ప్రభాస్ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా. కానీ మోషన్ పోస్టర్ వదిలినపుడు దీని లెక్కే వేరు అనిపించింది. ప్రభాస్ను ఓల్డ్ కింగ్ గెటప్లో చూపించి.. భారీ విజువల్స్తో క్యూరియాసిటీ పెంచాడు దర్శకుడు మారుతి. ఇక విడుదలకు మూడు నెలల ముందు రిలీజ్ చేసిన ట్రైలర్లో ప్రభాస్ను రాజు గెటప్లో చూపిస్తూ తీసిన సన్నివేశాలు, డైలాగులతో సినిమా మీద అంచనాలను పెంచాడు మారుతి.
ఆ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్నట్లుగా కనిపించడం.. మనుషులను గాల్లోకి లేపి కంట్రోల్ చేస్తున్నట్లుగా పెట్టిన షాట్.. ‘‘ఏందిరా మీ బాధ’’ అనే డైలాగ్.. ఇవన్నీ కూడా క్రేజీగా అనిపించాయి. సినిమాకు ఈ పాత్రే హైలైట్ అవుతుందనే అంచనాలు కలిగాయి. ‘రాజాసాబ్’ పోస్టర్లలో కూడా మొదట్నుంచి ఈ రాజు పాత్రనే హైలైట్ చేస్తూ వచ్చారు. సిగార్తో ప్రభాస్ పవర్ ఫుల్ లుక్ క్రేజీగా అనిపించింది.
ఈ పాత్ర మీద ఎన్నో అంచనాలతో సినిమాకు వెళ్లిన వాళ్లకు థియేటర్లలో షాక్ తప్పలేదు. ఇంటర్వెల్ ముందు వస్తుంది.. సెకండాఫ్లో ఉంటుంది.. క్లైమాక్స్లో వస్తుంది అనుకుంటూ ఎంతో ఉత్కంఠతో చూసిన ప్రేక్షకులకు చివరికి నిరాశ తప్పలేదు. సినిమాలో ఎక్కడా ఆ పాత్ర లేదు. ఈ విషయంలో ప్రేక్షకులు తీవ్ర అసహనానికే గురవుతున్నారు. ఈ పాత్ర తాలూకు సన్నివేశాలు లేపేశారంటూ విడుదలకు ముందు ప్రచారం జరిగినా.. అలా ఎలా చేస్తారులే అనుకున్నారు.
మరి ఈ క్యారెక్టర్ను పార్ట్-2 కోసం దాచి పెట్టారో ఏమో తెలియదు కానీ.. పార్ట్-1లో ఆ క్యారెక్టర్ లేకపోవడం మాత్రం ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తోంది. మరోవైపు రిలీజ్ ట్రైలర్లో చూపించిన ‘జోకర్’ గెటప్ కూడా పార్ట్-1లో లేదని, అది సెకండ్ పార్ట్కు లీడ్ అని తేలింది. ఈ విషయాన్ని మారుతి ముందే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టేశాడు. ఆ సంగతి తెలియక థియేటర్లకు వెళ్లిన వాళ్లకూ నిరాశ తప్పలేదు. ఇప్పుడు సినిమాకు డివైడ్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఈ క్యారెక్టర్లను స్క్రీన్ మీద చూస్తామా అన్నది సందేహమే.
This post was last modified on January 9, 2026 1:55 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…