హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.99తో విజయవాడకు వెళ్ళొచ్చా? నిజంగానా? అని ఆశ్యర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈటీఓ మోటార్స్ ఈ కొత్త చౌక ప్రయాణాన్ని అందిస్తోంది. అది కూడా ఏసీ సౌకర్యంతో కూడిన జర్నీని ఈ సంస్థ మనకు అందించనుంది. ఈ సర్వీసులను తెలంగాణ రవాణా సఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సర్వీసులు మూడు నుంచి నాలుగు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. తొలుత హైదరాబాద్, విజయవాడల మధ్యలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ సర్వీసులు మలి దశలో హైదరాబాద్, విశాఖపట్నంల మధ్య కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఏసీ సౌకర్యం కలిగిన ఈ బస్సు సేవలు ఫ్లిక్ బస్సు పేరిట అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సులలో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఛార్జ్ కేవలం రూ.99 మాత్రమే. అయితే ఈ తక్కువ చార్జీలు కేవలం 4 వారాలపాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఈ చార్జీలను పెంచే అవకాశం ఉంది. అయితే ఎంతమేర చార్జీలను పెంచుతారన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదనే చెప్పాలి ఈ విషయాన్నీ అటు ఈటీఓ మోటార్స్ గానీ, మంత్రి పొన్నం గానీ వెల్లడించలేదు. ఏసీ బస్సు లో హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రూ.99కే జర్నీ అంటే చౌకనే కదా. ఈ చార్జీలను ఆ తర్వాత పెంచినా పెద్దగా తేడా రాకుండానే ఈటీఓ మోటార్స్ జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సేవలతో తక్కువ చార్జీలతోనే ప్రయాణాలు అందుబాటులోకి వస్తాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఫ్లిక్ బస్సు సేవలను ఈటీఓ మోటార్స్ సంస్థ తొలిసారిగా హైదరాబాద్, విజయవాడల మధ్యే నడపనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని నగరలాకు విస్తరించనున్నట్లు ఫ్లిక్ బస్సు సిఎంఓ వైఎస్ రాజీవ్ చెప్పారు. ఆ తర్వాత ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలను పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. ఫ్లిక్ బస్సు సేవలు ప్రజా రవాణా రంగంలో ఓ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on February 7, 2025 9:48 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…