వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి.. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) నాయకుడు బోడే రామచంద్రయాదవ్ దాఖలు చేశారు.
ఇదీ.. ఆరోపణ
“పుంగనూరు నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారు. అయితే.. ఆయన ఆయా ఆస్తులను తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనకుండా దాచిపెట్టారు. దీనిపై విచారణ జరిపి.. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలి”.
ఈ పిటిషన్ను హైకోర్టు..విచారణకు తీసుకుంది. తాజాగా జరిగిన విచారణకు ఇరు పక్షాల న్యాయవాదులు సహా, పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి కూడా హాజరయ్యారు. “పెద్దిరెడ్డి అనర్హుడిగా మారితే.. తర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతారు. ఆయన కూడా ఈ కేసులో ముఖ్యమే, ఆయనను కూడా విచారణలో భాగస్వామి చేస్తూ నోటీసులు ఇవ్వండి. ఇంప్లీడ్ చేయండి” అని హైకోర్టు ఆదేశించింది.
యాదవ్ చెబుతున్న ఆస్తులు ఇవే..
పెద్దిరెడ్డి అఫిడవిట్లో చూపకుండా దాచిన ఆస్తుల వివరాలు ఇవీ..
This post was last modified on July 25, 2024 7:01 am
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…