గుజరాత్లో సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో 242 మంది తుడిచి పెట్టుకుపోయారు. కనీసం వారిని గుర్తించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అయిన వారికి మాంసపు ముద్దలు అందించడం తప్ప ఏమీ మిగల్లేదు. ఇంత ఘోర విషాదం జరిగి గంటలు గడిచినా.. ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే విషయం పై మాత్రం కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. పైగా.. అనేక వాదనలు ప్రముఖ నిపుణుల నుంచే వినిపిస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది.
సాంకేతికతలో దూసుకుపోతున్నామని చెబుతున్నా.. తాజా పరిణామం దేశానికి, పౌర విమానయాన రంగా నికి కూడా అనేక సవాళ్లను మిగిల్చింది. ప్రధానంగా ఈ విమాన ప్రమాదంపై.. 4 కారణాలు వినిపిస్తున్నాయి . 1) ఇంజన్ విఫలం కావడం. విమానం బయలు దేరిన తర్వాత.. వేగం పుంజుకుని గగన తలం వైపు దూసుకుపోవాల్సి ఉంది. కానీ, అది నేల చూపులు చూస్తూ.. రాలిపోయింది. దీనికి ఇంజన్లో తలెత్తిన కారణమే అయి ఉంటుందన్న వాదన ఉంది. అయితే.. ఇది నిర్దారణకు రాలేదు.
పైగా ఢిల్లీ నుంచి బయలు దేరినప్పుడు.. అన్నీ సరిచూసుకుని పంపించామని.. ఇంజన్లో లోపం లేదని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. సో.. ఇంజన్లో లోపం అనుమానమే. ఇక,2) సిగ్నల్ సరిగా లేకపోవడంతోనే పైలెట్ నడపలేకపోయాడన్న వాదన కూడా ఉంది. ఇలాంటి సమయంలోనే ఆకాశంలో చక్కర్లు కొట్టించేందుకు పైలెట్కు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మరి అలా ఎందుకు చేయలేదన్నది ప్రశ్న.
నిపుణులు అనుమానిస్తున్న 3వ కారణం.. పక్షులు. ఒకేసారిగా గుంపుగా వచ్చిన పక్షుల సమూహం.. విమానాన్ని ఢీ కొట్టిందని చెబుతున్నారు. కానీ, దీనికి సంబంధించిన ఆధారాలు మాత్రం లేవు. విమానం కూలిపోతున్నప్పుడు.. చుట్టుపక్కల ఆకాశంలో ఎలాంటి పక్షలు కనిపించలేదు. సో.. ఈ మూడు కారణాలు కూడా.. ఎక్కడా పక్కాగా అయితే లేవు. కానీ.. ప్రమాదంలో 242 మంది మృతి చెందారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక, దీనిపై 4వ కారణం.. ఉగ్ర కుట్ర కూడా ఉందని మరో అనుమానం తలెత్తింది. దీనిని కూడా కేంద్రం సీరియస్గానే తీసుకుంది. ఆ కోణంలో కూడా.. పరిశీలన చేస్తోంది.
This post was last modified on June 13, 2025 10:12 am
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…