ఓడిస్తాన‌న్న పెద్దిరెడ్డి.. బాబు స‌ర్కారుకు ఓటేశారే!

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. వైసీపీ అగ్ర‌నేత‌, మాజీ మంత్రి. నిరంతరం.. టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించే నాయ‌కుడు. అంతేకాదు..చంద్ర‌బాబును కుప్పంలో ఓడించి తీరుతాన‌ని శ‌ప‌థం చేసిన విష‌యం తెలిసిం దే. ఎన్నిక‌ల‌కు ముందు రెండేళ్ల నుంచి కుప్పంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టి మ‌రీ.. అక్క‌డ చంద్ర‌బాబును ఓడిం చేలా మంత్రాంగం చేసిన పెద్దిరెడ్డి.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో సైలెంట్ అయిపో యారు.

ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కారు ఏర్ప‌డిన 100 రోజుల్లోనే కూట‌మి ప్ర‌భుత్వానికి మార్కులు వేస్తున్నా రు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చాలా బాగా ప‌నిచేస్తోంది! అని పెద్దిరెడ్డి చెప్పారంటేనే ఆశ్చ‌ర్యం.. విస్మ‌యం రెండూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇది నిజ‌మేనా? అంటే.. అచ్చంగా నిజ‌మే. ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. పుంగ‌నూరులో ఓ చిన్నారి అశ్వియ అంజూమ్ ను ఓ మ‌హిళ అన్నం పెడ‌తాన‌ని ఇంటికి తీసుకువెళ్లి చంపేసింది. ఇది జ‌రిగి నాలుగు రోజులు అయింది.

దీనికి కార‌ణం.. చిన్నారి తండ్రి వ‌ద్ద స‌ద‌రు మ‌హిళ అప్పులు తీసుకుంది. ఈ సొమ్మును తిరిగి ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌డంతో మ‌హిళ ఈ దారుణానికి ఒడిగ‌ట్టింది. అయితే.. ఈ విష‌యం వెలుగులోకి రాగానే స‌ర్కారు హుటాహుటిన స్పందించింది. పెద్దిరెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో మ‌రింత అప్ర‌మ‌త్త‌మైంది. ఏకంగా హోం మంత్రి స‌హా చిత్తూరుకు చెందిన మంత్రులు కూడా బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. ఆర్థికంగా సాయం చేశారు.

నిందితురాలిని కూడా త్వ‌ర‌గానే పట్టుకున్నారు. నిజానికి ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చిన త‌ర్వాత విప‌క్ష నేత‌గా జ‌గ‌న్ అక్క‌డ ప‌ర్య‌టించాల‌ని అనుకున్నారు. కానీ, ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు 24 గంట‌ల ముందే.. స‌ర్కారు.. ఈ కేసును ప‌రిష్క‌రించేసింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో స్పందించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి..చంద్ర‌బాబు స‌ర్కారు బాగా ప‌నిచేసింది. అత్యంత వేగంగా స్పందించింది. ముగ్గురు మంత్రులు బాధితుల‌ను ఓదార్చారు. అందుకే.. మేం అక్క‌డకు పోలేదు అనికితాబివ్వ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌ను జ‌గ‌న్ ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి.