ఏ ముహూర్తంలో ‘పోకిరి’ రీ రిలీజ్ భారీ వసూళ్లు సాధించిందో ఇక అప్పటినుంచి రీ రిలీజుల ప్రహసనం నిరంతరం కొనసాగుతూనే ఉంది. నెలకు కనీసం రెండు మూడు నుంచి గరిష్టంగా అయిదారు పాత సినిమాలను రీ మాస్టరింగ్ పేరుతో థియేటర్లలోకి వదులుతున్నారు. చూసేవాడు చూస్తాడు లేనివాడు మానుకుంటాడని సింపుల్ గా చెప్పొచ్చు కానీ వీటి ప్రభావం కొత్త వాటి మీద పడుతుందనే చేదు వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఇప్పటిదాకా అయిదారుసార్లు వచ్చిన ‘ఒక్కడు’ని మళ్ళీ తీసుకొచ్చినా హైదరాబాద్ లో పది లక్షల దాకా గ్రాస్ నమోదు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఎప్పుడో వచ్చే ‘అతడు’కి ఇప్పటి నుంచే హంగామా చేస్తున్నారు.
ఇప్పుడే కాదు గతంలో ఆరంజ్, ఓయ్, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటివి వచ్చినప్పుడు కూడా ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ఉదయం షోలు వీటికేమో హౌస్ ఫుల్స్ పడిపోయి కొత్త సినిమాలకు ఉదయం ఆటకే జనాలు లేని దాఖలాలు చాలా ఉన్నాయి. ఒక ప్రణాళిక లేకుండా తోచిన వెంటనే రీ రిలీజులకు సిద్ధమైపోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. ఆ మధ్య ‘హిట్లర్’ కోసం ఇలాగే హడావిడి చేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ టీమ్ బోలెడు కబుర్లు పంచుకుంది. రేపు రిలీజ్ అనగా జనాలు లైట్ తీసుకున్నారని గుర్తించి ఆపేశారు. తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా హిట్లర్ ఊసే లేకుండా పోయింది.
క్లాసిక్ అని చెప్పుకునే ‘ఆదిత్య 369’కి ఎంత మంచి మార్కెటింగ్ చేసినప్పటికీ భాగ్యనగరం మినహాయించి బయట ఏమంత వసూళ్లు రాబట్టలేకపోయింది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ‘నాయక్’ కు ఎర్లీ మార్నింగ్ ఒకటి రెండు షోలు తప్పించి చాలా చోట్ల వాష్ అవుట్ అయిపోయింది. వచ్చే వారం ‘భరత్ అనే నేను’ తెస్తున్నారు. మేలో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, యమదొంగలు రెడీ అవుతున్నాయి. ‘స్టాలిన్’ని జూన్ కోసం రెడీ చేస్తున్నారు. జనాలు థియేటర్లకు రావడం లేదని ఇండస్ట్రీ పెద్దలు వాపోతున్న తరుణంలో ఇలా మూకుమ్మడిగా రీ రిలీజులను కట్టడి చేసే పరిమితంగా వచ్చేలా చేస్తే బెటర్.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో…
పెద్ది వీకెండ్ ఘనంగా పూర్తి చేసుకుంది. టాక్స్, రివ్యూస్, కాంట్రావర్సీ సంగతి ఎలా ఉన్నా జనం థియేటర్లకు పోటెత్తిన మాట…
అందరూ సవాళ్లు రువ్వుతున్నారు.. తాను మాత్రం తక్కువ తిన్నానా.. అని అనుకున్నారో ఏమో.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు.. ఆసక్తికర…
ఇంకో మూడు రోజుల్లో జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు రానుంది. ఈసారి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు రెడీ…
బాహుబలి సినిమాను అప్పట్లో టాలీవుడ్ను మించి బాలీవుడ్యే ఎక్కువగా మోసింది. అందుక్కారణం అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ఆ చిత్రాన్ని…
టాలీవుడ్లో కొన్నేళ్లుగా సినిమాల మేకింగ్ బాగా ఆలస్యం అవుతోంది. ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయక, దాన్ని మార్చకుండా చెప్పిన…