ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసి విడుదలకు మార్గం సుగమం చేయాల్సిందిగా మదరాస్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నిర్మాతలు హమ్మయ్య అనుకుంటున్నారు.
అయితే ప్రభుత్వం తరఫున వకీల్ సుందరేశన్ చీఫ్ జస్టిస్ ముందు అప్పీల్ కోరడంతో ఫ్యాన్స్ మళ్ళీ టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన పరిశీలన జరుగుతోంది కానీ ఇంకోసారి వాయిదా పడటం లాంటివి జరగకపోవచ్చు. ఇప్పుడు కెవిఎన్ ప్రొడక్షన్స్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ముందుగా చేయాల్సిన పని బెస్ట్ రిలీజ్ డేట్ సెట్ చేసుకోవడం. పండగ ఛాన్స్ మిస్ అయినట్టే. ఎందుకంటే తమిళనాడులో ఇబ్బంది లేదు కానీ ఓవర్సీస్ లో స్క్రీన్లు వేరే సినిమాలకు కేటాయించారు. రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు మొదలైనవి వాటిలో ఉన్నాయి.
జన నాయకుడు తప్పుకోవడంతో ద్రౌపతి 2 లాంటి ఇతర చిత్రాలు హఠాత్తుగా రేసులోకి వచ్చాయి. కార్తీ వా వతియర్ (అన్నగారు వచ్చారు) కూడా ట్రై చేస్తోంది. ఈ నేపథ్యంలో జన నాయకుడు జనవరి చివరి వారం రిపబ్లిక్ డే ఆప్షన్ చూడొచ్చు. లేదా ఫిబ్రవరికి షిఫ్టయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఒకవేళ కొత్త డేట్ ఏది తీసుకున్నా ముందు ఏర్పడ్డ బజ్ అయితే రాకపోవచ్చని ఒక అంచనా. విజయ్ ఫ్యాన్స్ మిస్ చేయకపోయినా సాధారణ ప్రేక్షకుల మీద ఈ పోస్ట్ పోన్ల పర్వం ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. కాకపోతే ఒక సానుకూల విషయం ఏంటంటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు మంచి స్కోప్ దొరుకుతుంది.
మాములుగా అయితే ఇప్పుడీ పోటీలో నలిగిపోయేది. విజయ్ టాలీవుడ్ ఫ్యాన్స్ కి ఇది ఒకరకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. భగవంత్ కేసరి రీమేక్ అనే క్లారిటీ వచ్చాక కూడా వివాదానికి దారి తీసిన రాజకీయ అంశాలు ఏమై ఉంటాయనే దాని మీద మూవీ లవర్స్ జన నాయకుడు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…