Trends

ఓ చిన్న కుందేలు… అమెరికా విమానాన్నే పేల్చబోయింది!

అమెరికాలో గురువారం రాత్రి ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 153 మంది ప్రయాణికులతో గాల్లోకి ఎగిరిన ఓ విమానాన్ని ఓ చిన్న కుందేలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు గురయ్యేలా చేసింది. అయితే ఈ ఘటనలో ఏ ఒక్క ప్రయాణికుడికి కూడా ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డెన్వర్ నుంచి ఎడ్మింటన్ కు బయలుదేరిన ఈ విమానం కుందేలు కారణంగా వెనక్కు తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత ప్రయాణికులను వేరే విమానంలో ఎడ్మింటన్ కు పంపారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం డెన్వర్ నుంచి ప్రయాణికుతో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ఎడ్మింటన్ ను బయలుదేరింది. అయితే డెన్వర్ నుంచి గాల్లోకి ఎగిరిన విమానంలోని కుడి రెక్కలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ మంటలు చూస్తుండగానే మిన్నంటాయి. టేకాఫ్ అయిన వెంటనే విమానం రెక్కలో చెలరేగిన మంటలను చూసి ప్రయాణికులు హాహాకారాలు చేయగా… పైలట్లు వేగంగా స్పందించి విమానాన్ని డెన్వర్ ఎయిర్ పోర్టుకు మళ్లించి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా క్షేమంగా విమానం దిగారు. 

ఆ తర్వాత అసలు విమానంలో మంటలు చెలరేగడానికి గల కారణాలేమిటన్న విషయాన్ని కనుగొనేందుకు సోదాలు చేయగా… విమానం రెక్కలో ఓ చిన్న కుందేలు కనిపించింది. ఈ కుందేలు కారణంగానే విమానం రెక్కలో మంటలు చెలరేగినట్లు సమాచారం. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో విమానంలో నుంచి పెద్ద శబ్ధం వచ్చిందని…ఆ సమయంలోనే కుందేలు విమానం రెక్కలోకి వెళ్లి ఉంటుందని ప్రాథమిక పరిశీలనలో తేలింది. అసలు విమానంలోకి ఆ కుందేలు ఎలా వచ్చిందన్నది మాత్రం ఇంకా తేలలేదు. విమానం గాల్లో ఉండగా… చెలరేగిన మంటలను విమానంలో ఉన్న ప్రయాణికులు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టగా.. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.

This post was last modified on April 18, 2025 11:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

2 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

2 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

5 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

7 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

8 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

8 hours ago