ఏపీలో వివాదాస్పదంగా మారిన ‘కోనోకార్పస్’ మొక్కల వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మొక్కలను పెంచొద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు.. విదేశాల్లోనూ ఈ మొక్కలను పెంచడం లేదని.. వీటి వల్ల మేలు జరగకపోగా.. కీడు జరుగుతుందని చెప్పారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ‘మనం-వనం’ కార్యక్రమానికి సంబంధించి పవన్ కల్యాణ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
ఈ సందర్బంగా ఆయన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం అందరి బాధ్యత అని.. దీనిని సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఈక్రమంలోనే కోనా కార్పస్ మొక్కలను ఎక్కడున్నా పీకేయాలని.. వాటిని పెంచవద్దని సూచించారు. ఒకప్పుడు పచ్చదనం కోసం అరబ్ దేశాలు ఈ మొక్కలు పెంచాయని.. కానీ, వీటి వల్ల శ్వాస సంబంధిత సమస్యలు రావడంతోపాటు.. భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయని గుర్తించారని తెలిపారు. అందుకే మన రాష్ట్రంలో కోనోకార్పస్ మొక్కలను పెంచొద్దని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
మరి వివాదం ఏంటి?
అయితే.. కోనాకార్పస్ మొక్కలపై ప్రస్తుతం ఏపీ హైకోర్టులో నాలుగు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖల య్యాయి. వీటిపై గత రెండు నెలలుగా విచారణ జరుగుతోంది. ఈ మొక్కలను కొట్టి వేస్తున్నారని.. కాపాడాలని పేర్కొంటూ.. పలువురు పర్యావరణ ప్రేమికులతో పాటు.. వ్యన్య ప్రేమికులు కూడా పిల్స్ దాఖలు చేశారు. అంతేకాదు.. వీటిపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని కూడా వారు తప్పు అని చెబుతున్నారు. ఎక్కడా శాస్త్రీయంగా రుజువు కాలేదని చెబుతున్నారు.
అంతేకాదు… పలువురు బోటానికల్(వృక్ష శాస్త్రం) శాస్త్ర వేత్తలు రాసిన అంశాలను కూడా.. హైకోర్టుకు వివరించారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని హైకోర్టు సీరియస్గా తీసుకుంది. రెండు రోజుల కిందట.. జాతీయ బొటానికల్ అథారిటీ వివరణ కోరింది. ఆ వివరణ వచ్చాక.. చెట్లను పెంచాలో.. వద్దో తేలుస్తామని ప్రకటించింది. ఈ విచారణ ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. ఇంతలోనే పవన్ ఇలా ప్రకటించడంతో పిల్స్ వేసిన వారు..ఏంచేస్తారో చూడాలి.
This post was last modified on August 30, 2024 2:49 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…