Political News

రాజధాని ఎఫెక్ట్: వైసీపీలో చీలిక?

వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో బలమైన రెడ్డి సామాజిక వర్గం జగన్‌తో తీవ్రంగా విభేదిస్తోంది. రాజధాని అమరావతిని కాదన్న నాటి నుంచి ఈ ప్రాంతంలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గం జగన్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాంతంలోనే మెజారిటీ అసెంబ్లీ సీట్లు ఉండడం గమనార్హం.

రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందితే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దాంతో భూముల ధరలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్‌తో పాటు అనేక రంగాల్లో వృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెంది, పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ అంశాన్ని రెడ్డి సామాజిక వర్గంతో పాటు ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం కూడా బలంగా నమ్ముతోంది. అయితే ఈ విషయంపై జగన్ ఇప్పటికీ తన పాత వైఖరినే కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారం ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీయడంతో వైసీపీపై నమ్మకం మరింత తగ్గుతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు కూడా అనేక మంది రెడ్డి నాయకులు వైసీపీకి దూరమయ్యారు. దీనికి ప్రధాన కారణంగా రాజధాని అమరావతిపై జగన్ వైఖరినే పేర్కొంటున్నారు. నెల్లూరు నుంచి కృష్ణా వరకు పలువురు కీలక నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ప్రజల అభిప్రాయాలకు విలువ లేనప్పుడు పార్టీలో కొనసాగి నష్టపోవడం ఎందుకన్న భావన వారిలో ఏర్పడింది.

ఇది వైసీపీకి అప్పట్లోనే పెద్ద దెబ్బగా మారింది. ఇప్పుడు కూడా జగన్ వైఖరిలో మార్పు కనిపించకపోవడం, అమరావతిపై అక్కసును కొనసాగించడం వల్ల భవిష్యత్తులో ఈ ప్రభావం మరింత పెరుగుతుందన్న ఆందోళన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఓటమి ఎదురైనప్పటికీ, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మరింత చేదుగా మారుతుందన్న భయంతో కొందరు నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇప్పటికే చాలామంది నేతలు పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పటికైనా జగన్ తన వైఖరిలో మార్పు తెస్తారేమో అన్న ఆశతో కొందరు ఎదురు చూస్తున్నారు. కానీ ఆయనలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో వైసీపీలో చీలిక వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

This post was last modified on January 9, 2026 12:26 pm

Share
Show comments
Published by
Satya
Tags: YSRCP

Recent Posts

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

1 hour ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

2 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

4 hours ago

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

5 hours ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

5 hours ago

పిఠాపురంలో పిచ్చి పిచ్చి వేషాలేస్తే…

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో పిచ్చి పిచ్చి…

5 hours ago