Trends

ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్.. రాహుల్ కాదు!

ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మార్పును చేపట్టింది. జట్టును ముందుండి నడిపించిన రిషభ్ పంత్ స్థానాన్ని భర్తీ చేస్తూ, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గతంలో పంత్ ఢిల్లీకి ప్రధాన నాయకత్వం వహించినప్పటికీ, ఐపీఎల్ 2024 వేలంలో అతడిని లక్నో సూపర్ జెయింట్స్ అత్యధికంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేయడంతో, అతను జట్టును వీడాడు. ఈ ఖరీదుతోనే పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు.

కేఎల్ రాహుల్ కూడా వేలంలో ఢిల్లీకి వచ్చాడు. అతడిని రూ. 14 కోట్లకు ఫ్రాంచైజీ దక్కించుకుంది. అయితే, రాహుల్ తాను కేవలం బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న కారణంగా కెప్టెన్సీ భాద్యతలు తీసుకోలేనని యాజమాన్యానికి చెప్పినట్లు సమాచారం. దీంతో అక్షర్ పటేల్‌ను నాయకుడిగా నియమించారు. గతంలో ఒక మ్యాచ్‌లో ఢిల్లీకి తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం అక్షర్‌కు ఉంది.

ఐపీఎల్ 2024 సీజన్‌లో అక్షర్ పటేల్ మిడిలార్డర్‌లో రాణించాడు. 36.40 యావరేజ్ తో 364 పరుగులు చేయడంతో పాటు, 13 వికెట్లు తీసి బౌలింగ్‌లోనూ తన ప్రాభవాన్ని చాటాడు. ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శన అతడిని కెప్టెన్సీకి అర్హుడిగా నిలిపింది. మునుపటి సీజన్లలో కూడా ఢిల్లీ జట్టులో కీలకమైన ఆటగాడిగా అక్షర్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఫ్రాంచైజీ అతనిపై నమ్మకంతో పగ్గాలు అప్పగించింది.

ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న విశాఖపట్నం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నారు, ఎందుకంటే పంత్ ఇప్పుడు ప్రత్యర్థి జట్టులో ఉన్నాడు. ఢిల్లీ ఫ్యాన్స్ అక్షర్ నాయకత్వాన్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్సీ మార్పు తరువాత కొత్త ఆటతీరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అక్షర్ పటేల్ తక్కువ ఒత్తిడితో, సహజమైన ఆటతీరును కొనసాగించగలడా లేక కెప్టెన్సీ భాద్యతలు అతని ప్రదర్శనపై ప్రభావం చూపిస్తాయా అన్నది చూడాల్సిందే. అయితే, జట్టు యాజమాన్యం అతనిపై పూర్తి విశ్వాసం ఉంచినట్లు కనిపిస్తోంది.

This post was last modified on March 14, 2025 12:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

48 minutes ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

1 hour ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

2 hours ago

కృతి శెట్టిని వెంటాడుతున్న వాయిదాలు

ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…

2 hours ago

ఆ ఆస్తులపై షర్మిలకు హక్కు లేదా?

రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌…

3 hours ago

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…

5 hours ago