కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ వస్తున్న విశిష్టమైన ఉత్సవం. ఏకాదశ రుద్రులతో కూడిన ప్రభలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, భుజాలపై ఎత్తుకుని నిర్వహించే ఈ వేడుకకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
ఈ ప్రభల తీర్థాన్ని దర్శించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు కోనసీమకు తరలివస్తుంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఆ రోజు ఉపవాసం ఉండి, తమ ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యువత పెద్ద సంఖ్యలో ప్రభల తీర్థానికి వెళ్లి ప్రభలను భుజాలపై మోసుకుంటారు.
ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రభల తీర్థానికి అధికారిక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ ఎన్నాళ్ల నుంచో ఉంది. అయితే ఇది ప్రతి సారి వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకకు అయ్యే ఖర్చును భరించడమే కాకుండా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించనుంది. ఈ నెల 16న కనుమ రోజున జరిగే ప్రభల తీర్థం కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిధులతో మరింత వైభవంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా భక్తులు హాజరవుతుంటారు.
బాబు ఏమన్నారంటే..
తాజాగా సీఎం చంద్రబాబు ప్రభల తీర్థంపై స్పందించారు. సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకగా జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని పేర్కొన్నారు. దీనిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కనుమ రోజున జరిగే ఈ అతిపెద్ద పండుగ తెలుగువారికి గర్వకారణమని చెప్పారు.
ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయని, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విశేషాన్ని దేశ ప్రజలకు తెలియజేశారని చంద్రబాబు గుర్తు చేశారు.
This post was last modified on January 9, 2026 3:57 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…