Political News

పిఠాపురం మ‌హిళ‌లకు.. ప‌వ‌న్ కానుక‌లు!

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నుంచి ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అక్క‌డి వారి హృద‌యాల‌ను కూడా దోచుకున్నారు. అనేక విమ‌ర్శ‌లు.. ఎత్తులు పైఎత్తుల‌ను కూడా త‌ట్టుకుని ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌వ‌న్‌కు జై కొట్టారు. భారీ మెజారిటీతో విజ‌యం అందించారు. దీనికి కృత‌జ్ఞ‌త‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పిఠాపురంలో అత్యాధుని సౌక‌ర్యాల‌తో కూడిన ఆసుప‌త్రిని ఏర్పాటు చేయిస్తున్నారు. ప్ర‌స్తుతం దీనిపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇంత‌లోనే పిఠాపురం మ‌హిళ‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ శ్రావ‌ణ శుక్ర‌వారాన్నిపుర‌స్క‌రించుకుని ప్ర‌త్యేక కానుక‌లు పంపించారు.

పిఠాపురంలో ప్ర‌త్యేకంగా ఉన్న పుర‌హూతికా అమ్మవారి ఆల‌యం గురించి.. ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలిసింది. వాస్త‌వానికి ఎన్నో ద‌శాబ్దాలుగా ఇక్క‌డ అమ్మ‌వారు పూజ‌లు అందుకుంటున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌త్యేకంగా ఈ ఆల‌యాన్ని ద‌ర్శించి అమ్మ‌వారికి పూజ‌లు చేశారు. మెగా ఫ్యామిలీ కూడా వ‌చ్చి ఆ స‌మ‌యంలోనే పూజలు చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఈ ఆల‌యంలో ప్ర‌తి శ్రావ‌ణ మాసం చివ‌రి శుక్ర‌వారం అమ్మ‌వారికి ప్ర‌త్యేకంగా పూజ‌లు చేస్తారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌లు పుర‌హూతికా వృతాలు చేస్తార‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పూజ‌ల్లో పాల్గొనే మ‌హిళ‌ల కోసం కానుక‌లు పంపించారు.

ఈ ప్ర‌త్యేక పూజ‌ల‌కు 5 వేల మంది మ‌హిళ‌లు వ‌స్తార‌న్న అంచ‌నా ఉంది. అయితే.. ప‌వ‌న్ మాత్రం అద‌నంగానే 12 వేల ప‌ట్టు చీర‌ల‌ను(ఒక్కొక్క‌టీ రూ.2000ల‌కు త‌గ్గ‌ద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు)పిఠాపురానికి పంపించారు. దీనికి అద‌నంగా.. ప‌సుపు, కుంకను కూడా జ‌త చేశారు. అదేవిధంగా స్థానికంగా మ‌హిళ‌లు వ‌చ్చేందుకు ప్ర‌త్యేక ఏర్పాటు చేయాల‌ని పార్టీ నాయ‌కుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఆల‌య క‌మిటీకి ఈ చీర‌ల‌ను అందించాల‌ని.. తొక్కిస‌లాట‌లు జ‌ర‌గ‌కుండా.. ప‌క్కాగా కార్య‌క్ర‌మం నిర్వ‌హించేలా చూడాలని కూడా ప‌వ‌న్ ఆదేశించారు. దీంతో 12 మంది మ‌హిళ‌ల‌కు ప‌ట్టు చీర‌లు పంపిణీ చేసేందుకు జ‌న‌సేన నాయ‌కులు పిఠాపురానికి క్యూ క‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో నాగ‌బాబు పాల్గొనే అవ‌కాశం ఉంది. 

This post was last modified on August 29, 2024 10:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

9 minutes ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

11 minutes ago

పిఠాపురంలో పిచ్చి పిచ్చి వేషాలేస్తే…

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో పిచ్చి పిచ్చి…

36 minutes ago

రాజు గారెక్కడ రాజాసాబ్?

ప్రభాస్‌ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…

2 hours ago

రాజధాని ఎఫెక్ట్: వైసీపీలో చీలిక?

వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…

4 hours ago

కోర్టు కటాక్షం… జన నాయకుడికి మోక్షం

ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…

4 hours ago