హైప్ తో సంబంధం లేకుండా మాములుగా ఒక స్టార్ హీరో సినిమా రిలీజైతే దాన్ని ఖచ్చితంగా మొదటి రోజు చూసే అభిమనులు బోలెడు ఉంటారు. కనీసం మార్నింగ్, మ్యాటీలు ఫుల్ చేసేంత కెపాసిటీ అతనికి ఉంటుంది. కానీ అసలే అంచనాలు లేకుండా జనంలో ఆసక్తే కనిపించకుండా చేసేవి ఈ మధ్య కాలంలో తరచుగా వస్తున్నాయి. నిన్న రిలీజైన ఆరోన్ మే కహాన్ దం థా ఈ క్యాటగిరిలోకే వస్తుంది. కరోనా తర్వాత దృశ్యం 2, షైతాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ చూసిన అజయ్ దేవగన్ మూవీకి మొదటి రోజు దేశవ్యాప్తంగా కేవలం కోటిన్నర కలెక్షన్ వచ్చిందంటే నమ్మగలమా. కానీ ఇది అక్షరాలా నిజం.
ముందు కథేంటో చూద్దాం. 2000 నుంచి 2024 సంవత్సరాల మధ్య జరిగిన ఒక ప్రేమ కథ ఇది. కృష్ణ(అజయ్ దేవగన్) వసుధ (టబు) లు యుక్త వయసులో ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు. అయితే అనుకోకుండా జరిగిన సంఘటనల వల్ల కృష్ణ కొన్ని హత్యలు చేసి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో వసుధ అతన్నుంచి విడిపోయి అభిజీత్ (జిమ్మీ షెర్గిల్) ని పెళ్లి చేసుకుంటుంది. సుదీర్ఘమైన శిక్షను అనుభవించి బయటికి వచ్చిన కృష్ణ ఒక్కసారి వసుధని కలవాలనుకుంటాడు. ఆ తర్వాత జరిగేది తెరమీద చూడాల్సిందే. దర్శకుడు నీరజ్ పాండే ఒక ఎమోషనల్ డ్రామాని చూపించే ప్రయత్నం చేశారు.
అయితే సహనానికి పరీక్ష పెట్టే సన్నివేశాలు, బాబోయ్ ఇదెక్కడి బోర్ అనిపించే ఎపిసోడ్లతో ఫుట్ బాల్ ఆడేయడంతో ఆరోన్ మే కహాన్ దం థా ఏ దశలోనూ కనీసం పర్వాలేదనిపించుకునే ఛాన్స్ ఇవ్వలేదు. ఉన్నంతలో మన ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం కొంత స్వాంతన కలిగించేలా ఉన్నా ఆయన సైతం యాక్సిడెంట్ లో తుక్కతుక్కయిన బండిని కాపాడలేకపోయారు. అజయ్ దేవగన్ ఓవర్ సీరియస్ గా కనిపిస్తే టబు, ఆమె యవ్వనపు పాత్రలో సయీ మంజ్రేకర్ ఓకే అనిపిస్తారు. ఓపిక ఎంత ఉన్నా థియేటర్ లో కూర్చోవడం ఇంత భారమా అనిపించే ఆరోన్ మే కహాన్ దం థాని మీ స్వంత రిస్క్ మీద ప్రయత్నించవచ్చు.
This post was last modified on August 3, 2024 10:45 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…