Trends

ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్.. రాహుల్ కాదు!

ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మార్పును చేపట్టింది. జట్టును ముందుండి నడిపించిన రిషభ్ పంత్ స్థానాన్ని భర్తీ చేస్తూ, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గతంలో పంత్ ఢిల్లీకి ప్రధాన నాయకత్వం వహించినప్పటికీ, ఐపీఎల్ 2024 వేలంలో అతడిని లక్నో సూపర్ జెయింట్స్ అత్యధికంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేయడంతో, అతను జట్టును వీడాడు. ఈ ఖరీదుతోనే పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు.

కేఎల్ రాహుల్ కూడా వేలంలో ఢిల్లీకి వచ్చాడు. అతడిని రూ. 14 కోట్లకు ఫ్రాంచైజీ దక్కించుకుంది. అయితే, రాహుల్ తాను కేవలం బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న కారణంగా కెప్టెన్సీ భాద్యతలు తీసుకోలేనని యాజమాన్యానికి చెప్పినట్లు సమాచారం. దీంతో అక్షర్ పటేల్‌ను నాయకుడిగా నియమించారు. గతంలో ఒక మ్యాచ్‌లో ఢిల్లీకి తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం అక్షర్‌కు ఉంది.

ఐపీఎల్ 2024 సీజన్‌లో అక్షర్ పటేల్ మిడిలార్డర్‌లో రాణించాడు. 36.40 యావరేజ్ తో 364 పరుగులు చేయడంతో పాటు, 13 వికెట్లు తీసి బౌలింగ్‌లోనూ తన ప్రాభవాన్ని చాటాడు. ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శన అతడిని కెప్టెన్సీకి అర్హుడిగా నిలిపింది. మునుపటి సీజన్లలో కూడా ఢిల్లీ జట్టులో కీలకమైన ఆటగాడిగా అక్షర్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఫ్రాంచైజీ అతనిపై నమ్మకంతో పగ్గాలు అప్పగించింది.

ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న విశాఖపట్నం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నారు, ఎందుకంటే పంత్ ఇప్పుడు ప్రత్యర్థి జట్టులో ఉన్నాడు. ఢిల్లీ ఫ్యాన్స్ అక్షర్ నాయకత్వాన్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్సీ మార్పు తరువాత కొత్త ఆటతీరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అక్షర్ పటేల్ తక్కువ ఒత్తిడితో, సహజమైన ఆటతీరును కొనసాగించగలడా లేక కెప్టెన్సీ భాద్యతలు అతని ప్రదర్శనపై ప్రభావం చూపిస్తాయా అన్నది చూడాల్సిందే. అయితే, జట్టు యాజమాన్యం అతనిపై పూర్తి విశ్వాసం ఉంచినట్లు కనిపిస్తోంది.

This post was last modified on March 14, 2025 12:15 pm

Share

Recent Posts

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

1 hour ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

4 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

4 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

4 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

5 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

8 hours ago