ఐపీఎల్ 2025 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మార్పును చేపట్టింది. జట్టును ముందుండి నడిపించిన రిషభ్ పంత్ స్థానాన్ని భర్తీ చేస్తూ, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను కొత్త కెప్టెన్గా ఎంపిక చేసింది. గతంలో పంత్ ఢిల్లీకి ప్రధాన నాయకత్వం వహించినప్పటికీ, ఐపీఎల్ 2024 వేలంలో అతడిని లక్నో సూపర్ జెయింట్స్ అత్యధికంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేయడంతో, అతను జట్టును వీడాడు. ఈ ఖరీదుతోనే పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు.
కేఎల్ రాహుల్ కూడా వేలంలో ఢిల్లీకి వచ్చాడు. అతడిని రూ. 14 కోట్లకు ఫ్రాంచైజీ దక్కించుకుంది. అయితే, రాహుల్ తాను కేవలం బ్యాటింగ్పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న కారణంగా కెప్టెన్సీ భాద్యతలు తీసుకోలేనని యాజమాన్యానికి చెప్పినట్లు సమాచారం. దీంతో అక్షర్ పటేల్ను నాయకుడిగా నియమించారు. గతంలో ఒక మ్యాచ్లో ఢిల్లీకి తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం అక్షర్కు ఉంది.
ఐపీఎల్ 2024 సీజన్లో అక్షర్ పటేల్ మిడిలార్డర్లో రాణించాడు. 36.40 యావరేజ్ తో 364 పరుగులు చేయడంతో పాటు, 13 వికెట్లు తీసి బౌలింగ్లోనూ తన ప్రాభవాన్ని చాటాడు. ఈ ఆల్రౌండ్ ప్రదర్శన అతడిని కెప్టెన్సీకి అర్హుడిగా నిలిపింది. మునుపటి సీజన్లలో కూడా ఢిల్లీ జట్టులో కీలకమైన ఆటగాడిగా అక్షర్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఫ్రాంచైజీ అతనిపై నమ్మకంతో పగ్గాలు అప్పగించింది.
ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 24న విశాఖపట్నం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్ ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నారు, ఎందుకంటే పంత్ ఇప్పుడు ప్రత్యర్థి జట్టులో ఉన్నాడు. ఢిల్లీ ఫ్యాన్స్ అక్షర్ నాయకత్వాన్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్సీ మార్పు తరువాత కొత్త ఆటతీరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అక్షర్ పటేల్ తక్కువ ఒత్తిడితో, సహజమైన ఆటతీరును కొనసాగించగలడా లేక కెప్టెన్సీ భాద్యతలు అతని ప్రదర్శనపై ప్రభావం చూపిస్తాయా అన్నది చూడాల్సిందే. అయితే, జట్టు యాజమాన్యం అతనిపై పూర్తి విశ్వాసం ఉంచినట్లు కనిపిస్తోంది.
This post was last modified on March 14, 2025 12:15 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…