అమెరికాలో గురువారం రాత్రి ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 153 మంది ప్రయాణికులతో గాల్లోకి ఎగిరిన ఓ విమానాన్ని ఓ చిన్న కుందేలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు గురయ్యేలా చేసింది. అయితే ఈ ఘటనలో ఏ ఒక్క ప్రయాణికుడికి కూడా ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డెన్వర్ నుంచి ఎడ్మింటన్ కు బయలుదేరిన ఈ విమానం కుందేలు కారణంగా వెనక్కు తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత ప్రయాణికులను వేరే విమానంలో ఎడ్మింటన్ కు పంపారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం డెన్వర్ నుంచి ప్రయాణికుతో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ఎడ్మింటన్ ను బయలుదేరింది. అయితే డెన్వర్ నుంచి గాల్లోకి ఎగిరిన విమానంలోని కుడి రెక్కలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ మంటలు చూస్తుండగానే మిన్నంటాయి. టేకాఫ్ అయిన వెంటనే విమానం రెక్కలో చెలరేగిన మంటలను చూసి ప్రయాణికులు హాహాకారాలు చేయగా… పైలట్లు వేగంగా స్పందించి విమానాన్ని డెన్వర్ ఎయిర్ పోర్టుకు మళ్లించి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా క్షేమంగా విమానం దిగారు.
ఆ తర్వాత అసలు విమానంలో మంటలు చెలరేగడానికి గల కారణాలేమిటన్న విషయాన్ని కనుగొనేందుకు సోదాలు చేయగా… విమానం రెక్కలో ఓ చిన్న కుందేలు కనిపించింది. ఈ కుందేలు కారణంగానే విమానం రెక్కలో మంటలు చెలరేగినట్లు సమాచారం. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో విమానంలో నుంచి పెద్ద శబ్ధం వచ్చిందని…ఆ సమయంలోనే కుందేలు విమానం రెక్కలోకి వెళ్లి ఉంటుందని ప్రాథమిక పరిశీలనలో తేలింది. అసలు విమానంలోకి ఆ కుందేలు ఎలా వచ్చిందన్నది మాత్రం ఇంకా తేలలేదు. విమానం గాల్లో ఉండగా… చెలరేగిన మంటలను విమానంలో ఉన్న ప్రయాణికులు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టగా.. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.
This post was last modified on April 18, 2025 11:06 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…