Trends

నగల కోసం తల్లి చితిపై పడి..

రాజస్థాన్‌ రాష్ట్రం కోట్‌పుత్లీ-బెహ్రోర్ జిల్లాలో ఒక తల్లిని ఖననం చేసే వేళ జరిగిన దారుణం నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తోంది. కన్నతల్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన చోట, చితిపై పడి నగల కోసం గొడవపడిన కొడుకు కనిపించడమే ఘటన తీవ్రతకు నిదర్శనం. కుటుంబ వివాదాలు, ఆస్తి విషయంలో తలెత్తిన తగాదాలు చివరకు మాతృమూర్తిని సక్రమంగా అంత్యక్రియ చేయకుండా నిలిపేయించాయి.

ఘటన వివరాల్లోకి వెళ్తే, మే 3న భురీ దేవి అనే వృద్ధురాలు కన్నుమూశారు. ఆమెకు ఏడుగురు కుమారులు ఉన్నా, ఐదో కుమారుడు ఓంప్రకాశ్ వేరుగా నివసించేవాడు. కుటుంబంలో ఆస్తి వివాదాలున్నాయి. భురీదేవి మరణించాక ఆమె ఒంటిపై ఉన్న వెండి కడియాలను పెద్ద కుమారుడైన గిరిధారి వద్ద భద్రపరచారు. చితి వద్దకు చేరుకున్నాక, ఓంప్రకాశ్ తనకు ఆ నగలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, నేరుగా చితిపై పడిపోయాడు.

గ్రామస్తులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో దాదాపు రెండు గంటల పాటు అంత్యక్రియలు నిలిచిపోయాయి. చివరకు, తల్లి నగలు ఓంప్రకాశ్‌కు అందించడంతో మాత్రమే అతను చితిపై నుంచి లేచి, తల్లి అంత్యక్రియలకు అనుమతి ఇచ్చాడు. ఈ ఉదంతం చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తల్లిపై ప్రేమ కన్నా నగల మీద మమకారం చూపిన ఓంప్రకాశ్‌ చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో, కుటుంబ సమస్యలు ఎంతలా మానవత్వాన్ని మరిపిస్తాయో చర్చనీయాంశమైంది.

This post was last modified on May 17, 2025 12:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago