పదేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు అనే బ్లాక్ బస్టర్ హీరో విజయ్ ఆంటోనీ మార్కెట్ ని ఇంకా కాపాడుకుంటూ రావడం విచిత్రమే. తర్వాత ఒకటి రెండు యావరేజ్ సినిమాలు వచ్చినా, హిట్ అని చెప్పుకోవడానికి ఒక్క మూవీ లేకపోయినా క్రమం తప్పకుండా ప్రేక్షకులను పలకరిస్తూన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం మార్గన్ రేపు విడుదల కానుంది. ప్రమోషన్ల పరంగా ఏదో కొంచెం సౌండ్ చేశారు కానీ ఆడియన్స్ ని అవి రీచ్ అయిన దాఖలాలు లేవు. ఏషియన్ సురేష్ సంస్థలు పంపిణి పరంగా మద్దతు ఇస్తున్నప్పటికీ కనీస ఓపెనింగ్స్ రావడం కూడా కష్టమే. అయినా సరే తమిళంతో పాటు సమాంతర రిలీజ్ చేస్తున్నారు.
ఒకపక్క కుబేర స్ట్రాంగ్ గా ఉంది. ఇంకోవైపు కన్నప్పని పెద్ద ఎత్తున గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య మార్గన్ నిలవడం పెద్ద సవాలే. విజయ్ ఆంటోనీ చివరిసారి హిట్టు ఎప్పుడు కొట్టాడంటే సమాధానం చెప్పడం కష్టం. కొన్ని పేర్లైతే అసలు వచ్చిన సంగతే జనాలకు గుర్తు లేనంత వేగంగా థియేటర్ నుంచి వెళ్ళిపోయి ఉంటాయి. అయినా సరే ప్రయత్నాలు ఆపకుండా పట్టువదలని విక్రమార్కుడిలా విజయ్ ఆంటోనీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాకపోతే రెగ్యులర్ కమర్షియల్ జానర్ లో కాకుండా ఏదో డిఫరెంట్ గా ట్రై చేయడం ఎంతో కొంత ఆసక్తిని రేపుతోంది.
తెలుగు సంగతి ఎలా ఉన్నా తమిళంలోనూ విజయ్ ఆంటోనీ మార్కెట్ పెద్దగా లేదు. ఏదో ఒక హిట్టు పడకపోదా అనే నమ్మకంతో ట్రయిల్స్ వేస్తూనే ఉన్నాడు. ఎడిటర్ గా కార్తీక్ సుబ్బరాజ్ లాంటివాళ్లతో పని చేసిన సుదీర్ఘ అనుభవమున్న ఎడిటర్ లియో జాన్ పాల్ ఇప్పుడీ మార్గన్ ద్వారా దర్శకుడి అవతారం ఎత్తారు. ట్రైలర్ గట్రా ప్రమోషన్లలో కంటెంట్ చూస్తేనేమో ఆసక్తికరంగానే ఉంది. కాకపోతే అక్షరం ముక్క అర్థం కాకుండా మార్గన్ అని ఒరిజినల్ టైటిల్ నే కొనసాగించడం బాలేదు. ఈ మధ్య ఇది అందరూ చేస్తున్నదే అయినా కనీసం తెలుగు వాళ్ళకు అర్థమయ్యేలా పేరు పెట్టి ఉంటే బాగుండేది.
This post was last modified on June 26, 2025 8:10 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…