే ఇండిగో పెద్దపీట వేసింది.
నిజానికి ఈ కొత్త రూల్స్ గురించి జనవరి 2024లోనే తెలుసు. కొత్త పైలట్లను తీసుకోవడానికి, ఉన్నవారికి శిక్షణ ఇవ్వడానికి ఇండిగోకు ఏడాదికి పైగా సమయం దొరికింది. పైగా వారి సాఫ్ట్వేర్ సిస్టమ్స్ సిబ్బంది కొరత గురించి ముందే హెచ్చరిస్తాయి. అయినా సరే, ఆ వార్నింగ్స్ అన్నీ పక్కనపెట్టి, ఎలాగోలా నెట్టుకురావచ్చులే అనే అతి ధీమాతో టికెట్లు అమ్మేసింది. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు, తెలిసే చేసిన తప్పు.
ఇప్పుడు విమానాలు రద్దయ్యాక “మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం ” అంటే సరిపోతుందా? ఆ ప్రయాణం నమ్ముకుని ఎంతోమంది పెళ్లిళ్లు, పరీక్షలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు ప్లాన్ చేసుకున్నారు. అవన్నీ క్యాన్సిల్ అయితే వచ్చే మానసిక వేదనకు, బుక్ చేసుకున్న హోటల్స్, క్యాబ్ ఖర్చులకు ఎవరు బాధ్యత వహిస్తారు? రూ. 8 వేల టికెట్ క్యాన్సిల్ అయితే, అర్జంట్గా వేరే ఫ్లైట్లో వెళ్లడానికి రూ. 40 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. రీఫండ్ అనేది దీనికి ఏమాత్రం పరిహారం కాదు.
దేశీయ విమానయానంలో 60 శాతం వాటా ఉన్న ఇండిగో, తన ఆధిపత్యాన్ని ఇలా దుర్వినియోగం చేయడం దారుణం. అంతకంటే విచారకరమైన విషయం ఏంటంటే, ప్రయాణికుల సేఫ్టీ కోసం పెట్టిన రూల్స్ని, ఇండిగోను కాపాడటం కోసం డీజీసీఏ (DGCA) వెనక్కి తీసుకోవడం. సేఫ్టీ కంటే ఒక ప్రైవేట్ కంపెనీ షెడ్యూలే ముఖ్యమా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కాంపిటీషన్ కమిషన్ కూడా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
కేవలం జరిమానాలు వేసి వదిలేస్తే ఇలాంటివి మళ్లీ మళ్లీ జరుగుతాయి. ప్రజల సమయంతో, జీవితాలతో ఆటలాడుకుంటే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం నిరూపించాలి. లేదంటే కార్పొరేట్ సంస్థలు లాభాల కోసం సేఫ్టీని గాలికి వదిలేస్తూనే ఉంటాయి. ఇండిగో చేసింది కేవలం సర్వీస్ ఫెయిల్యూర్ మాత్రమే కాదు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం. దీనికి కచ్చితంగా జవాబుదారీతనం ఉండాల్సిందే అని ఇబ్బంది పడుతున్న వారు చెబుతున్నారు.
This post was last modified on December 8, 2025 10:09 am
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…