ఇది కలికాలం…అందులోనూ వర్షా కాలం…క్లైమేట్ బాగుంది కదా అని ఓ మహిళ అరె మామా ఏక్ పెగ్ లా అంటూ ఊటుగా తాగేసింది. అంతవరకు పర్వాలేదు….కానీ, ఆమెకు లిక్కర్ ఇచ్చిన కిక్కు సరిపోలేదు. అందుకే, ధూమ్ మచాలే..ధూమ్ మచాలే..ధూమ్ అంటూ ఏకంగా రైలు పట్టాల మీద కారు నడిపింది.
సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్ లో మందేసి ఆమె చేసిన రచ్చ వల్లే పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఆ మహిళను గుర్తించి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శంకర్ పల్లిలోని కొడంగల్ గేట్ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మహిళ ఒకరు రైలు పట్టాలపై కారు నడపడాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. ఆమెను ఆపేందుకు ప్రయత్నించా ఫలితం లేకపోయింది.
ఫుల్ గా మందేసిన ఆ మహిళ..కారు ఆపకుండా వెళ్లిపోయింది. ఎలాగోలా నానా తిప్పలు పడి ఎట్టకేలకు ఆ కారును ఆపిన రైల్వే సిబ్బంది…స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, రైల్వే సిబ్బంది ఆ వాహనాన్ని ట్రాక్ మీద నుంచి కిందకు దించి శంకర్ పల్లి-హైదరాబాద్ మార్గంలోని రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. అయితే, ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కూడా లేకపోవడం చూసి పోలీసులు షాకయ్యారు.
This post was last modified on June 26, 2025 11:33 am
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…