వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి డాక్టర్ సుధాకర్ను వేధించిన విషయం తెలిసిందే. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుధాకర్ ఎన్ 90 మాస్క్ను కోరిన ఘటన అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. కరోనా తీవ్రంగా ప్రబలిన సమయంలో విధుల్లో పనిచేయాలంటే భయంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో డాక్టర్ సుధాకర్ను సస్పెండ్ చేయడమే కాకుండా ప్రభుత్వం ఆయనను తీవ్రంగా వేధించింది. నడిరోడ్డుపై ఆయన చేతులు కట్టేసి పోలీసులు అరెస్టు చేసిన తీరు సభ్యసమాజాన్ని షాక్కు గురి చేసింది. ఆ తర్వాత సుధాకర్ మృతి చెందారు. అయితే ఆయనను వేధించిన ప్రభుత్వం, అనంతరం డాక్టర్గా ఆయనకు రావాల్సిన భత్యాలు, అలవెన్సులను కూడా నిలుపుదల చేసింది. దీంతో ఆయన కుటుంబం పూర్తిగా దుర్దశకు చేరుకుంది.
అంతేకాదు డాక్టర్ సుధాకర్కు టీడీపీ రాజకీయ రంగు పులిమేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించారు. అప్పటి నుంచి ఆ కుటుంబం తీవ్ర ఆవేదనలోనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలిచింది. సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.
ఆ కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే ప్రభుత్వ వైద్యుడిగా ఆయనకు రావాల్సిన అలవెన్సులు, భత్యాలను కూడా విడిగా చెల్లించనున్నారు.
ఇక ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఆయన కుమారుడు లలిత్ ప్రసాద్కు పదోన్నతి కల్పించి, గ్రూప్ 2 స్థాయి డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మొత్తంగా నాడు జగన్ ప్రభుత్వం సుధాకర్ కుటుంబాన్ని రోడ్డున పడేస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవడం గమనార్హం. గతంలో కూడా పలువురు వైసీపీ పాలనలో బాధితులైన వారికి కూటమి సర్కారు అండగా నిలిచిన ఉదాహరణలు ఉన్నాయి.
This post was last modified on January 9, 2026 3:58 pm
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…