Political News

ప్ర‌జ‌ల కోసం కూలీన‌వుతా:  ప‌వ‌న్

ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. తాజాగా అన్న‌మ‌య్య జిల్లాలోని మైసూరువారిపాలెం గ్రామంలో నిర్వ‌హించిన గ్రామ స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ప‌నుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం.. గ్రామ‌స్థుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంపై ప‌వ‌న్ స్పందించారు. తాను ప‌నిచేసేందుకు, ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పారు.

“ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌న్న నిబ‌ద్ధ‌త ఉంది. అస‌వ‌ర‌మైతే.. వారి కోసం కూలీగా మారేందుకు నేను సిద్ధం. నేను నిరంత‌రం.. ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేస్తున్నా. వారికి క‌ష్ట‌మొస్తే.. అండ‌గా ఉన్నా. ఈ రోజు డిప్యూటీ సీఎం ప‌ద‌విలో ఉన్నా.. కానీ, నాకు ప్ర‌జ‌లే ముఖ్యం. ప‌ద‌వులు ముఖ్యం కాదు“ అని ప‌వ‌న్ తేల్చి చెప్పారు.  చంద్ర‌బాబు వంటి దూర‌దృష్టి(విజ‌న్‌) ఉన్న నాయ‌కుడి ద‌గ్గ‌ర ప‌నిచేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. తాను ఎంతో నేర్చుకుంటున్నాన‌ని తెలిపారు.

చంద్ర‌బాబు వ‌ల్లే.. ల‌క్ష‌ల మందికి ఒకే ఒక్క‌రోజులో పింఛ‌న్లు ఇవ్వ‌గ‌లుగుతున్నామ‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానిం చారు. అప్పుల నుంచి అభివృద్ధి దిశ‌గా రాష్ట్రాన్ని ముందుకు న‌డిపించ‌గ‌ల శ‌క్తి ఒకే ఒక్క చంద్ర‌బాబుకు మాత్ర‌మే ఉంద‌ని వ్యాఖ్యానించారు. “నాకంటే బాగా ఆలోచించ గలిగేవాళ్ల వెంట నడిచేందుకు నేనేమీ సంకోచించను. పాలనానుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన నాకుంది“ అని ప‌వ‌న్ తేల్చి చెప్పారు.  

త్వ‌ర‌లో గూండా నిరోధ‌క‌ చ‌ట్టం

త్వ‌ర‌లోనే గూండా నిరోధ‌క‌ చ‌ట్టం తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో కొంద‌రు చేస్తున్న ఆగ‌డాలు.. భూక‌బ్జాల‌ను ఎదుర్కొనేందుకు ఈ చ‌ట్టాన్ని తీసుకురానున్న‌ట్టు తెలిపారు. రాయ‌ల‌సీమ‌లో వ‌ల‌స‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వాటిని అరిక‌ట్టేందుకు త్వ‌ర‌లోనే `నైపుణ్యాభివృద్ది విశ్వ‌విద్యాల‌యాన్ని` తీసుకురానున్న‌ట్టు తెలిపారు. దీనిద్వారా.. గ్రామీణుల‌కు శిక్ష‌ణ ఇచ్చి.. ఇక్క‌డే ఉపాధి మార్గాలు వెతుక్కునేలా చేస్తామ‌ని చెప్పారు.  

This post was last modified on August 23, 2024 9:25 pm

Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

Share
Show comments
Published by
Satya
Tags: Pawan Kalyan

Recent Posts

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

1 hour ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

2 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

2 hours ago

విజయ్ నిర్మాతలకు ఊహించని పండగ

అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…

2 hours ago

మే నెల బోణీ చేదుగా ఉంది

కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…

3 hours ago

ఎమ్మెల్యేగా ఆ రాష్ట్ర సీఎం ఓటమి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…

4 hours ago