తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎవరూ ఊహించని తీర్పు.. నాయకులకు.. పార్టీలకు కూడా అంతు చిక్కని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు తుఫానులో అతిరథ మహారథులు కొట్టుకుపోయారు. చివురు టాకులు అనుకున్న నాయకులు నిలిచి గెలిచారు. అయితే… నాయకుల పరంగా పరిస్థితి ఎలా ఉన్నప్ప టికీ.. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తారని భావించిన నాయకులు కూడా.. ఈ ఎన్నికల్లో చతికిల పడ్డారు. తమ తమ పార్టీల తరఫున బరిలో ఉన్న నాయకులను గెలిపిస్తామని కొందరు రంగంలోకి దిగారు. కానీ, వారి వ్యూహాలు ఏమాత్రం ఫలించకపోవడం గమనార్హం.
ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ను పిఠాపురంలో ఓడించి తీరుతానని శపథం చేశారు.. కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురంలో ముద్రగడ ప్రభావం ఎక్కువగా ఉందని అంచనా వేసుకన్న దరిమిలా.. ఆయన చేసిన శపథానికి ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు.. ఒకానొక సందర్భంలో ముద్రగడ.. సంచలన సవాల్ కూడా చేశారు. తానుకనుక.. పవన్ను ఓడించకపోతే.. తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని కూడా చెప్పారు
అయితే.. తాజాగా వచ్చిన పలితాల్లో పవన్ గెలుపు గుర్రం ఎక్కడమే కాదు.. 70 వేల పైచిలుకు ఓట్ల మెజారి టీతో విజయం దక్కించుకున్నారు. దీంతో ముద్రగడ సవాల్ చేసినమేరకు.. నిలబడతారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది. అయితే.. ఎవరూ ఆయనను ప్రశ్నించకుండానే.. ఆయనే స్పందించారు. తను చేసిన సవాల్కు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. అంతేకాదు. తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని అధికారికంగా ప్రకటించారు.
అంతేకాదు… వైసీపీ ఓటమిని కూడా ఆయన అంగీకరించారు. “నేను నా సవాల్ను నిలబెట్టుకోలేక పోయాను. పవన్ ఓడిస్తానన్న మాట విఫలమైంది. అయితే… నేను చేసిన వాగ్దానం ఏదైతే ఉందో.. దానికి కట్టుబడ్డాను. నా పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నాను. ఇప్పటికే.. నా పేరును మార్చాలంటూ.. దరఖాస్తు చేసుకున్నాను. త్వరలోనే దీనికి సంబంధించి గెజిట్ పబ్లికేషన్ కూడా వస్తుంది” అని ముద్రగడ వ్యాఖ్యానించారు.
This post was last modified on June 5, 2024 2:36 pm
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…