హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి సూపర్ హిట్లతో ఒకప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత వరస ఫ్లాపులతో కొంత కాలం పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. యుఎస్ లో ఉండి వచ్చి రెండేళ్లుగా తిరిగి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఇంకా పర్ఫెక్ట్ కంబ్యాక్ జరగలేదు. ప్రయోగాలైతే చేస్తున్నాడు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో విరాజి మీద బోలెడు ఆశలు పెట్టుకుని ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. సెమీ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ క్రైమ్ డ్రామా నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎలా ఉందో చూద్దాం.
ఎక్కడో దూరంగా ఓ కొండ మీద మూసేయబడిన పిచ్చాసుపత్రి ఉంటుంది. ఈవెంట్ పేరుతో కొందరిని ట్రాప్ చేసి అక్కడికి పిలిపిస్తారు. స్టాండప్ కమెడియన్, సినీ ప్రొడ్యూసర్, ఫోటోగ్రాఫర్, ఆస్ట్రాలజిస్ట్, నూతన దంపతులు ఇలా అందరూ ఒకే గూటికి చేరేలా స్కెచ్ వేస్తారు. తీరా అక్కడికి వచ్చాకే తాము ప్రమాదకరమైన వలయం చిక్కుకున్నామని గుర్తించి హతాశులవుతారు. వీళ్ళతో పాటు ఒక ఎస్ఐ, డాక్టర్ కూడా ఉంటారు. తప్పించుకోవడానికి ట్రై చేసిన ఇద్దరు హత్యకు గురయ్యాక అక్కడికి ఆండీ (వరుణ్ సందేశ్) వస్తాడు. డ్రగ్స్ కోసం తపించి పోయే ఇతనికి ఆ బ్యాచుకి మధ్య జరిగేదే అసలు కథ.
దర్శకుడు ఆద్యంత్ హర్ష ఒక అరగంటలో చెప్పాల్సిన పాయింట్ ని గంటా నలభై నిమిషాలకు విస్తరించుకోవడంతో విరాజి ముప్పాతిక భాగం విపరీతమైన సాగతీతతో నడుస్తుంది. పాత్రల పరిచయం, వాళ్ళ మధ్య సంభాషణలు ఏ మాత్రం ఆసక్తి కలిగించకపోగా విసుగు తెప్పించేలా జరుగుతాయి. చివరి అరగంటలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ హార్ట్ బీట్ ఆగిపోయిన పేషెంట్ కి పల్స్ రేట్ చెక్ చేసినట్టయ్యింది. బడ్జెట్ పరిమితులు ఎన్ని ఉన్నా కథా కథనాల విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం దెబ్బ తీసింది. ఫైనల్ గా విరాజి ఏ క్యాజీ అనిపించడం తప్ప ఏం చేయలేకపోయాడు.
This post was last modified on August 3, 2024 10:41 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…