“వయసు రీత్యా.. పక్కన పెడితే.. పనులు, వ్యూహాలు, దూకుడు రీత్యా చూసినప్పుడు చంద్రబాబు నేటి యువతకు ఏమాత్రం తీసిపోరు”-ఇదీ టీడీపీ నాయకులు గతేడాది ముందు వరకు చెప్పిన మాట. “మా ముఖ్యమంత్రిని చూస్తే.. నాకే అసూయ కలుగుతుంది. ఆయన దూకుడు చూస్తే.. నాకే సిగ్గనిపిస్తుంది!!”-ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ అప్పట్లో తన తండ్రిని కొనియాడు తూ.. పదే పదే చేసుకున్న స్తోత్ర పాఠాలు. మరి.. ఏడాదిలోనే చంద్రబాబులో యువ కోణం నశించిందా? ఆయన యువతకు చేరువ కాలేక పోతున్నారా? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి.
దీనికి కారణం.. టీడీపీలోని చాలా మంది నాయకులు, మాజీ మంత్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు విషయంలో చంద్రబాబును నమ్మలేక పోతున్నారనే అంశం.. తెరమీదికి వస్తోంది. గత ఏడాది ఎన్నికల ముందు వరకు.. చంద్రబాబుపై ఉన్న నమ్మకం పార్టీలో సడలుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో వైసీపీ అధినేత, ప్రస్తుతం సీఎం జగన్పై యువతకు నమ్మకం పెరుగుతోందని తెలుస్తోంది. దీనికి కారణం.. ఇటీవల కొన్నాళ్లుగా తనయుల కోసం తండ్రులు తర్జన భర్జన పడుతున్నారు. టీడీపీని వీడుతున్నారు. వాస్తవానికి టీడీపీ యువతకు ప్రాధాన్యం ఇస్తుందని.. పార్టీలో 33 శాతం పదవులను వారికే కట్టబెడుతుందని చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకు అమలు చేయలేక పోయారు.
దీనికితోడు టీడీపీని చంద్రబాబు తర్వాత లీడ్ చేసే నాయకుడు ఎవరైనా ఉంటే.. అది ఆయన కుమారుడు నారా లోకేషే! ఆయనకు ఉన్న ఇమేజ్ ఏపాటిదో తెలిసిన నేపథ్యంలో ఆయన వెంట నడిచినా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారో .. ఏమో.. టీడీపీ నాయకులు వరుస పెట్టి తమ కుమారులను వైసీపీలోకి చేరుస్తున్నారు. కరణం వెంకటేష్ కోసం చీరాల ఎమ్మెల్యే బలరాం, గాదె మధుసూదన్రెడ్డి కోసం మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, శిద్దా సుధీర్ కోసం.. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.. తాజాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. తన ఇద్దరు కుమారుల కోసం.. చంద్రబాబును పక్కన పెట్టారంటే.. పరిస్థితి ఎలా ఉందో.. బాబుపై నమ్మకం ఎంత ఉందో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. వెళ్లిపోయిన వారు వెళ్లిపోగా.. అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ తమ తనయులను బీజేపీ బాటపట్టించేందుకు జేసీ బ్రదర్స్, పరిటాల సునీత, వెంకటేశ్ వంటివారు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…