గుజరాత్లో సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో 242 మంది తుడిచి పెట్టుకుపోయారు. కనీసం వారిని గుర్తించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అయిన వారికి మాంసపు ముద్దలు అందించడం తప్ప ఏమీ మిగల్లేదు. ఇంత ఘోర విషాదం జరిగి గంటలు గడిచినా.. ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే విషయం పై మాత్రం కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. పైగా.. అనేక వాదనలు ప్రముఖ నిపుణుల నుంచే వినిపిస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది.
సాంకేతికతలో దూసుకుపోతున్నామని చెబుతున్నా.. తాజా పరిణామం దేశానికి, పౌర విమానయాన రంగా నికి కూడా అనేక సవాళ్లను మిగిల్చింది. ప్రధానంగా ఈ విమాన ప్రమాదంపై.. 4 కారణాలు వినిపిస్తున్నాయి . 1) ఇంజన్ విఫలం కావడం. విమానం బయలు దేరిన తర్వాత.. వేగం పుంజుకుని గగన తలం వైపు దూసుకుపోవాల్సి ఉంది. కానీ, అది నేల చూపులు చూస్తూ.. రాలిపోయింది. దీనికి ఇంజన్లో తలెత్తిన కారణమే అయి ఉంటుందన్న వాదన ఉంది. అయితే.. ఇది నిర్దారణకు రాలేదు.
పైగా ఢిల్లీ నుంచి బయలు దేరినప్పుడు.. అన్నీ సరిచూసుకుని పంపించామని.. ఇంజన్లో లోపం లేదని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. సో.. ఇంజన్లో లోపం అనుమానమే. ఇక,2) సిగ్నల్ సరిగా లేకపోవడంతోనే పైలెట్ నడపలేకపోయాడన్న వాదన కూడా ఉంది. ఇలాంటి సమయంలోనే ఆకాశంలో చక్కర్లు కొట్టించేందుకు పైలెట్కు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మరి అలా ఎందుకు చేయలేదన్నది ప్రశ్న.
నిపుణులు అనుమానిస్తున్న 3వ కారణం.. పక్షులు. ఒకేసారిగా గుంపుగా వచ్చిన పక్షుల సమూహం.. విమానాన్ని ఢీ కొట్టిందని చెబుతున్నారు. కానీ, దీనికి సంబంధించిన ఆధారాలు మాత్రం లేవు. విమానం కూలిపోతున్నప్పుడు.. చుట్టుపక్కల ఆకాశంలో ఎలాంటి పక్షలు కనిపించలేదు. సో.. ఈ మూడు కారణాలు కూడా.. ఎక్కడా పక్కాగా అయితే లేవు. కానీ.. ప్రమాదంలో 242 మంది మృతి చెందారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక, దీనిపై 4వ కారణం.. ఉగ్ర కుట్ర కూడా ఉందని మరో అనుమానం తలెత్తింది. దీనిని కూడా కేంద్రం సీరియస్గానే తీసుకుంది. ఆ కోణంలో కూడా.. పరిశీలన చేస్తోంది.
This post was last modified on June 13, 2025 10:12 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…