ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో… భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన సాంకేతిక నిపుణుడు… ప్రపంచ శ్రేణి సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఇంకొకరేమో… ప్రపంచంలోనే అగ్ర దేశాలుగా విరాజిల్లుతున్న వాటిలో ఓ దేశానికి ఏకంగా ప్రధాన మంత్రిగా పని చేసిన వారు.
అంతేనా… ఆ చివరన బాలీవుడ్ నే కాకుండా యావత్తు భారత సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సూపర్ స్టార్. ఆయన పక్కనే బాలీవుడ్ లో పేరు మోసిన హీరోగా గుర్తింపు అందుకున్న ఆయన కుమారుడు.
ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తావించిన పేర్లన్నీ లైవ్ టీవీలో అలా కనిపించి ఇలా మాయమైన ముఖాలు మాత్రమే. ఇంకా కనిపించకుండా..అక్కడ కూర్చున్న ప్రముఖులు ఇంకెంత మంది ఉన్నారో చెప్పడం కష్టమే.
వీరంతా ఏ కార్యక్రమానికి వచ్చారు అంటారా? భారత్ లో ఇంగ్లండ్ జట్టు పర్యటిస్తోంది కదా. రెండు దేశాల మధ్య జరుగుతున్న 5 మ్యాచుల టీ20 సీరిస్ లో చివరి మ్యాచ్ ఆదివారం ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు వీరంతా వచ్చారు.
వీరంతా ఎవరన్న విషయానికి వస్తే… ఆ కుబేరుడేమో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ. ఇక ఆ సాంకేతిక నిఫుణుడు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి. ఇంగ్లండ్ మాజీ ప్రధాని రిషి సునక్. ఇక బాలీవుడ్ నటులు ఎవరంటే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్.
బచ్చన్ లు జనం మధ్య నిలబడి కేరింతలు కొడితే.. మిగిలిన వారంతా వారిలో వారే కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా కాలక్షేపం చేశారు. నిత్యం బిజీ షెడ్యూల్ తో సాగే వీరంతా ఇంత లీజర్ గా గతంలో ఎప్పుడూ కనిపించలేదు. అంతేకాకుండా అంబానీ, మూర్తి, సునక్..ఒకే చోట కూర్చుని ముచ్చటించుకున్న దృశ్యం ఇప్పటిదాకా కనిపించనే లేదు. అన్నట్లు మూర్తికి సునక్ అల్లుడన్న విషయం తెలిసిందే కదా.
అయినా ఈ మ్యాచ్ కు ఇంత ప్రాధాన్యం ఉందా? అంటే… అస్సలే లేదని చెప్పాలి. ఓ రంజీ మ్యాచ్ కు ఉన్నంత ప్రాధాన్యం కూడా లేదు. ఎందుకంటే.. ఇప్పటికే ఈ సిరీస్ ను బారత్ 3-1 తేడాతో ఇప్పటికే టీమిండియా ఒడిసిపట్టేసింది. అంటే… వాంఖడే మ్యాచ్ ఇరు జట్లకు ప్రాక్టీస్ మ్యాచ్ తో సమానం.
అయినా కూడా ఇంత మంది ప్రముఖులు వచ్చారేంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి ఆదివారం కదా. వీకెండ్. పొద్దంతా ఇంటి పట్టునే ఉన్నారు. ఈవెనింగ్ కాగానే..ఎలాగూ మ్యాచ్ ఉంది కదా అని వీరంతా అలా వాంఖడేకు వచ్చి కూర్చున్నారు.
This post was last modified on February 2, 2025 8:59 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…