Trends

Video: మందేసి రైల్వే ట్రాక్ పై కారు నడిపిన మహిళ

ఇది కలికాలం…అందులోనూ వర్షా కాలం…క్లైమేట్ బాగుంది కదా అని ఓ మహిళ అరె మామా ఏక్ పెగ్ లా అంటూ ఊటుగా తాగేసింది. అంతవరకు పర్వాలేదు….కానీ, ఆమెకు లిక్కర్ ఇచ్చిన కిక్కు సరిపోలేదు. అందుకే, ధూమ్ మచాలే..ధూమ్ మచాలే..ధూమ్ అంటూ ఏకంగా రైలు పట్టాల మీద కారు నడిపింది.

సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్ లో మందేసి ఆమె చేసిన రచ్చ వల్లే పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఆ మహిళను గుర్తించి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శంకర్ పల్లిలోని కొడంగల్ గేట్ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మహిళ ఒకరు రైలు పట్టాలపై కారు నడపడాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. ఆమెను ఆపేందుకు ప్రయత్నించా ఫలితం లేకపోయింది.

ఫుల్ గా మందేసిన ఆ మహిళ..కారు ఆపకుండా వెళ్లిపోయింది. ఎలాగోలా నానా తిప్పలు పడి ఎట్టకేలకు ఆ కారును ఆపిన రైల్వే సిబ్బంది…స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, రైల్వే సిబ్బంది ఆ వాహనాన్ని ట్రాక్ మీద నుంచి కిందకు దించి శంకర్ పల్లి-హైదరాబాద్ మార్గంలోని రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. అయితే, ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కూడా లేకపోవడం చూసి పోలీసులు షాకయ్యారు.

This post was last modified on June 26, 2025 11:33 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

35 minutes ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

56 minutes ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

2 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

3 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

3 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

3 hours ago