పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్ జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దారుణ హత్యాచార ఘటన తర్వాత.. ఆమె శవాన్ని మాయం చేయాలని ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు భావించారా? అనంతరం.. అసలు ఈ ఘటనపై సర్కారు పెద్దలే.. మృతురాలి తల్లిదండ్రులకు వాస్తవాలు చెప్పకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారా? ఆధారాలు లేకుండా ధ్వంసం చేయాలన ఇకూడా ప్రయత్నించారా? అంటే.. ఔననే చెబుతోంది.. సీబీఐ నివేదిక.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన పై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన సీబీఐ అధికారులు తాజాగా.. ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టుకు అందించారు. ఈ వ్యవహారంలో తెరవెనుక చోటు చేసుకున్న ఘటన లను నివేదికలో పేర్కొన్నారు. హత్యాచారం అనంతరం.. శవాన్ని మాయం చేయాలని భావించారని తెలిపారు. ఈ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని, కనీసం బాధితురాలి తల్లిదండ్రులకు కూడా విషయాన్ని చెప్పలేదని, స్పృహ కోల్పయి పడిపోయిందని.. మాత్రమే పోన్లో సందేశం ఇచ్చారని నివేదికలో స్పష్టం చేశారు.
దేశాన్ని సైతం కుదిపేసిన హత్యాచార ఘటనపై సీబీఐ మధ్యంతర లేదా ప్రాధమిక రిపోర్టును సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు సమర్పించారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు.. స్థానిక పోలీసు లు, కళాశాల యాజమాన్యం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఆక్షేపించింది. పోలీసులు రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారని స్పష్టమవుతున్నట్టు ధర్మాసనం పేర్కొంది. శవాన్ని అంత్యక్రియలకు అప్పగించేసిన తర్వాత.. ఎఫ్ ఐఆర్ నమోదుచేయడం ఏంటని ప్రశ్నించింది.
హత్యాచార ఘటన జరిగిన ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన పేరిట నిర్మాణాలు చేపట్టడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇదిలావుంటే.. దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వైద్యులు.. సదరు నిరసనలను తక్షణమే విరమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విధుల్లో పాల్గొంటూనే నిరసన వ్యక్తం చేయొచ్చని పేర్కొంది. అయితే.. తమకు న్యాయం చేసేందుకు హామీ ఇవ్వాలన్న వైద్యుల తరఫు న్యాయవాదిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on August 22, 2024 4:43 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…