ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కోలుకోలేని విధంగా దెబ్బ తగిలింది. కీలక నాయకుడు, కాపు సామాజిక వర్గంలో మంచి పేరున్న మాజీ మంత్రి ఆళ్ల నాని(ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్) వైసీపీకి తాజాగా రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు పేర్కొన్నారు. బలమైన సామాజిక వర్గంతోపాటు.. వినయశీలి, విధేయుడిగా కూడా నానీకి మంచి పేరుంది. 2019 ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న నాని.. తొలి రెండున్నరేళ్లపాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత ఈ పదవిని విడదల రజనీకి ఇచ్చారు.
వాస్తవానికి నాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కరోనా దేశాన్ని కుదిపేసింది. ఈ క్రమంలో ఆయన అలుపెరుగని సేవ చేశారు. ఎక్కడా చిన్న విమర్శ కూడా రాకుండా.. కరోనా బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారు. దీనికిగాను.. ఆయన కేంద్రం నుంచి అప్పట్లో ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇది తగ్గుముఖం పట్టిందనే లోగా.. సొంత నియోజకవర్గం ఏలూరులో జనాలు విష పూరిత వాయువు పీల్చి పదుల సంఖ్యలో మృతి చెందారు.
దీంతో రేయింబవళ్లు నాని అక్కడే ఉండి సేవలు చేశారు. వైద్యం అందేలా.. ఉరుకులు పరుగులు పెట్టా రు. అధికారులతో పెట్టించారు కూడా. అయితే.. అలాంటి నానీని ఠంచనుగా మంత్రి పదవి నుంచి జగన్ తప్పించేశారు. నిజానికి ఆయనను కొనసాగించాలని సొంత పార్టీ నాయకులే చెప్పినా జగన్ వినిపించుకోలేదనే వాదన ఉంది. ఈ క్రమంలోనే విడదల రజనీకి పెద్ద పీట వేశారు. అయితే.. నాని ఎక్కడా ఎదురు మాట్లాడలేదు. అధినేత చెప్పిందే వేదంగా భావించి ముందుకు సాగారు.
కాగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో చివరి నిముషం వరకు కూడా ఆయనకు టికెట్ ఇస్తారా లేదా? అనే టెన్షన్ కొనసాగింది. చివరకు టికెట్ ఇచ్చినా.. కూటమి హవాలో ఆయన కూడా ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి బయటకు రాని నాని.. తాజాగా వైసీపీకే కాదు.. ప్రత్యక్ష రాజకీయాలకు కూడా దూరం అవుతున్నట్టు పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఎదిగిన నాని.. వివాద రహితుడు.. అందరికీ కావాల్సిన వాడు కావడం గమనార్హం.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…