ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కోలుకోలేని విధంగా దెబ్బ తగిలింది. కీలక నాయకుడు, కాపు సామాజిక వర్గంలో మంచి పేరున్న మాజీ మంత్రి ఆళ్ల నాని(ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్) వైసీపీకి తాజాగా రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు పేర్కొన్నారు. బలమైన సామాజిక వర్గంతోపాటు.. వినయశీలి, విధేయుడిగా కూడా నానీకి మంచి పేరుంది. 2019 ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న నాని.. తొలి రెండున్నరేళ్లపాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత ఈ పదవిని విడదల రజనీకి ఇచ్చారు.
వాస్తవానికి నాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కరోనా దేశాన్ని కుదిపేసింది. ఈ క్రమంలో ఆయన అలుపెరుగని సేవ చేశారు. ఎక్కడా చిన్న విమర్శ కూడా రాకుండా.. కరోనా బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారు. దీనికిగాను.. ఆయన కేంద్రం నుంచి అప్పట్లో ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇది తగ్గుముఖం పట్టిందనే లోగా.. సొంత నియోజకవర్గం ఏలూరులో జనాలు విష పూరిత వాయువు పీల్చి పదుల సంఖ్యలో మృతి చెందారు.
దీంతో రేయింబవళ్లు నాని అక్కడే ఉండి సేవలు చేశారు. వైద్యం అందేలా.. ఉరుకులు పరుగులు పెట్టా రు. అధికారులతో పెట్టించారు కూడా. అయితే.. అలాంటి నానీని ఠంచనుగా మంత్రి పదవి నుంచి జగన్ తప్పించేశారు. నిజానికి ఆయనను కొనసాగించాలని సొంత పార్టీ నాయకులే చెప్పినా జగన్ వినిపించుకోలేదనే వాదన ఉంది. ఈ క్రమంలోనే విడదల రజనీకి పెద్ద పీట వేశారు. అయితే.. నాని ఎక్కడా ఎదురు మాట్లాడలేదు. అధినేత చెప్పిందే వేదంగా భావించి ముందుకు సాగారు.
కాగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో చివరి నిముషం వరకు కూడా ఆయనకు టికెట్ ఇస్తారా లేదా? అనే టెన్షన్ కొనసాగింది. చివరకు టికెట్ ఇచ్చినా.. కూటమి హవాలో ఆయన కూడా ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి బయటకు రాని నాని.. తాజాగా వైసీపీకే కాదు.. ప్రత్యక్ష రాజకీయాలకు కూడా దూరం అవుతున్నట్టు పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఎదిగిన నాని.. వివాద రహితుడు.. అందరికీ కావాల్సిన వాడు కావడం గమనార్హం.
This post was last modified on August 9, 2024 3:11 pm
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…