అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది. అధిక శాతం డిసెంబర్ 12 డిమాండ్ చేస్తుండగా అంత తక్కువ వ్యవధిలో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవడం గురించి నిర్మాతలు తర్జన భర్జన పడుతున్నారు. సమస్య పరిష్కారమయ్యింది కానీ ఇంకా కోర్టు ఉత్తర్వులు రావాల్సి ఉంది. అవి చేతికి అందగానే ప్రీమియర్ షోలకు మళ్ళీ రెండు ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్లతో డీల్ మాట్లాడుకోవాలి. అదే రోజు మోగ్లీ, సైక్ సిద్దార్థ్, ఈషా, అన్నగారు వస్తారు లాంటి కొత్త రిలీజులున్నాయి. వీటిలో ఏవి తప్పుకుంటాయో ఇంకా క్లారిటీ లేదు.
ప్రొడ్యూసర్ల కోణంలో డిసెంబర్ 25 సేఫ్ గేమ్ అవుతుందని భావిస్తున్నారట. అయితే ఛాంపియన్, శంబాల వాయిదా వేసుకునే మూడ్ లో లేవు. ఎందుకంటే అగ్రిమెంట్లు, ఓటిటి డీల్స్ అన్నీ అయిపోయాయి. వాటి హీరోలు బాలయ్యతో పోల్చుకునే స్థాయి కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరినీ తక్కువంచనా వేయడానికి లేదు. ఛాంపియన్ నిర్మాతలు వైజయంతి సంస్థ కావడంతో డిస్ట్రిబ్యూషన్ పరంగా మంచి మద్దతు దక్కుతుంది. పైగా డిసెంబర్ 19న వచ్చే అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఏ సెంటర్స్, మల్టీప్లెక్సుల్లో దాని కాంపిటీషన్ తో చిక్కులు తప్పవు.
ఇవన్నీ చూసుకునే ఫ్యాన్స్ డిసెంబర్ 12 కావాలంటున్నారు. థియేటర్ల దగ్గర డిసెంబర్ 5 చేసిన అలంకరణ, బ్యానర్లు, లైటింగ్ అంతా అలాగే ఉంచేశారు. వేరే సినిమాలు ఆడుతున్నా సరే డెకరేషన్ తీసేయొద్దని ఓనర్లను రిక్వెస్ట్ చేసుకున్నారు. తక్కువ గ్యాప్ లో వస్తుందనే నమ్మకంతో అలా అంటున్నారు. అయితే రేపు సాయంత్రానికి దీని గురించి క్లారిటీ రావొచ్చని టాక్. నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు, డిస్ట్రిబ్యూటర్ల ప్రతినిధుల మధ్య దీని గురించే చర్చ జరిగింది కానీ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించడం లాంటివి చేయలేదు. ఏదేమైనా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకునే టైం అయితే వచ్చేసింది.
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…