Political News

కోల్‌క‌తా హ‌త్యాచారం.. శ‌వాన్ని మాయం చేయాల‌నుకున్నారు

ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలోని ఆర్ జీ క‌ర్ ఆసుప‌త్రిలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన దారుణ హ‌త్యాచార ఘ‌ట‌న త‌ర్వాత‌.. ఆమె శ‌వాన్ని మాయం చేయాల‌ని ఈ ఘ‌ట‌న‌లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారు భావించారా? అనంత‌రం.. అస‌లు ఈ ఘ‌ట‌న‌పై స‌ర్కారు పెద్ద‌లే.. మృతురాలి త‌ల్లిదండ్రుల‌కు వాస్త‌వాలు చెప్ప‌కుండా క‌ప్పిపుచ్చే ప్ర‌య‌త్నం చేశారా? ఆధారాలు లేకుండా ధ్వంసం చేయాల‌న ఇకూడా ప్ర‌య‌త్నించారా? అంటే.. ఔన‌నే చెబుతోంది.. సీబీఐ నివేదిక‌.

కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌ పై క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ జ‌రిపిన సీబీఐ అధికారులు తాజాగా.. ప్రాథ‌మిక నివేదిక‌ను సుప్రీంకోర్టుకు అందించారు. ఈ వ్య‌వ‌హారంలో తెర‌వెనుక చోటు చేసుకున్న ఘ‌ట‌న ల‌ను నివేదిక‌లో పేర్కొన్నారు. హ‌త్యాచారం అనంత‌రం.. శ‌వాన్ని మాయం చేయాల‌ని భావించార‌ని తెలిపారు. ఈ కేసును క‌ప్పిపుచ్చే ప్ర‌య‌త్నం చేశార‌ని, క‌నీసం బాధితురాలి త‌ల్లిదండ్రుల‌కు కూడా విష‌యాన్ని చెప్ప‌లేద‌ని, స్పృహ కోల్ప‌యి ప‌డిపోయింద‌ని.. మాత్ర‌మే పోన్‌లో సందేశం ఇచ్చార‌ని నివేదిక‌లో స్ప‌ష్టం చేశారు.

దేశాన్ని సైతం కుదిపేసిన హత్యాచార ఘటనపై సీబీఐ మ‌ధ్యంత‌ర లేదా ప్రాధ‌మిక‌ రిపోర్టును సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించారు. దీనిని ప‌రిశీలించిన సుప్రీంకోర్టు.. స్థానిక పోలీసు లు, క‌ళాశాల యాజ‌మాన్యం వ్య‌వ‌హ‌రించిన తీరును తీవ్రంగా ఆక్షేపించింది. పోలీసులు రాజ‌కీయ నేత‌ల ఒత్తిళ్ల‌కు త‌లొగ్గార‌ని స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ట్టు ధ‌ర్మాస‌నం పేర్కొంది. శ‌వాన్ని అంత్య‌క్రియ‌ల‌కు అప్ప‌గించేసిన త‌ర్వాత‌.. ఎఫ్ ఐఆర్ న‌మోదుచేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించింది.

హ‌త్యాచార ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతంలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న పేరిట నిర్మాణాలు చేప‌ట్ట‌డాన్ని కూడా సుప్రీంకోర్టు త‌ప్పుబ‌ట్టింది. ఇదిలావుంటే.. దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న చేస్తున్న వైద్యులు.. స‌ద‌రు నిర‌స‌న‌ల‌ను త‌క్ష‌ణ‌మే విర‌మించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విధుల్లో పాల్గొంటూనే నిర‌స‌న వ్య‌క్తం చేయొచ్చ‌ని పేర్కొంది. అయితే.. త‌మ‌కు న్యాయం చేసేందుకు హామీ ఇవ్వాల‌న్న వైద్యుల త‌ర‌ఫు న్యాయ‌వాదిపై ధ‌ర్మాస‌నం అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 22, 2024 4:43 pm

Share
Show comments
Published by
Satya
Tags: CBI

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago