Trends

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం కువైట్‌కు చేరుకున్న ప్ర‌ధాని మోడీకి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అదేవిధంగా ఆయ‌న మ‌న‌సును హ‌త్తుకునే సంఘ‌ట‌న కూడా జ‌రిగింది. భార‌త ప‌విత్ర గ్రంధాలైన రామా యణ, మ‌హాభార‌తాల‌ను అర‌బిక్ భాష‌లోకి అనువ‌దించిన ర‌చ‌యిత‌.. అబ్దుల్లా అల్ బారౌన్‌, ఈ పుస్త‌కాల ను ప్ర‌చురించిన ప‌బ్లిష‌ర్ అబ్దుల్లా లతీఫ్ అల్ నెసెఫ్‌ల‌తో ప్ర‌ధాని భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా అర‌బిక్‌లో ఉన్న రామాయ‌ణ‌, మ‌హాభార‌త పుస్త‌కాల‌ను ఆస‌క్తిగా తిల‌కించారు. ఈ రెండు పుస్త‌కాల‌పైనా ప్ర‌ధాని మోడీ త‌న చేవ్రాలు చేశారు. ఈ సంద‌ర్భంగా వారితో ముచ్చ‌టించిన ప్ర‌ధాని ఈ గ్రంథాల‌ను అర‌బిక్‌లోకి అనువ‌దించేందుకు ఎంత స‌మ‌యం ప‌ట్టింద‌ని ప్ర‌ధాని ప్ర‌శ్నించారు. దీనికి సుమారు.. రెండు సంవ‌త్స‌రాల ఎనిమిదిమాసాల స‌మ‌యం ప‌ట్టిన‌ట్టు ప‌బ్లిష‌ర్ అబ్దుల్లా లతీఫ్ అల్ నెసెఫ్ తెలిపారు.

“ప్ర‌ధాని మోడీని క‌లుసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకెంతో గౌర‌వం కూడా. ప్ర‌ధాని మోడీ కూడా చాలా సంతోషంగా ఫీల‌య్యారు. ఈ రెండు పుస్తకాల‌ను చాలా ముఖ్య‌మైన‌విగా పేర్కొన్న ఆయ‌న‌.. రెండు అర‌బిక్‌ గ్రంథాల‌పైనా సంత‌కాలు చేశారు.“అని అబ్దుల్లా లతీఫ్ అల్ నెసెఫ్ తెలిపారు.

కాగా.. దీనికి ముందే త‌న `మ‌న్‌కీ బాత్‌` రేడియో కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అంత‌ర్జాతీ య సంబంధాల‌ను బ‌లోపేతం చేసుకునే క్ర‌మంలో సంస్కృతి, సంప్ర‌దాయాల దౌత్యం కూడా.. అత్యంత కీల‌క‌మ‌ని నొక్కి చెప్పారు. కాగా, అబ్దుల్ ల‌తీఫ్ అల్‌నెసెఫ్‌, అబ్దుల్లా బారౌన్‌లు.. ఇప్ప‌టికి 30కి పైగా పుస్త‌కాల‌ను అనువదించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అనేక గ్రంథాల‌పై వారు త‌మ దైన ముద్ర వేశారు.

అబ్దుల్ ల‌తీఫ్ అల్‌నెసెఫ్‌.. కువైట్‌కు చెందిన ప్ర‌ముఖ ప‌బ్లిష‌ర్‌. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల సంస్కృతుల‌ను ఆయ‌న అధ్య‌య‌నం చేయ‌డంతోపాటు.. ప‌ట్టు సాధించారు. ర‌చ‌యిత అబ్దుల్లా అల్ బ‌రౌన్‌.. అద్భుతమైన అనువాద‌కుడిగా పేరు తెచ్చుకున్నారు.

రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం కువైట్‌కు వెళ్లిన ప్ర‌ధాని మోడీ.. అనేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు. కువైట్‌లోని భార‌త సంత‌తి పౌరుల‌తోనూ.. ఆయ‌న సంభాషించ‌నున్నారు. కువైట్ రాజు.. షేక్ మెష‌ల్ అల్ అహ్మ‌ద్ అల్ జ‌బ‌ర్ అల్ స‌బా ఆహ్వానం మేర‌కు ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఇరు దేశాల మ‌ధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలపై చ‌ర్చించ‌నున్నారు. గల్ఫ్ క‌ప్ ఫుట్‌బాల్ టోర్న‌మెంట్ ప్రారంభ కార్య‌క్ర‌మంలోనూ ప్ర‌ధాని పాల్గొని ప్ర‌సంగించారు.

This post was last modified on December 22, 2024 8:00 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

45 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago