Political News

జ‌న‌సేన రైటిస్టు పార్టీగా మారిందా?: ష‌ర్మిల

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికల‌కు ముందు.. ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థించేందుకు లౌకిక వాద పార్టీగా ఉన్న‌జ‌న‌సేన ఒక్క‌సారిగా ఇప్పుడు రైటిస్ట్ పార్టీగా మారిపోయిందా? అని ప్ర‌శ్నించారు. అధికారంలోకి రాక‌ముందు.. వ‌చ్చిన త‌ర్వాత ప‌వ‌న్‌లో మార్పు వ‌చ్చింద‌ని ఆమె అన్నారు. ఆయ‌న వేషం(కాషాయం క‌ట్టుకోవ‌డం), భాష‌(స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌) కూడా మారిపోయాయ‌ని తెలిపారు. బాధ్య‌తా యుత‌మైన ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక మ‌తానికి గొడుగు ప‌ట్ట‌డం ఏంట‌ని నిల‌దీశారు.

తిరుప‌తిలో గురువారం సాయంత్రం నిర్వ‌హించిన వారాహి బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ష‌ర్మిల త‌ప్పుబట్టారు. త‌న ప్ర‌సంగంలో రాహుల్ గాంధీ ప్ర‌స్తావ‌న‌ను తీసుకురావడాన్ని ఆమె తీవ్రంగా నిర‌సించారు. వెంట‌నే రాహుల్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేశారు. మ‌త రాజ‌కీయాల్లోకి రాహుల్‌ను లాగుతున్నార‌ని, దీనిని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా ఖండిస్తున్నాన‌ని ష‌ర్మిల చెప్పారు. రాహుల్ గాంధీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని పవన్ కల్యాణ్ ను ఆమె డిమాండ్ చేశారు.

ఇత‌ర మ‌తాల మాటేంటి?

ఒక మ‌తానికి కొమ్ముకాస్తున్న‌ట్టుగా ప‌వ‌న్ వ్యాఖ్యానించార‌న్న ష‌ర్మిల‌.. రాష్ట్రంలో ఇత‌ర మ‌తాల మాటేంట‌ని ప్ర‌శ్నించారు. ఒక మ‌తానికే డిప్యూటీ సీఎం ప్ర‌తినిధిగా ఉంటే.. ఇత‌ర మ‌తాల వారు అభ‌ద్ర‌తా భావంలో ఉండ‌రా? అని ప్ర‌శ్నించారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో అన్ని మ‌తాల వారూ జ‌న‌సేన‌కు ఓటేశార‌న్న విష‌యాన్ని ఆయ‌న మ‌రిచిపోతున్నార‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్ఎస్ఎస్‌కు ఏజెంట్‌గా ప‌నిచేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌ధాని మోడీ చెప్పిన‌ట్టు చేస్తున్న మీకు(ప‌వ‌న్‌) .. రాహుల్‌ను విమ‌ర్శించే నైతిక‌త ఉందా? అని నిల‌దీశారు.

బీజేపీకి కొమ్ము కాస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. లౌకిక వాదం గురించి మాట్లాడితే న‌వ్వు వ‌స్తోంద‌న్నారు. గోద్రా(గుజ‌రాత్‌), మ‌ణిపూర్ అల్ల‌ర్లకు కార‌ణం బీజేపీ కాదా? అని ప్ర‌శ్నించారు. అలాంటి పార్టీతో చేతులు క‌లిపి ఇప్పుడు ఒక మ‌తానికి ప్ర‌తినిధిగా ప‌రిచ‌యం చేసుకుంటున్న ప‌వ‌న్‌కు రాహుల్ గాంధీని విమ‌ర్శించే అర్హ‌త లేద‌న్నారు. దేశ‌వ్యాప్తంగా సోద‌ర భావం పెంపొందించేందుకు రాహుల్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. అలాంటి నేత‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు స‌రికాద‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on October 4, 2024 10:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago