హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.99తో విజయవాడకు వెళ్ళొచ్చా? నిజంగానా? అని ఆశ్యర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈటీఓ మోటార్స్ ఈ కొత్త చౌక ప్రయాణాన్ని అందిస్తోంది. అది కూడా ఏసీ సౌకర్యంతో కూడిన జర్నీని ఈ సంస్థ మనకు అందించనుంది. ఈ సర్వీసులను తెలంగాణ రవాణా సఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సర్వీసులు మూడు నుంచి నాలుగు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. తొలుత హైదరాబాద్, విజయవాడల మధ్యలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ సర్వీసులు మలి దశలో హైదరాబాద్, విశాఖపట్నంల మధ్య కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఏసీ సౌకర్యం కలిగిన ఈ బస్సు సేవలు ఫ్లిక్ బస్సు పేరిట అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సులలో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఛార్జ్ కేవలం రూ.99 మాత్రమే. అయితే ఈ తక్కువ చార్జీలు కేవలం 4 వారాలపాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఈ చార్జీలను పెంచే అవకాశం ఉంది. అయితే ఎంతమేర చార్జీలను పెంచుతారన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదనే చెప్పాలి ఈ విషయాన్నీ అటు ఈటీఓ మోటార్స్ గానీ, మంత్రి పొన్నం గానీ వెల్లడించలేదు. ఏసీ బస్సు లో హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రూ.99కే జర్నీ అంటే చౌకనే కదా. ఈ చార్జీలను ఆ తర్వాత పెంచినా పెద్దగా తేడా రాకుండానే ఈటీఓ మోటార్స్ జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సేవలతో తక్కువ చార్జీలతోనే ప్రయాణాలు అందుబాటులోకి వస్తాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఫ్లిక్ బస్సు సేవలను ఈటీఓ మోటార్స్ సంస్థ తొలిసారిగా హైదరాబాద్, విజయవాడల మధ్యే నడపనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని నగరలాకు విస్తరించనున్నట్లు ఫ్లిక్ బస్సు సిఎంఓ వైఎస్ రాజీవ్ చెప్పారు. ఆ తర్వాత ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలను పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. ఫ్లిక్ బస్సు సేవలు ప్రజా రవాణా రంగంలో ఓ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on February 7, 2025 9:48 am
అంతా అనుకున్నట్లు జరిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మస్కు అనుకున్న ఆ చిత్రం…
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…
ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…