Political News

ప్ర‌జ‌ల కోసం కూలీన‌వుతా:  ప‌వ‌న్

ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. తాజాగా అన్న‌మ‌య్య జిల్లాలోని మైసూరువారిపాలెం గ్రామంలో నిర్వ‌హించిన గ్రామ స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ప‌నుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం.. గ్రామ‌స్థుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంపై ప‌వ‌న్ స్పందించారు. తాను ప‌నిచేసేందుకు, ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పారు.

“ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌న్న నిబ‌ద్ధ‌త ఉంది. అస‌వ‌ర‌మైతే.. వారి కోసం కూలీగా మారేందుకు నేను సిద్ధం. నేను నిరంత‌రం.. ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేస్తున్నా. వారికి క‌ష్ట‌మొస్తే.. అండ‌గా ఉన్నా. ఈ రోజు డిప్యూటీ సీఎం ప‌ద‌విలో ఉన్నా.. కానీ, నాకు ప్ర‌జ‌లే ముఖ్యం. ప‌ద‌వులు ముఖ్యం కాదు“ అని ప‌వ‌న్ తేల్చి చెప్పారు.  చంద్ర‌బాబు వంటి దూర‌దృష్టి(విజ‌న్‌) ఉన్న నాయ‌కుడి ద‌గ్గ‌ర ప‌నిచేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. తాను ఎంతో నేర్చుకుంటున్నాన‌ని తెలిపారు.

చంద్ర‌బాబు వ‌ల్లే.. ల‌క్ష‌ల మందికి ఒకే ఒక్క‌రోజులో పింఛ‌న్లు ఇవ్వ‌గ‌లుగుతున్నామ‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానిం చారు. అప్పుల నుంచి అభివృద్ధి దిశ‌గా రాష్ట్రాన్ని ముందుకు న‌డిపించ‌గ‌ల శ‌క్తి ఒకే ఒక్క చంద్ర‌బాబుకు మాత్ర‌మే ఉంద‌ని వ్యాఖ్యానించారు. “నాకంటే బాగా ఆలోచించ గలిగేవాళ్ల వెంట నడిచేందుకు నేనేమీ సంకోచించను. పాలనానుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన నాకుంది“ అని ప‌వ‌న్ తేల్చి చెప్పారు.  

త్వ‌ర‌లో గూండా నిరోధ‌క‌ చ‌ట్టం

త్వ‌ర‌లోనే గూండా నిరోధ‌క‌ చ‌ట్టం తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో కొంద‌రు చేస్తున్న ఆగ‌డాలు.. భూక‌బ్జాల‌ను ఎదుర్కొనేందుకు ఈ చ‌ట్టాన్ని తీసుకురానున్న‌ట్టు తెలిపారు. రాయ‌ల‌సీమ‌లో వ‌ల‌స‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వాటిని అరిక‌ట్టేందుకు త్వ‌ర‌లోనే `నైపుణ్యాభివృద్ది విశ్వ‌విద్యాల‌యాన్ని` తీసుకురానున్న‌ట్టు తెలిపారు. దీనిద్వారా.. గ్రామీణుల‌కు శిక్ష‌ణ ఇచ్చి.. ఇక్క‌డే ఉపాధి మార్గాలు వెతుక్కునేలా చేస్తామ‌ని చెప్పారు.  

This post was last modified on August 23, 2024 9:25 pm

Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

Share
Show comments
Published by
Satya
Tags: Pawan Kalyan

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

1 hour ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

5 hours ago