Political News

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ వస్తున్న విశిష్టమైన ఉత్సవం. ఏకాదశ రుద్రులతో కూడిన ప్రభలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, భుజాలపై ఎత్తుకుని నిర్వహించే ఈ వేడుకకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

ఈ ప్రభల తీర్థాన్ని దర్శించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు కోనసీమకు తరలివస్తుంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఆ రోజు ఉపవాసం ఉండి, తమ ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యువత పెద్ద సంఖ్యలో ప్రభల తీర్థానికి వెళ్లి ప్రభలను భుజాలపై మోసుకుంటారు.

ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రభల తీర్థానికి అధికారిక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ ఎన్నాళ్ల నుంచో ఉంది. అయితే ఇది ప్రతి సారి వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకకు అయ్యే ఖర్చును భరించడమే కాకుండా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించనుంది. ఈ నెల 16న కనుమ రోజున జరిగే ప్రభల తీర్థం కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిధులతో మరింత వైభవంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా భక్తులు హాజరవుతుంటారు.

బాబు ఏమన్నారంటే..

తాజాగా సీఎం చంద్రబాబు ప్రభల తీర్థంపై స్పందించారు. సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకగా జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని పేర్కొన్నారు. దీనిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కనుమ రోజున జరిగే ఈ అతిపెద్ద పండుగ తెలుగువారికి గర్వకారణమని చెప్పారు.

ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయని, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విశేషాన్ని దేశ ప్రజలకు తెలియజేశారని చంద్రబాబు గుర్తు చేశారు.

This post was last modified on January 9, 2026 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

215 కోట్ల ఆఫర్ వద్దనుకున్నారా

దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…

15 minutes ago

‘భ‌ర్త సంపాద‌న ఎంతో భార్య‌కు చెప్ప‌క్క‌ర్లేదు’

స‌హ‌జంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్య‌లు ఆస‌క్తి చూపుతారు. ఈ విష‌యం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…

47 minutes ago

డేర్ చేయకపోవడమే డెకాయిట్ తెలివి

ముందు ప్రకటించిన ప్రకారమైతే అడివి శేష్ డెకాయిట్ మార్చి 19 విడుదల కావాలి. కానీ అదే రోజు దురంధర్ 2,…

2 hours ago

ఇండియా ముందుకు వెళ్లాలంటే?

టీ20 ప్రపంచకప్‌లో మొన్నటిదాకా భారత జట్టు టైటిల్‌కు హాట్ ఫేవరెట్. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచింది. మొత్తం…

2 hours ago

తల్లి సినిమాలు ఒక్కటీ చూడని హీరో పిల్లలు

సినిమాల పట్ల ఆసక్తి లేని పిల్లలు తక్కువగా ఉంటారు. అందులోనూ సినీ కుటుంబానికి చెందిన వాళ్లయితే కచ్చితంగా అటు వైపు…

3 hours ago

ర‌ఘురామ కస్టడీ కేసు: అటు సస్పెన్షన్.. ఇటు అరెస్ట్!

వైసీపీ హ‌యాంలో అప్పటి ఆ పార్టీ న‌ర‌సాపురం ఎంపీ, ప్ర‌స్తుత అసెంబ్లీ ఉప‌స‌భాప‌తి రఘురామ‌కృష్ణ రాజును అక్ర‌మంగా అరెస్టు చేసి..…

4 hours ago