తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎవరూ ఊహించని తీర్పు.. నాయకులకు.. పార్టీలకు కూడా అంతు చిక్కని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు తుఫానులో అతిరథ మహారథులు కొట్టుకుపోయారు. చివురు టాకులు అనుకున్న నాయకులు నిలిచి గెలిచారు. అయితే… నాయకుల పరంగా పరిస్థితి ఎలా ఉన్నప్ప టికీ.. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తారని భావించిన నాయకులు కూడా.. ఈ ఎన్నికల్లో చతికిల పడ్డారు. తమ తమ పార్టీల తరఫున బరిలో ఉన్న నాయకులను గెలిపిస్తామని కొందరు రంగంలోకి దిగారు. కానీ, వారి వ్యూహాలు ఏమాత్రం ఫలించకపోవడం గమనార్హం.
ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ను పిఠాపురంలో ఓడించి తీరుతానని శపథం చేశారు.. కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురంలో ముద్రగడ ప్రభావం ఎక్కువగా ఉందని అంచనా వేసుకన్న దరిమిలా.. ఆయన చేసిన శపథానికి ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు.. ఒకానొక సందర్భంలో ముద్రగడ.. సంచలన సవాల్ కూడా చేశారు. తానుకనుక.. పవన్ను ఓడించకపోతే.. తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని కూడా చెప్పారు
అయితే.. తాజాగా వచ్చిన పలితాల్లో పవన్ గెలుపు గుర్రం ఎక్కడమే కాదు.. 70 వేల పైచిలుకు ఓట్ల మెజారి టీతో విజయం దక్కించుకున్నారు. దీంతో ముద్రగడ సవాల్ చేసినమేరకు.. నిలబడతారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది. అయితే.. ఎవరూ ఆయనను ప్రశ్నించకుండానే.. ఆయనే స్పందించారు. తను చేసిన సవాల్కు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. అంతేకాదు. తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని అధికారికంగా ప్రకటించారు.
అంతేకాదు… వైసీపీ ఓటమిని కూడా ఆయన అంగీకరించారు. “నేను నా సవాల్ను నిలబెట్టుకోలేక పోయాను. పవన్ ఓడిస్తానన్న మాట విఫలమైంది. అయితే… నేను చేసిన వాగ్దానం ఏదైతే ఉందో.. దానికి కట్టుబడ్డాను. నా పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నాను. ఇప్పటికే.. నా పేరును మార్చాలంటూ.. దరఖాస్తు చేసుకున్నాను. త్వరలోనే దీనికి సంబంధించి గెజిట్ పబ్లికేషన్ కూడా వస్తుంది” అని ముద్రగడ వ్యాఖ్యానించారు.
This post was last modified on June 5, 2024 2:36 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…