Political News

రేవంత్ ఫారిన్ ట్రిప్: 3 భేటీలు.. 6 ఒప్పందాలు

అసెంబ్లీ సమావేశాల్ని పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు విదేశాల బాట పట్టారు. ఈ రోజు (శనివారం) ఆయన హైదరాబాద్ నుంచి అమెరికా.. దక్షిణ కొరియా దేశాల టూర్ కు వెళుతున్నారు. మొత్తం పన్నెండు రోజులు సాగనున్న ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ వెంట.. సీఎస్ శాంతకుమారి.. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్.. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి తదితరులు వెళ్లనున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆదివారం మంత్రి శ్రీధర్ బాబు.. సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా అమెరికా పర్యటనకు వెళతారు. వారంతా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ అండ్ టీంతో కలుస్తారు. పలువురు పారిశ్రామికవేత్తలతోనూ.. ప్రవాస భారతీయులతోనూ భేటీ కానున్న సీఎం రేవంత్ పదిన అమెరికా నుంచి బయలుదేరి దక్షిణ కొరియా సియోల్ కు చేరుకుంటారు.
అక్కడ పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. పద్నాలుగున రాష్ట్రానికి తిరిగి వస్తారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఏడాది ఆరంభంలో (జనవరి 15) దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయన.. పెట్టుబడుల కోసం తాజాగా విదేశాలకు పర్యటించటం ఇదే తొలిసారి. ఈ టూర్ లో పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకునేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. మూడు భేటీలు.. ఆరు ఒప్పందాలన్న లక్ష్యంతో రేవంత్ విదేశీ పర్యటన ఉంటుదన్న మాట వినిపిస్తోంది. తన పర్యటనలో భాగంగా అమెరికాలోని పలు నగరాల్లో (న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, కాలిఫోర్నియా) ఆయన పర్యటించనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ భేటీ అయ్యే వివిధ కంపెనీల ముఖ్యల జాబితాను చూస్తే.. ఆయన టూర్ ఎంత పక్కాగా ప్లాన్ చేసింది అర్థమవుతుంది.

ఆగస్టు 5: కాగ్నిజెంట్ సీఈవో.. సిగ్నా సీనియర్ అధికారి.. ఆర్ సీఎం.. టీబీసీ.. కార్నింగ్.. జోయిటస్ సంస్థల ప్రతినిధులతో భేటీ. ఆర్గా సీఈవో రామక్రిష్ణ.. పీ అండ్ వో సంస్థ సీవోవో శైలేష్ జెజురికర్.. ర్యాపిడ్ 7 ప్రతినిధులతో భేటీ
ఆగస్టు 6: పెప్సికో.. హెచ్ సీఏ ఉన్నతాధికారులతో భేటీ. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశం.
ఆగస్టు 7: ఛార్లెస్ స్క్వాబ్ హెడ్, పలు ఐటీ సంస్థలతో భేటీలు
ఆగస్టు 8: ట్రినెట్ సీఈవో.. ఆరమ్.. ఆమ్ జెన్.. రెనెసాస్.. అమాట్.. సెలెక్ట్ టెక్ యూనికార్న్ ప్రతినిధులతో పాటు సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశాలు
ఆగస్టు 9: గూగుల్ సీనియర్ ప్రతినిధులతో భేటీ.. స్టాన్ ఫోర్డ్ బయోడిజైన్ సెంటర్ సందర్శన.. అమెజాన్ వైస్ ప్రెసిడెంట్.. జెడ్ స్కేలర్ సీఈవో.. ఎనోవిక్స్.. మోనార్క్ ట్రాక్టర్స్.. థెర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులతో భేటీ
ఆగస్టు 12: దక్షిణ కొరియాలోని యూయూ ఫార్మా.. కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్ట టైల్స్ ఇండస్ట్రీ.. ఎల్ ఎస్ హోల్డింగ్స్.. హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిదులతో పాటు ఆ దేశ ఉన్నతాధికారులతో భేటీ.
ఆగస్టు 13: కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులతో పాటు సామ్ సంగ్.. ఎల్ జీ సంస్థల ప్రతినిధులతో చర్చలు.

This post was last modified on August 3, 2024 11:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విచారణకు భగీరథ్ డుమ్మా

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…

3 hours ago

బల పరీక్షలో నెగ్గిన విజయ్… కానీ…

ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…

3 hours ago

‘అందుకే ఇండస్ట్రీని వదిలేశా’

పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…

4 hours ago

తప్పు త్వరగా తెలుసుకున్న సీఎం విజయ్

టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…

4 hours ago

ఇంట్లో నేపాలీలు ఉంటే జాగ్రత్త

రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…

5 hours ago

IBOMMA 2.0: అరెస్ట్ అయినా ఆగలేదేంటి?

చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…

5 hours ago