మాజీమంత్రి ఈటల రాజేందర్ నిర్ణయం సరైనదేనా ? ఇపుడిదే ప్రశ్నపై జనాల్లో చర్చ మొదలైంది. మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన టీఆర్ఎస్ ఎంఎల్ఏ తొందరలో బీజేపీలో చేరబోతున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాను కలిసి చర్చలు జరిపారు. కాబట్టి కమలం కండువాను కప్పుకోవటం ఇక లాంఛనమనే అనిపిస్తోంది. ముందుగా రాష్ట్రంలో కమలం పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ముఖ్యనేతలతో భేటీ అయిన ఈటలకు పార్టీలో …
Read More »ఒకరు కాదు.. ముగ్గురు ‘ముద్దు’ అంటున్న చైనా..!
ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏది అనగానే.. ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది చైనా. ఆ దేశంలో జనాభా చాలా ఎక్కువ. ఆ జనాభాని కంట్రోల్ చేయడానికి ఆ దేశం.. అప్పట్లో ఓ సిద్ధాంతాన్ని తీసుకువచ్చింది. ‘ ఒకరే ముద్దు.. లేక అసలే వద్దు’ ఇది ఆ దేశ సిద్ధాంతం. ఈ రూల్ ని చాలా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. చైనాలో ఎవరైనా జంట రెండో సంతానం …
Read More »షాక్ఃకరోనా వ్యాక్సిన్ పనిచేయట్లేదని కేసు పెట్టాడు
ఇప్పుడు చర్చంతా కరోనా, ఈ మహమ్మారి రాకుండా చెక్ పెట్టే వ్యాక్సిన్ గురించే. వ్యాక్సిన్ల కొరత ప్రజలను కలవరపాటుకు గురిచేస్తుంటే తాను కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ యాంటీబాడీలు వృద్ధి చెందలేదంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. యూపీలోని లక్నోకు చెందిన ప్రతాప్ చంద్ర అనే ఆ వ్యక్తి ఆషియానా పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు పెట్టాడు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసే సీరం …
Read More »తొందరలోనే చిన్నమ్మ రీ ఎంట్రీ
తమిళనాడు రాజకీయాల్లోకి తొందరలోనే శశికళ అలియాస్ చిన్నమ్మ రీఎంట్రీ ఉండబోతోందట. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళు బెంగుళూరు జైల్లో శిక్ష అనుభివించిన చిన్నమ్మ ఎన్నికలకు ముందు తమిళనాడులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమెను దురదృష్టం వెన్నాడటంతో ఎన్నికల్లో సైలెంట్ అయిపోవాల్సొచ్చింది. దాంతో దివంగత ముఖ్యమంత్రి నెచ్చెలిగా పాపులరైన శశికళ ప్రమేయం లేకుండానే ఎన్నికలు పూర్తయిపోయాయి. డీఎంకే కూటమి సాధించిన ఘన విజయంతో ఎంకే స్టాలిన్ సీఎం అయ్యారు. అయితే అందరు అనుకున్నట్లు …
Read More »ఆనందయ్య మందుకి బ్రేక్.. కృష్ణపట్నంలో కరోనా కేసులు..!
మొన్నటి వరకు అక్కడ ఒక్క కరోనా కేసు కూడా లేదు. ఆ గ్రామస్థులంతా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కరోనా తమను ఏమీ చేయలేదనే ధీమాతో ఉన్నారు. తమ గ్రామస్థుడు ఆనందయ్య ఇచ్చే మందు తమకు అందుబాటులో ఉండగా.. కరోనా తమను ఏం చేయలేదని ఊపిరిపీల్చుకున్నారు. ఇదే విషయాన్ని చుట్టుపక్కల గ్రామస్థులు కూడా నమ్మారు. అందుకే ఆ ఆనందయ్య కరోనా మందు కోసం కుప్పలు తెప్పలుగా ఎగబడ్డారు. ఈ విషయం కాస్త.. …
Read More »కేసీఆరా మజాకానా.. నెక్లెస్ రోడ్ అనే మాట ఇక వినిపించదు
సమయానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవటం.. ఏదైనా అంశంలో ఒకసారి కమిట్ అయితే.. దానికి తగ్గట్లు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. హైదరాబాదీయులకు సుపరిచితమైన నెక్లెస్ రోడ్ అనే మాట రానున్న రోజుల్లో వినిపించే అవకాశమే లేదు. ఎందుకంటే.. ఆ రోడ్డుకు పేరు మార్చాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా ముందుకు వచ్చి.. నాలుగు కూడలి …
Read More »నిజంగానే ఇవన్నీ పూర్తవుతాయా ?
రాష్ట్రంలో కొత్తగా 14 మెడికల్ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి శంకుస్ధాపన చేస్తున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండే వర్చువల్ పద్దతిలో సోమవారం శంకుస్ధాపన చేయబోతున్నారు సీఎం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల, పాడేరులో ఇప్పటికే మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా కొత్తగా 14 కాలేజీలను ఏర్పాటు చేయాలన్న జగన్ నిర్ణయానికి అనుగుణంగానే శంకుస్ధాపనలు జరుగుతున్నాయి. వైద్యావసరాల కోసం ప్రజలు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండకూడదనే …
Read More »ఢిల్లీకి మారిన సీన్
మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజకీయం ఢిల్లీకి మారింది. మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన దగ్గర నుండి హైదరాబాద్ లోనే చాలా రోజులు బిజీబిజీగా గడిపేసిన ఈటల ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో తన మద్దతుదారులతో ముందు మంతనాలు జరిపారు. తర్వాత టీఆర్ఎస్ తరపున రాజ్యసభ ఎంపి అయి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలీని డీ శ్రీనివాస్ తో భేటి జరిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ …
Read More »సీనియర్లు దారిస్తేనే కదా ?
‘తెలుగుదేశంపార్టీ పెట్టినపుడు 80-90 శాతం మంది యువకులే ఉన్నారు’ ..ఇది తాజాగా మాజీమంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెప్పిన మాటలు. రెండు రోజుల డిజిటల్ మహానాడు సందర్భంగా యనమల మాట్లాడుతు యువతకు ప్రాధాన్యత ఇస్తేనే పార్టీ బలోపేతమవుతుందన్నారు. ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు 90 శాతం మంది యువతే ఉండేవారన్నారు. యువత ప్రాధాన్యత తెలుసు కాబట్టే టికెట్లు, పదవుల్లో ఎక్కువభాగం యువతకే ఎన్టీయార్ కేటాయించినట్లు యనమల చెప్పారు. నిజమే యనమల …
Read More »బాబుతో ఇద్దరు సీనియర్ల ఆసక్తికరమైన చర్చ
రెండు రోజుల డిజిటల్ మహానాడులో నేతల మధ్య జరిగిన సంభాషణల్లో ఓ విషయం స్పష్టంగా బయటపడింది. అదేమిటంటే చాలావర్గాలు తెలుగుదేశంపార్టీకి దూరమైపోయాయనే విషయం. దూరమైపోయిన సామాజికవర్గాలను మళ్ళీ దగ్గరకు తీసుకోవటం ఎలాగ అనే అంశంపై చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఇదే విషయమై సోమిరెడ్డి మాట్లాడుతు టీడీపీకి క్రిస్తియన్, ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజికవర్గాలు దూరమైపోయిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు …
Read More »థర్టీ ప్లస్ ఇయర్స్ ఇండస్ట్రీ వెక్కిరిస్తోంది బాబు
రాజకీయ నాయకుడి ఏం ఉన్నా లేకున్నా.. ఎప్పుడేం మాట్లాడాలి.. ఏం మాట్లాడకూడదన్న విషయం మీద మాత్రం అవగాహన ఉండాలి. ఎప్పుడు ఎవరి భుజం మీద చేయి వేయాలి? ఎప్పుడు ఎవరి మీద నుంచి భుజం తీసేయాలన్న అంశంపై క్లారిటీ ఉండాలి. ఒకవేళ.. ఇలాంటి విషయాలకు లైవ్ ఎంగ్జాఫుల్ కావాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మించినోళ్లు ఉండరు. తెలివిగా స్నేహ హస్తం చాచటం.. అంతే తెలివిగా చేతిని వెనక్కి …
Read More »చౌదరిని ఎవరూ పట్టించుకోవట్లేదు
ఎవరు మాత్రం ఊరికేనే రాజకీయాలు వదిలేస్తారు? ఎవరికి మాత్రం పదవులంటే ఆదరణ ఉండదు. కానీ, ఆ సీనియర్ నాయకుడు మాత్రం.. వచ్చే ఎన్నికల్లో తప్పుకొంటున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో అందరూ ఉలిక్కిపడతారని.. తనకు ప్రాధాన్యం పెరుగుతుందని అనుకున్నారు. కానీ.. అలాంటివేవీ జరగలేదు. ఆయనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 1983 బ్యాచ్కు చెందిన టీడీపీ నేత. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. తాను చెప్పాల్సిందేదో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates