పదేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు అనే బ్లాక్ బస్టర్ హీరో విజయ్ ఆంటోనీ మార్కెట్ ని ఇంకా కాపాడుకుంటూ రావడం విచిత్రమే. తర్వాత ఒకటి రెండు యావరేజ్ సినిమాలు వచ్చినా, హిట్ అని చెప్పుకోవడానికి ఒక్క మూవీ లేకపోయినా క్రమం తప్పకుండా ప్రేక్షకులను పలకరిస్తూన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం మార్గన్ రేపు విడుదల కానుంది. ప్రమోషన్ల పరంగా ఏదో కొంచెం సౌండ్ చేశారు కానీ ఆడియన్స్ ని అవి రీచ్ అయిన దాఖలాలు లేవు. ఏషియన్ సురేష్ సంస్థలు పంపిణి పరంగా మద్దతు ఇస్తున్నప్పటికీ కనీస ఓపెనింగ్స్ రావడం కూడా కష్టమే. అయినా సరే తమిళంతో పాటు సమాంతర రిలీజ్ చేస్తున్నారు.
ఒకపక్క కుబేర స్ట్రాంగ్ గా ఉంది. ఇంకోవైపు కన్నప్పని పెద్ద ఎత్తున గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య మార్గన్ నిలవడం పెద్ద సవాలే. విజయ్ ఆంటోనీ చివరిసారి హిట్టు ఎప్పుడు కొట్టాడంటే సమాధానం చెప్పడం కష్టం. కొన్ని పేర్లైతే అసలు వచ్చిన సంగతే జనాలకు గుర్తు లేనంత వేగంగా థియేటర్ నుంచి వెళ్ళిపోయి ఉంటాయి. అయినా సరే ప్రయత్నాలు ఆపకుండా పట్టువదలని విక్రమార్కుడిలా విజయ్ ఆంటోనీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాకపోతే రెగ్యులర్ కమర్షియల్ జానర్ లో కాకుండా ఏదో డిఫరెంట్ గా ట్రై చేయడం ఎంతో కొంత ఆసక్తిని రేపుతోంది.
తెలుగు సంగతి ఎలా ఉన్నా తమిళంలోనూ విజయ్ ఆంటోనీ మార్కెట్ పెద్దగా లేదు. ఏదో ఒక హిట్టు పడకపోదా అనే నమ్మకంతో ట్రయిల్స్ వేస్తూనే ఉన్నాడు. ఎడిటర్ గా కార్తీక్ సుబ్బరాజ్ లాంటివాళ్లతో పని చేసిన సుదీర్ఘ అనుభవమున్న ఎడిటర్ లియో జాన్ పాల్ ఇప్పుడీ మార్గన్ ద్వారా దర్శకుడి అవతారం ఎత్తారు. ట్రైలర్ గట్రా ప్రమోషన్లలో కంటెంట్ చూస్తేనేమో ఆసక్తికరంగానే ఉంది. కాకపోతే అక్షరం ముక్క అర్థం కాకుండా మార్గన్ అని ఒరిజినల్ టైటిల్ నే కొనసాగించడం బాలేదు. ఈ మధ్య ఇది అందరూ చేస్తున్నదే అయినా కనీసం తెలుగు వాళ్ళకు అర్థమయ్యేలా పేరు పెట్టి ఉంటే బాగుండేది.
This post was last modified on June 26, 2025 8:10 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…