Trends

ఇండిగో: టికెట్ డబ్బులిస్తే సరిపోతుందా?

దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్‌లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం వాతావరణమో, టెక్నికల్ సమస్యలో కాదు. కేవలం ఆ సంస్థ యాజమాన్యం చేసిన ఘోరమైన తప్పిదమే దీనికి మూలం. కొత్త నిబంధనల (FDTL) ప్రకారం పైలట్లకు ఇవ్వాల్సిన రెస్ట్ ఇవ్వకుండా, సరిపడా సిబ్బందిని నియమించుకోకుండా లాభాల కోసం కక్కుర్తి పడటమే ఈ సంక్షోభానికి అసలు కారణం. ప్రయాణికుల సౌకర్యం కంటే తమ బిజినెస్ మార్జిన్లకే ఇండిగో పెద్దపీట వేసింది.

నిజానికి ఈ కొత్త రూల్స్ గురించి జనవరి 2024లోనే తెలుసు. కొత్త పైలట్లను తీసుకోవడానికి, ఉన్నవారికి శిక్షణ ఇవ్వడానికి ఇండిగోకు ఏడాదికి పైగా సమయం దొరికింది. పైగా వారి సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ సిబ్బంది కొరత గురించి ముందే హెచ్చరిస్తాయి. అయినా సరే, ఆ వార్నింగ్స్ అన్నీ పక్కనపెట్టి, ఎలాగోలా నెట్టుకురావచ్చులే అనే అతి ధీమాతో టికెట్లు అమ్మేసింది. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు, తెలిసే చేసిన తప్పు.

ఇప్పుడు విమానాలు రద్దయ్యాక “మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం ” అంటే సరిపోతుందా? ఆ ప్రయాణం నమ్ముకుని ఎంతోమంది పెళ్లిళ్లు, పరీక్షలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు ప్లాన్ చేసుకున్నారు. అవన్నీ క్యాన్సిల్ అయితే వచ్చే మానసిక వేదనకు, బుక్ చేసుకున్న హోటల్స్, క్యాబ్ ఖర్చులకు ఎవరు బాధ్యత వహిస్తారు? రూ. 8 వేల టికెట్ క్యాన్సిల్ అయితే, అర్జంట్‌గా వేరే ఫ్లైట్‌లో వెళ్లడానికి రూ. 40 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. రీఫండ్ అనేది దీనికి ఏమాత్రం పరిహారం కాదు.

దేశీయ విమానయానంలో 60 శాతం వాటా ఉన్న ఇండిగో, తన ఆధిపత్యాన్ని ఇలా దుర్వినియోగం చేయడం దారుణం. అంతకంటే విచారకరమైన విషయం ఏంటంటే, ప్రయాణికుల సేఫ్టీ కోసం పెట్టిన రూల్స్‌ని, ఇండిగోను కాపాడటం కోసం డీజీసీఏ (DGCA) వెనక్కి తీసుకోవడం. సేఫ్టీ కంటే ఒక ప్రైవేట్ కంపెనీ షెడ్యూలే ముఖ్యమా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కాంపిటీషన్ కమిషన్ కూడా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

కేవలం జరిమానాలు వేసి వదిలేస్తే ఇలాంటివి మళ్లీ మళ్లీ జరుగుతాయి. ప్రజల సమయంతో, జీవితాలతో ఆటలాడుకుంటే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం నిరూపించాలి. లేదంటే కార్పొరేట్ సంస్థలు లాభాల కోసం సేఫ్టీని గాలికి వదిలేస్తూనే ఉంటాయి. ఇండిగో చేసింది కేవలం సర్వీస్ ఫెయిల్యూర్ మాత్రమే కాదు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం. దీనికి కచ్చితంగా జవాబుదారీతనం ఉండాల్సిందే అని ఇబ్బంది పడుతున్న వారు చెబుతున్నారు.

Kumar

Recent Posts

బాబాయ్ సెంటిమెంట్ అబ్బాయికి కలిసి వస్తుందా

ముందు లీకైనట్టే ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం వాయిదా పడింది. జూలై 30 విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు…

13 minutes ago

టాలెంట్ వేట ఇలా కూడా చేయొచ్చు

టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలంటే ఎవరో ఒకరి దగ్గర శిష్యుడిగా చేరాలి. లేదా ఎవరైనా రిఫరెన్స్ తీసుకుని ప్రముఖ…

1 hour ago

లోకేష్‌నే వైసీపీ టార్గెట్ చేసిందా?

ఏపీలో విపక్షం వైసీపీ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదాన…

1 hour ago

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఏంటి పరిస్థితి

టాలీవుడ్ లో జూన్ నెలలో పెద్ది, మా ఇంటి బంగారం తమ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాయి. తెలుగు రాష్ట్రాల…

2 hours ago

రిషికొండ ప్యాలెస్ నుండి ప్రభుత్వానికి ఆదాయం ఉంటుందా?

రిషికొండ పాలెస్ లను వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా ఎట్టకేలకు ఓ కీలక అడుగు అయితే.పడింది. సాగర నగరం విశాఖ పర్యాటక…

3 hours ago

అలియా భట్ సినిమాకి ఇంత నెగిటివిటీనా

బాలీవుడ్ మూవీ అల్ఫా ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. అలియా భట్ టైటిల్ రోల్ పోషించగా శార్వరి వాఘ్ మరో…

3 hours ago