అంతా అనుకున్నట్లు జరిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మస్కు అనుకున్న ఆ చిత్రం కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఒక దశలో సంక్రాంతి రిలీజ్ అన్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. వేసవి సీజన్ను ఆరంభిస్తూ మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు చివరగా కొన్ని వారాల కిందటే ప్రకటించారు. కానీ అదే రోజుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు షెడ్యూల్ అయి ఉండడంతో అయోమయం తప్పలేదు.
పవన్కు వీరాభిమాని అయిన నితిన్.. తన ఆరాధ్య కథానాయకుడి సినిమాకు పోటీగా తన చిత్రాన్ని రిలీజ్ చేస్తాడని ఎవ్వరూ భావించడం లేదు. దీన్ని బట్టి పవన్ సినిమా మార్చి 28న రాదని ఫిక్సయిపోయారు అందరూ. కానీ గత కొన్ని రోజులుగా హరిహర వీరమల్లు అప్డేట్స్తో ఊరిస్తోంది. ఇటీవలే నిర్మాత ఏఎం రత్నం సైతం తమ చిత్రాన్ని మార్చి 28నే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
హరిహర వీరమల్లు షూట్ గురించి కూడా ఇటీవలే అప్డేట్ బయటికి వచ్చింది. పవన్ మీద వారం రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలుందని.. ఆ షెడ్యూల్ కోసం పవన్ కాల్ షీట్స్ కూడా ఇచ్చాడని వార్తలు వచ్చాయి. దీంతో హరిహర వీరమల్లు మార్చి 28కి వస్తుందని పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అదే నిజమైతే నితిన్ సినిమా ఆటోమేటిగ్గా రేసు నుంచి తప్పుకుంటుందని భావిస్తున్నారు.
కానీ రాబిన్ హుడ్ రిలీజ్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు తగ్గట్లేదు. తాజాగా 50 రోజుల రిలీజ్ కౌంట్ డౌన్తో ఒక పోస్టర్ వదిలారు. సినిమా థియేటర్లలో ఈ సినిమా టీజర్ను ప్రదర్శిస్తూ ప్రమోషన్ల సందడి కూడా ఆరంభించారు. మరి పవన్ సినిమా వస్తుందని తెలిసే నితిన్ పోటీకి సై అంటున్నాడా.. లేక పవన్ సినిమా మార్చి 28 రాదన్న ధీమానా అన్నది అర్థం కావడం లేదు.
నితిన్తో పాటు మైత్రీ అధినేతలు కూడా పవన్కు అత్యంత సన్నిహితులే. కాబట్టి ఆయన సినిమాతో పోటీకి వెళ్లే రకమైతే కాదు. మరి వాళ్ల ఉద్దేశం ఏంటన్నది ఆసక్తికరం. హరిహర వీరమల్లు వాయిదా పడుతుందనే నమ్మకంతోనే ఇలా చేస్తుండొచ్చు. అదే జరిగితే తమ సినిమాను మార్చి 28న రిలీజ్ చేయాలని.. పవన్ సినిమా వచ్చేట్లుంటే వేచి చూసి డేట్ మార్చుకోవచ్చని భావిస్తుననారేమో. ఏ విషయం తేలే వరకు ఆ డేట్కే కట్టుబడి ఉంటే.. ఇంకెవరూ పోటీలోకి రారని అనుకుంటున్నారేమో.
This post was last modified on February 7, 2025 8:07 am
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…
ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…