ఇది కలికాలం…అందులోనూ వర్షా కాలం…క్లైమేట్ బాగుంది కదా అని ఓ మహిళ అరె మామా ఏక్ పెగ్ లా అంటూ ఊటుగా తాగేసింది. అంతవరకు పర్వాలేదు….కానీ, ఆమెకు లిక్కర్ ఇచ్చిన కిక్కు సరిపోలేదు. అందుకే, ధూమ్ మచాలే..ధూమ్ మచాలే..ధూమ్ అంటూ ఏకంగా రైలు పట్టాల మీద కారు నడిపింది.
సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్ లో మందేసి ఆమె చేసిన రచ్చ వల్లే పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఆ మహిళను గుర్తించి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శంకర్ పల్లిలోని కొడంగల్ గేట్ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మహిళ ఒకరు రైలు పట్టాలపై కారు నడపడాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. ఆమెను ఆపేందుకు ప్రయత్నించా ఫలితం లేకపోయింది.
ఫుల్ గా మందేసిన ఆ మహిళ..కారు ఆపకుండా వెళ్లిపోయింది. ఎలాగోలా నానా తిప్పలు పడి ఎట్టకేలకు ఆ కారును ఆపిన రైల్వే సిబ్బంది…స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, రైల్వే సిబ్బంది ఆ వాహనాన్ని ట్రాక్ మీద నుంచి కిందకు దించి శంకర్ పల్లి-హైదరాబాద్ మార్గంలోని రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. అయితే, ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కూడా లేకపోవడం చూసి పోలీసులు షాకయ్యారు.
This post was last modified on June 26, 2025 11:33 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…