Political News

జగన్ ధర్నా.. ఢిల్లీ దద్దరిల్లిందా?

ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ నేతలు, కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు.. ఇక్కడ జరుగుతున్న హత్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలో బుధవారం ధర్నా కార్యక్రమం తలపెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ దెబ్బతో ఢిల్లీ దద్దరిల్లిపోతుందని.. జగన్ ఏంటో ఇప్పుడు చూస్తారని.. దేశవ్యాప్తంగా ఏపీలో కూటమి అకృత్యాలపై చర్చ జరిగిపోతుందని.. ఇలా ఒక రేంజిలో ఎలివేషన్లు ఇచ్చుకుంటూ వచ్చారు వైసీపీ మద్దతుదారులు. నాలుగు రోజులుగా వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో దీని గురించే మాట్లాడుతూ వచ్చారు. వాట్సాప్ స్టేటస్‌ల్లో కూడా దీని గురించే ప్రచారం చేశారు.

ఇప్పుడు ధర్నా డే రానే వచ్చింది. జగన్ అండ్ కో ఢిల్లీ వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అఖిలేష్ యాదవ్ లాంటి కొందరు ఇతర పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఆ పాల్గొనడం మొక్కుబడిగానే సాగింది. జగన్‌కు సంఘీభావం ప్రకటించారే తప్ప.. ఏపీలో కూటమి ప్రభుత్వం పెద్దగా మాట్లాడిందేమీ లేదు. అసలు అఖిలేష్ తప్ప పేరున్న నాయకులెవ్వరూ జగన్ నిరసన కార్యక్రమం దగ్గరికి రాకపోవడమే.. ఢిల్లీలో జగన్ పలుకుబడి ఎలాంటిదో తేటతెల్లం చేసింది.

ఢిల్లీలో ప్రాంతీయ పార్టీలు ఏదైనా కార్యక్రమం చేపట్టి అది విజయవంతం కావాలన్నా.. దాని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నా.. నేషనల్ మీడియా కవరేజీ చాలా ముఖ్యం. వాళ్లు కవర్ చేస్తేనే మైలేజీ వస్తుంది. కానీ జగన్ ధర్నా కార్యక్రమాన్ని నేషనల్ మీడియా అస్సలు పట్టించుకోలేదు. గతంలో అధికారంలో ఉండగా జగన్ నేషనల్ మీడియాతో పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఏదైనా అంశం మీద నేషనల్ మీడియా ఆయన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసినా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయేవాడు. పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి నేషనల్ మీడియా ఆయన్ని పట్టించుకునేది. కానీ ఇప్పుడు చిత్తుగా ఓడిపోవడంతో ఆయన్ని లైట్ తీసుకున్నారు. మన లోకల్ మీడియాకు సంబంధించిన ప్రతినిధులే అక్కడా కనిపించారు.

జగన్ ధర్నా ప్రభావం ఢిల్లీ మీద ఏమాత్రం కనిపించనట్లే భావించాలి. ఈ కార్యక్రమం మొక్కుబడిగానే సాగిపోయింది. ఇదిలా ఉంటే.. జగన్ ప్రధాని అవుతారంటూ ఒక నాయకుడు చేసిన కామెంట్ ట్రోల్ మెటీరియల్‌గా మారడం గమనార్హం.

This post was last modified on July 25, 2024 6:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

15 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

6 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

6 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago