ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కోలుకోలేని విధంగా దెబ్బ తగిలింది. కీలక నాయకుడు, కాపు సామాజిక వర్గంలో మంచి పేరున్న మాజీ మంత్రి ఆళ్ల నాని(ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్) వైసీపీకి తాజాగా రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు పేర్కొన్నారు. బలమైన సామాజిక వర్గంతోపాటు.. వినయశీలి, విధేయుడిగా కూడా నానీకి మంచి పేరుంది. 2019 ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న నాని.. తొలి రెండున్నరేళ్లపాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత ఈ పదవిని విడదల రజనీకి ఇచ్చారు.
వాస్తవానికి నాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కరోనా దేశాన్ని కుదిపేసింది. ఈ క్రమంలో ఆయన అలుపెరుగని సేవ చేశారు. ఎక్కడా చిన్న విమర్శ కూడా రాకుండా.. కరోనా బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారు. దీనికిగాను.. ఆయన కేంద్రం నుంచి అప్పట్లో ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇది తగ్గుముఖం పట్టిందనే లోగా.. సొంత నియోజకవర్గం ఏలూరులో జనాలు విష పూరిత వాయువు పీల్చి పదుల సంఖ్యలో మృతి చెందారు.
దీంతో రేయింబవళ్లు నాని అక్కడే ఉండి సేవలు చేశారు. వైద్యం అందేలా.. ఉరుకులు పరుగులు పెట్టా రు. అధికారులతో పెట్టించారు కూడా. అయితే.. అలాంటి నానీని ఠంచనుగా మంత్రి పదవి నుంచి జగన్ తప్పించేశారు. నిజానికి ఆయనను కొనసాగించాలని సొంత పార్టీ నాయకులే చెప్పినా జగన్ వినిపించుకోలేదనే వాదన ఉంది. ఈ క్రమంలోనే విడదల రజనీకి పెద్ద పీట వేశారు. అయితే.. నాని ఎక్కడా ఎదురు మాట్లాడలేదు. అధినేత చెప్పిందే వేదంగా భావించి ముందుకు సాగారు.
కాగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో చివరి నిముషం వరకు కూడా ఆయనకు టికెట్ ఇస్తారా లేదా? అనే టెన్షన్ కొనసాగింది. చివరకు టికెట్ ఇచ్చినా.. కూటమి హవాలో ఆయన కూడా ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి బయటకు రాని నాని.. తాజాగా వైసీపీకే కాదు.. ప్రత్యక్ష రాజకీయాలకు కూడా దూరం అవుతున్నట్టు పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఎదిగిన నాని.. వివాద రహితుడు.. అందరికీ కావాల్సిన వాడు కావడం గమనార్హం.
This post was last modified on August 9, 2024 3:11 pm
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…