Political News

పిఠాపురంలో పిచ్చి పిచ్చి వేషాలేస్తే…

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో పిచ్చి పిచ్చి వేషాలేస్తే.. ఏరేస్తాం అంటూ.. తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ఇంటి పై కాకి వాలినా.. రాజ‌కీయం చేస్తున్నార‌ని ఆయ‌న మండి ప‌డ్డారు. ఏ చిన్న ఘ‌ట‌న జ‌రిగినా.. దానిని చిల‌వ‌లు ప‌ల‌వ‌లు చేసి ప్ర‌చారం చేస్తున్నార‌ని.. ఇక ముందు అలా జ‌రిగితే.. ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు.

తాజాగా `పీఠికాపుర సంక్రాంతి` పేరుతో పిఠాపురంలో ముంద‌స్తు సంక్రాంతి.. వేడుక‌ల‌ను ఆయ‌న ప్రారంభించారు. తొలుత తెలుగు సంప్ర‌దాయాలు ఉట్టి ప‌డేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప‌రిశీలించారు. క‌ళా రూపాల‌ను వీక్షించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. పిఠాపురంలో కాకి ఈక ప‌డినా.. ఏదో జ‌రిగిపోతోందంటూ.. ప్ర‌చారం చేస్తున్నార‌ని.. అవాస్త‌వాల‌ను వైర‌ల్ చేస్తున్నార‌ని.. ఇది స‌రికాద‌ని హెచ్చ‌రించారు.  ఇలా చేసేవారు ఎంతటి వారైనా ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు.

చివ‌ర‌కు స్కూల్ పిల్ల‌లు పెన్సిళ్ల‌కోసం కొట్టుకున్నా.. పెద్ద వార్త‌ను చేస్తున్నార‌ని.. మండిప‌డ్డారు. కానీ.. ఇదే స‌మ‌యంలో సొంత బాబాయిని చంపినా అది వార్త‌గా రాద‌ని ఎద్దేవా చేశారు. నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చి గొడ‌వ‌లు చేసేవారికి ఇదే నాహెచ్చ‌రిక అంటూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వంలో మాదిరిగా ఇప్పుడు చేస్తే.. తాట తీస్తామ‌ని హెచ్చ‌రించారు. శాంతి భ‌ద్ర‌తల విష‌యంలో పోలీసులు మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న సూచించారు.

ఇక, పిఠాపురంలో జ‌రుగుతున్న సంక్రాంతి ఉత్స‌వాలు.. ఈ పండుగ‌కే ఒక కేరాఫ్‌గా మారాల‌ని కోరుకుంటున్నట్టు తెలిపారు. “తెలంగాణకు ఆంధ్రా ప్రాంత ప్రజల ప్రేమను తీసుకెళ్లాలి. అక్కడి సోదరీమణులను సంక్రాంతికి ఆహ్వానించి.. వారికి గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని రుచి చూపాలి“ అని ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచించారు.

కోడి పందేలు, జూదాలు సంప్ర‌దాయంగా వ‌స్తున్నాయ‌ని.. ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌డుతున్న అభివృద్ధి ప‌నుల‌ను ఆయ‌న వివ‌రించారు. త‌న‌కు అధికారం ఉన్నా లేకపోయినా ఆఖరి శ్వాస వరకు పిఠాపురం ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు.

This post was last modified on January 9, 2026 3:32 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

2 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

3 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

3 hours ago

లోకేశ్ పై జోగి వివాదాస్పద కామెంట్లు

కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…

4 hours ago

అంబటి ఇంటిపై దాడి… హై టెన్షన్

ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…

4 hours ago

భాగ్య‌న‌గ‌రంలో గ‌న్ క‌ల్చ‌ర్.. డేంజ‌రే!

తెలంగాణ ప్ర‌భుత్వం... పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారుస్తామ‌ని చెబుతున్న హైద‌రాబాద్‌లో గ‌న్ క‌ల్చ‌ర్ పెరుగుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వ్య‌క్తిగ‌తంగా…

4 hours ago