2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులనూ ఆ చిత్రం చెరిపేసింది. ఆ సినిమా రికార్డులు బద్దలు కావడానికి కొన్నేళ్లు పట్టింది. అవతార్ సాధించిన అసాధారణ విజయం చూశాక.. ఆ చిత్రానికి నాలుగు సీక్వెల్స్ తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్. కానీ మూడేళ్ల ముందు వచ్చిన తొలి సీక్వెల్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.
ప్రి రిలీజ్ హైప్ వల్ల ఈ సినిమాకు కూడా భారీ వసూళ్లు వచ్చాయి కానీ.. కంటెంట్ పరంగా ఈ చిత్రం కొంతమేరకు నిరాశపరిచిన మాట వాస్తవం. అది ఏ స్థాయిలో డిజప్పాయింట్ చేసిందంటే.. అవతార్ నెక్స్ట్ సీక్వెల్ ఫైర్ అండ్ యాష్ రిలీజ్ దగ్గర పడుతున్నా ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంటే కనిపించడం లేదు. అవతార్, అవతార్-2ల హైప్తో పోలిస్తే.. మినిమం బజ్ కూడా లేదు మూడో పార్ట్ కు.
ఐతే వరల్డ్ వైడ్ అన్ని భాషల్లోనూ డిసెంబరులో మూడో వీకెండ్ను అవతార్-3కే అంకితం చేసేశారు. ఇండియాలో కూడా అవతార్-3 కోసమని ఆ వీకెండ్ను ఖాళీగా వదిలేశారు. తెలుగులో కూడా డిసెంబరు 19కు కొత్త రిలీజ్లు ఏమీ లేవు. ఈ వీకెండ్లో ఏకంగా నాలుగు సినిమాలు రాబోతున్నాయి. క్రిస్మస్ వీకెండ్లోనూ పోటీ గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది. అఖండ-2 ఎప్పుడు వస్తుందో క్లారిటీ రావాల్సి ఉంది.
ఐతే రాబోయే వీకెండ్లో, క్రిస్మస్ వీకెండ్లో అంత పోటీలో నిలబడే బదులు డిసెంబరు 19కి ఒకట్రెండు సినిమాలను షెడ్యూల్ చేస్తే బాగుండేదేమో. పెద్దగా బజ్ లేని అవతార్-3ని చూసి అంతగా భయపడాలా అన్నది ప్రశ్న. ఆ సినిమాకు చాలా మంచి టాక్ వస్తే తప్ప.. కంగారుపడాల్సినంత సినిమా కాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అవతార్-3 గత రెండు చిత్రాల స్థాయిలో ప్రభావం చూపుతుందా అన్నది ప్రశ్నార్థకం. కాబట్టి దాంతో పాటుగా ఒకట్రెండు సినిమాలను రిలీజ్ చేస్తే ఇబ్బంది లేకపోవచ్చు.
This post was last modified on December 8, 2025 6:46 am
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…