రాజధాని అమరావతి కోసం దాదాపు 270 రోజులుగా పోరాటాలు చేస్తున్న రైతులకు గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ ఉచిత సలహా ఇచ్చారు. రాజధాని విషయంలో రైతులు కోర్టులకు వెళ్ళేబదులు ప్రభుత్వంతో చర్చలు జరిపితే ఉపయోగం ఉంటుందని ఓ సలహా ఇచ్చారు. రాజధాని నిర్మాణం అన్నది అమరావతిలో జరిగే పనికాదని కూడా ఎంఎల్ఏ తేల్చేశారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించటానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి రైతులు ఇక ఆ ఆశలు వదిలేసుకోవాల్సిందే అంటూ క్లారిటి ఇచ్చేశారు.
అయితే ఇదే సమయంలో రైతులకు వంశీ ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అదేమిటంటే రాజధాని నిర్మాణం బదులు మెగా టౌన్ షిప్పు నిర్మిస్తే సరిపోతుందన్నారు. మెగా టౌన్ షిప్పు నిర్మాణానికి రైతులంతా తమ సమ్మతి తెలపాలట. టౌన్ షిప్పును నిర్మించినా రైతుల భూములకు మంచి ధరలే వస్తాయని ఎంఎల్ఏ హామీ ఇస్తున్నారు. రాజధాని నిర్మిస్తేనే తమ భూములకు ధరలు వస్తాయనే అపోహలో రైతులు ఉండద్దని కూడా సూచించారు. మెగా టౌన్ షిప్పు నిర్మించినా ధరలు మంచిగానే వస్తాయట.
తన ప్రతిపాదనకు రైతులు గనుక అంగీకరిస్తే తాను జగన్మోహన్ రెడ్డిని కలిసి విషయం చెప్పి ఒప్పిస్తానంటూ భరోసా ఇచ్చారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములిచ్చిన రైతులకు కూడా మెగా టౌన్ షిప్పులో ప్లాట్లు ఇవ్వటానికి సిఎంను తాను ఒప్పిస్తానని హామీ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. తాను చెప్పిన మెగా టౌన్ షిప్పు నిర్మాణానికి రైతులు ఎలా అంగీకరిస్తారని ఎంఎల్ఏ అనుకున్నారో అర్ధం కావటం లేదు. కష్టమో నష్టమో తమ వాదనను కోర్టులోనే వినిపించేందుకు రైతులు రెడీ అయ్యారు కాబట్టే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తు కోర్టుల్లో కేసులు వేశారు.
అయినా సమస్య పరిష్కారానికే తాను సూచన చేసినట్లు వంశీ చెప్పుకోవటం బాగానే ఉంది. అసలు వంశీ ఏ హోదాతో రైతులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ? వంశీ ఏమీ మంత్రి కాదు. కనీసం అధికారపార్టీ ఎంఎల్ఏ కూడా కాదు. మెగా టౌన్ షిప్పు అనే విషయం తప్ప రాజాదాని రైతులను చర్చలకు రావాలని మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, బొత్సా సత్యనారాయణతో పాటు కొందరు ఎంఎల్ఏలు కోరినా రైతులెవరు అంగీకరించలేదు. అలాంటిది టీడీపీలో తిరుగుబాటు ఎంఎల్ఏ వంశీ చెప్పగానే రైతులు వస్తారా ? తనకున్న అవకాశాలతో అధికారపార్టీతో వంశీ తిరుగుతున్నా సాంకేతికంగా ఇప్పటికీ టీడీపీ ఎంఎల్ఏనే అన్న విషయాన్ని బహుశా వంశీ మరచిపోయిట్లున్నారు.
తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న…
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…