మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరబోతున్న నేపథ్యంలో ఒంగోలులో ఫ్లెక్సీ వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో పాటు బాలినేని ఫ్లెక్సీలు కలిపి వేయడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫ్లెక్సీలు చింపి వేశాయి. ఈ క్రమంలోనే ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా బాలినేనికి మరో షాక్ తగిలింది. జనసేనలో చేరినా బాలినేనిని వదిలిపెట్టమబోమంటూ దామచర్ల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బాలినేని జనసేనలో చేరినా చర్యలు తప్పవని దామచర్ల వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, బాలినేనితో పాటు ఆయన తనయుడు ప్రణీత్ పై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2024 ఎన్నికలకు ముందు తనపై, టీడీపీ నేతలపై, కార్యకర్తలపై బాలినేని అక్రమ కేసులు పెట్టించారని గుర్తు చేశారు. అటువంటి బాలినేనిని పవన్ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. బాలినేనిపై చర్యల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, ఎంతవరకైనా వెళతానని దామచర్ల తేల్చి చెప్పారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఈ రోజు జనసేనలో చేరబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలినేని భారీ సభ, భారీ కాన్వాయ్ తో పవన్ సమక్షంలో జనసేనలో చేరతారని అంతా భావించారు. కానీ, బాలినేని అత్యంత నిరాడంబరంగా ఈ రోజు జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఒంగోలులో సభ, కాన్వాయ్ లతో బల ప్రదర్శన అవసరం లేదని, ఒక్కరే మంగళగిరి వచ్చి పార్టీలో చేరాలని జనసేన అధిష్టానం ఆదేశించడంతో బాలినేని బల ప్రదర్శన విరమించుకున్నారు. బాలినేనితోపాటు ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ కూడా నేడు జనసేనలో చేరబోతున్నారు.
This post was last modified on September 26, 2024 6:59 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…