అమెరికాలో గురువారం రాత్రి ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 153 మంది ప్రయాణికులతో గాల్లోకి ఎగిరిన ఓ విమానాన్ని ఓ చిన్న కుందేలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు గురయ్యేలా చేసింది. అయితే ఈ ఘటనలో ఏ ఒక్క ప్రయాణికుడికి కూడా ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డెన్వర్ నుంచి ఎడ్మింటన్ కు బయలుదేరిన ఈ విమానం కుందేలు కారణంగా వెనక్కు తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత ప్రయాణికులను వేరే విమానంలో ఎడ్మింటన్ కు పంపారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం డెన్వర్ నుంచి ప్రయాణికుతో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ఎడ్మింటన్ ను బయలుదేరింది. అయితే డెన్వర్ నుంచి గాల్లోకి ఎగిరిన విమానంలోని కుడి రెక్కలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ మంటలు చూస్తుండగానే మిన్నంటాయి. టేకాఫ్ అయిన వెంటనే విమానం రెక్కలో చెలరేగిన మంటలను చూసి ప్రయాణికులు హాహాకారాలు చేయగా… పైలట్లు వేగంగా స్పందించి విమానాన్ని డెన్వర్ ఎయిర్ పోర్టుకు మళ్లించి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా క్షేమంగా విమానం దిగారు.
ఆ తర్వాత అసలు విమానంలో మంటలు చెలరేగడానికి గల కారణాలేమిటన్న విషయాన్ని కనుగొనేందుకు సోదాలు చేయగా… విమానం రెక్కలో ఓ చిన్న కుందేలు కనిపించింది. ఈ కుందేలు కారణంగానే విమానం రెక్కలో మంటలు చెలరేగినట్లు సమాచారం. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో విమానంలో నుంచి పెద్ద శబ్ధం వచ్చిందని…ఆ సమయంలోనే కుందేలు విమానం రెక్కలోకి వెళ్లి ఉంటుందని ప్రాథమిక పరిశీలనలో తేలింది. అసలు విమానంలోకి ఆ కుందేలు ఎలా వచ్చిందన్నది మాత్రం ఇంకా తేలలేదు. విమానం గాల్లో ఉండగా… చెలరేగిన మంటలను విమానంలో ఉన్న ప్రయాణికులు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టగా.. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…