Political News

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ వస్తున్న విశిష్టమైన ఉత్సవం. ఏకాదశ రుద్రులతో కూడిన ప్రభలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, భుజాలపై ఎత్తుకుని నిర్వహించే ఈ వేడుకకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

ఈ ప్రభల తీర్థాన్ని దర్శించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు కోనసీమకు తరలివస్తుంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఆ రోజు ఉపవాసం ఉండి, తమ ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యువత పెద్ద సంఖ్యలో ప్రభల తీర్థానికి వెళ్లి ప్రభలను భుజాలపై మోసుకుంటారు.

ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రభల తీర్థానికి అధికారిక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ ఎన్నాళ్ల నుంచో ఉంది. అయితే ఇది ప్రతి సారి వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకకు అయ్యే ఖర్చును భరించడమే కాకుండా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించనుంది. ఈ నెల 16న కనుమ రోజున జరిగే ప్రభల తీర్థం కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిధులతో మరింత వైభవంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా భక్తులు హాజరవుతుంటారు.

బాబు ఏమన్నారంటే..

తాజాగా సీఎం చంద్రబాబు ప్రభల తీర్థంపై స్పందించారు. సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకగా జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని పేర్కొన్నారు. దీనిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కనుమ రోజున జరిగే ఈ అతిపెద్ద పండుగ తెలుగువారికి గర్వకారణమని చెప్పారు.

ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయని, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విశేషాన్ని దేశ ప్రజలకు తెలియజేశారని చంద్రబాబు గుర్తు చేశారు.

This post was last modified on January 9, 2026 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

36 minutes ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

3 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

3 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

4 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago