Trends

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం కువైట్‌కు చేరుకున్న ప్ర‌ధాని మోడీకి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అదేవిధంగా ఆయ‌న మ‌న‌సును హ‌త్తుకునే సంఘ‌ట‌న కూడా జ‌రిగింది. భార‌త ప‌విత్ర గ్రంధాలైన రామా యణ, మ‌హాభార‌తాల‌ను అర‌బిక్ భాష‌లోకి అనువ‌దించిన ర‌చ‌యిత‌.. అబ్దుల్లా అల్ బారౌన్‌, ఈ పుస్త‌కాల ను ప్ర‌చురించిన ప‌బ్లిష‌ర్ అబ్దుల్లా లతీఫ్ అల్ నెసెఫ్‌ల‌తో ప్ర‌ధాని భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా అర‌బిక్‌లో ఉన్న రామాయ‌ణ‌, మ‌హాభార‌త పుస్త‌కాల‌ను ఆస‌క్తిగా తిల‌కించారు. ఈ రెండు పుస్త‌కాల‌పైనా ప్ర‌ధాని మోడీ త‌న చేవ్రాలు చేశారు. ఈ సంద‌ర్భంగా వారితో ముచ్చ‌టించిన ప్ర‌ధాని ఈ గ్రంథాల‌ను అర‌బిక్‌లోకి అనువ‌దించేందుకు ఎంత స‌మ‌యం ప‌ట్టింద‌ని ప్ర‌ధాని ప్ర‌శ్నించారు. దీనికి సుమారు.. రెండు సంవ‌త్స‌రాల ఎనిమిదిమాసాల స‌మ‌యం ప‌ట్టిన‌ట్టు ప‌బ్లిష‌ర్ అబ్దుల్లా లతీఫ్ అల్ నెసెఫ్ తెలిపారు.

“ప్ర‌ధాని మోడీని క‌లుసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకెంతో గౌర‌వం కూడా. ప్ర‌ధాని మోడీ కూడా చాలా సంతోషంగా ఫీల‌య్యారు. ఈ రెండు పుస్తకాల‌ను చాలా ముఖ్య‌మైన‌విగా పేర్కొన్న ఆయ‌న‌.. రెండు అర‌బిక్‌ గ్రంథాల‌పైనా సంత‌కాలు చేశారు.“అని అబ్దుల్లా లతీఫ్ అల్ నెసెఫ్ తెలిపారు.

కాగా.. దీనికి ముందే త‌న `మ‌న్‌కీ బాత్‌` రేడియో కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అంత‌ర్జాతీ య సంబంధాల‌ను బ‌లోపేతం చేసుకునే క్ర‌మంలో సంస్కృతి, సంప్ర‌దాయాల దౌత్యం కూడా.. అత్యంత కీల‌క‌మ‌ని నొక్కి చెప్పారు. కాగా, అబ్దుల్ ల‌తీఫ్ అల్‌నెసెఫ్‌, అబ్దుల్లా బారౌన్‌లు.. ఇప్ప‌టికి 30కి పైగా పుస్త‌కాల‌ను అనువదించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అనేక గ్రంథాల‌పై వారు త‌మ దైన ముద్ర వేశారు.

అబ్దుల్ ల‌తీఫ్ అల్‌నెసెఫ్‌.. కువైట్‌కు చెందిన ప్ర‌ముఖ ప‌బ్లిష‌ర్‌. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల సంస్కృతుల‌ను ఆయ‌న అధ్య‌య‌నం చేయ‌డంతోపాటు.. ప‌ట్టు సాధించారు. ర‌చ‌యిత అబ్దుల్లా అల్ బ‌రౌన్‌.. అద్భుతమైన అనువాద‌కుడిగా పేరు తెచ్చుకున్నారు.

రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం కువైట్‌కు వెళ్లిన ప్ర‌ధాని మోడీ.. అనేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు. కువైట్‌లోని భార‌త సంత‌తి పౌరుల‌తోనూ.. ఆయ‌న సంభాషించ‌నున్నారు. కువైట్ రాజు.. షేక్ మెష‌ల్ అల్ అహ్మ‌ద్ అల్ జ‌బ‌ర్ అల్ స‌బా ఆహ్వానం మేర‌కు ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఇరు దేశాల మ‌ధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలపై చ‌ర్చించ‌నున్నారు. గల్ఫ్ క‌ప్ ఫుట్‌బాల్ టోర్న‌మెంట్ ప్రారంభ కార్య‌క్ర‌మంలోనూ ప్ర‌ధాని పాల్గొని ప్ర‌సంగించారు.

This post was last modified on December 22, 2024 8:00 am

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

4 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

4 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

5 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

5 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

6 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

6 hours ago