“వయసు రీత్యా.. పక్కన పెడితే.. పనులు, వ్యూహాలు, దూకుడు రీత్యా చూసినప్పుడు చంద్రబాబు నేటి యువతకు ఏమాత్రం తీసిపోరు”-ఇదీ టీడీపీ నాయకులు గతేడాది ముందు వరకు చెప్పిన మాట. “మా ముఖ్యమంత్రిని చూస్తే.. నాకే అసూయ కలుగుతుంది. ఆయన దూకుడు చూస్తే.. నాకే సిగ్గనిపిస్తుంది!!”-ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ అప్పట్లో తన తండ్రిని కొనియాడు తూ.. పదే పదే చేసుకున్న స్తోత్ర పాఠాలు. మరి.. ఏడాదిలోనే చంద్రబాబులో యువ కోణం నశించిందా? ఆయన యువతకు చేరువ కాలేక పోతున్నారా? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి.
దీనికి కారణం.. టీడీపీలోని చాలా మంది నాయకులు, మాజీ మంత్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు విషయంలో చంద్రబాబును నమ్మలేక పోతున్నారనే అంశం.. తెరమీదికి వస్తోంది. గత ఏడాది ఎన్నికల ముందు వరకు.. చంద్రబాబుపై ఉన్న నమ్మకం పార్టీలో సడలుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో వైసీపీ అధినేత, ప్రస్తుతం సీఎం జగన్పై యువతకు నమ్మకం పెరుగుతోందని తెలుస్తోంది. దీనికి కారణం.. ఇటీవల కొన్నాళ్లుగా తనయుల కోసం తండ్రులు తర్జన భర్జన పడుతున్నారు. టీడీపీని వీడుతున్నారు. వాస్తవానికి టీడీపీ యువతకు ప్రాధాన్యం ఇస్తుందని.. పార్టీలో 33 శాతం పదవులను వారికే కట్టబెడుతుందని చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకు అమలు చేయలేక పోయారు.
దీనికితోడు టీడీపీని చంద్రబాబు తర్వాత లీడ్ చేసే నాయకుడు ఎవరైనా ఉంటే.. అది ఆయన కుమారుడు నారా లోకేషే! ఆయనకు ఉన్న ఇమేజ్ ఏపాటిదో తెలిసిన నేపథ్యంలో ఆయన వెంట నడిచినా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారో .. ఏమో.. టీడీపీ నాయకులు వరుస పెట్టి తమ కుమారులను వైసీపీలోకి చేరుస్తున్నారు. కరణం వెంకటేష్ కోసం చీరాల ఎమ్మెల్యే బలరాం, గాదె మధుసూదన్రెడ్డి కోసం మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, శిద్దా సుధీర్ కోసం.. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.. తాజాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. తన ఇద్దరు కుమారుల కోసం.. చంద్రబాబును పక్కన పెట్టారంటే.. పరిస్థితి ఎలా ఉందో.. బాబుపై నమ్మకం ఎంత ఉందో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. వెళ్లిపోయిన వారు వెళ్లిపోగా.. అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ తమ తనయులను బీజేపీ బాటపట్టించేందుకు జేసీ బ్రదర్స్, పరిటాల సునీత, వెంకటేశ్ వంటివారు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
వైసిపి అధినేత జగన్ ప్రకటించిన `ప్లాన్ బి` పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. రాష్ట్ర రాజధాని విషయంలో ప్రజలు…
నిజమేనండోయ్... భానుడి భగభగలు అప్పుడే మొదలైపోయాయి. మార్చి మాసంలో అప్పుడప్పుడు చిరు జల్లులతో పెద్దగా ఎండ ప్రభావం అయితే పెద్దగా…
చేసినవి తక్కువ సినిమాలే అయినా దర్శకుడిగా మంచి గుర్తింపే ఉంది చందూ మొండేటికి. తొలి చిత్రం ‘కార్తికేయ’తోనే అతను బలమైన…
వైసీపీ అధినేత జగన్ కు ఆయన సోదరి వైఎస్ షర్మిల కంటిలో నలుసులా మారిన సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్…
వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెక్కివెక్కి ఏడ్చారు.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.…