Trends

ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్.. రాహుల్ కాదు!

ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మార్పును చేపట్టింది. జట్టును ముందుండి నడిపించిన రిషభ్ పంత్ స్థానాన్ని భర్తీ చేస్తూ, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గతంలో పంత్ ఢిల్లీకి ప్రధాన నాయకత్వం వహించినప్పటికీ, ఐపీఎల్ 2024 వేలంలో అతడిని లక్నో సూపర్ జెయింట్స్ అత్యధికంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేయడంతో, అతను జట్టును వీడాడు. ఈ ఖరీదుతోనే పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు.

కేఎల్ రాహుల్ కూడా వేలంలో ఢిల్లీకి వచ్చాడు. అతడిని రూ. 14 కోట్లకు ఫ్రాంచైజీ దక్కించుకుంది. అయితే, రాహుల్ తాను కేవలం బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న కారణంగా కెప్టెన్సీ భాద్యతలు తీసుకోలేనని యాజమాన్యానికి చెప్పినట్లు సమాచారం. దీంతో అక్షర్ పటేల్‌ను నాయకుడిగా నియమించారు. గతంలో ఒక మ్యాచ్‌లో ఢిల్లీకి తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం అక్షర్‌కు ఉంది.

ఐపీఎల్ 2024 సీజన్‌లో అక్షర్ పటేల్ మిడిలార్డర్‌లో రాణించాడు. 36.40 యావరేజ్ తో 364 పరుగులు చేయడంతో పాటు, 13 వికెట్లు తీసి బౌలింగ్‌లోనూ తన ప్రాభవాన్ని చాటాడు. ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శన అతడిని కెప్టెన్సీకి అర్హుడిగా నిలిపింది. మునుపటి సీజన్లలో కూడా ఢిల్లీ జట్టులో కీలకమైన ఆటగాడిగా అక్షర్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఫ్రాంచైజీ అతనిపై నమ్మకంతో పగ్గాలు అప్పగించింది.

ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న విశాఖపట్నం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నారు, ఎందుకంటే పంత్ ఇప్పుడు ప్రత్యర్థి జట్టులో ఉన్నాడు. ఢిల్లీ ఫ్యాన్స్ అక్షర్ నాయకత్వాన్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్సీ మార్పు తరువాత కొత్త ఆటతీరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అక్షర్ పటేల్ తక్కువ ఒత్తిడితో, సహజమైన ఆటతీరును కొనసాగించగలడా లేక కెప్టెన్సీ భాద్యతలు అతని ప్రదర్శనపై ప్రభావం చూపిస్తాయా అన్నది చూడాల్సిందే. అయితే, జట్టు యాజమాన్యం అతనిపై పూర్తి విశ్వాసం ఉంచినట్లు కనిపిస్తోంది.

This post was last modified on March 14, 2025 12:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

59 minutes ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

2 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

3 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

4 hours ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

6 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

8 hours ago