కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ వస్తున్న విశిష్టమైన ఉత్సవం. ఏకాదశ రుద్రులతో కూడిన ప్రభలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, భుజాలపై ఎత్తుకుని నిర్వహించే ఈ వేడుకకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
ఈ ప్రభల తీర్థాన్ని దర్శించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు కోనసీమకు తరలివస్తుంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఆ రోజు ఉపవాసం ఉండి, తమ ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యువత పెద్ద సంఖ్యలో ప్రభల తీర్థానికి వెళ్లి ప్రభలను భుజాలపై మోసుకుంటారు.
ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రభల తీర్థానికి అధికారిక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ ఎన్నాళ్ల నుంచో ఉంది. అయితే ఇది ప్రతి సారి వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకకు అయ్యే ఖర్చును భరించడమే కాకుండా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించనుంది. ఈ నెల 16న కనుమ రోజున జరిగే ప్రభల తీర్థం కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిధులతో మరింత వైభవంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా భక్తులు హాజరవుతుంటారు.
బాబు ఏమన్నారంటే..
తాజాగా సీఎం చంద్రబాబు ప్రభల తీర్థంపై స్పందించారు. సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకగా జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని పేర్కొన్నారు. దీనిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కనుమ రోజున జరిగే ఈ అతిపెద్ద పండుగ తెలుగువారికి గర్వకారణమని చెప్పారు.
ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయని, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విశేషాన్ని దేశ ప్రజలకు తెలియజేశారని చంద్రబాబు గుర్తు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…