హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.99తో విజయవాడకు వెళ్ళొచ్చా? నిజంగానా? అని ఆశ్యర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈటీఓ మోటార్స్ ఈ కొత్త చౌక ప్రయాణాన్ని అందిస్తోంది. అది కూడా ఏసీ సౌకర్యంతో కూడిన జర్నీని ఈ సంస్థ మనకు అందించనుంది. ఈ సర్వీసులను తెలంగాణ రవాణా సఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సర్వీసులు మూడు నుంచి నాలుగు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. తొలుత హైదరాబాద్, విజయవాడల మధ్యలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ సర్వీసులు మలి దశలో హైదరాబాద్, విశాఖపట్నంల మధ్య కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఏసీ సౌకర్యం కలిగిన ఈ బస్సు సేవలు ఫ్లిక్ బస్సు పేరిట అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సులలో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఛార్జ్ కేవలం రూ.99 మాత్రమే. అయితే ఈ తక్కువ చార్జీలు కేవలం 4 వారాలపాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఈ చార్జీలను పెంచే అవకాశం ఉంది. అయితే ఎంతమేర చార్జీలను పెంచుతారన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదనే చెప్పాలి ఈ విషయాన్నీ అటు ఈటీఓ మోటార్స్ గానీ, మంత్రి పొన్నం గానీ వెల్లడించలేదు. ఏసీ బస్సు లో హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రూ.99కే జర్నీ అంటే చౌకనే కదా. ఈ చార్జీలను ఆ తర్వాత పెంచినా పెద్దగా తేడా రాకుండానే ఈటీఓ మోటార్స్ జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సేవలతో తక్కువ చార్జీలతోనే ప్రయాణాలు అందుబాటులోకి వస్తాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఫ్లిక్ బస్సు సేవలను ఈటీఓ మోటార్స్ సంస్థ తొలిసారిగా హైదరాబాద్, విజయవాడల మధ్యే నడపనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని నగరలాకు విస్తరించనున్నట్లు ఫ్లిక్ బస్సు సిఎంఓ వైఎస్ రాజీవ్ చెప్పారు. ఆ తర్వాత ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలను పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. ఫ్లిక్ బస్సు సేవలు ప్రజా రవాణా రంగంలో ఓ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on February 7, 2025 9:48 am
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…
ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా నుంచి ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలంటే దానికి ఎంత హడావుడి చేస్తారో? అప్డేట్…
సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…