Political News

మోడీ వ‌స్తున్నారు.. కూట‌మిలో జోష్‌, వైసీపీలో టెన్ష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్న కూట‌మిలో మ‌రింత జోష్ పెర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే విజ‌యం ఖాయ‌మ‌నే ధీమాతో ఉన్న కూట‌మికి మ‌రింత న‌మ్మ‌కం క‌ల‌గ‌బోతోంది. అవును.. ఏపీలో విజ‌య‌ఢంకా మోగించేందుకు సిద్ధ‌మ‌వుతున్న టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిలో మ‌రింత ఉత్సాహాన్ని నింపేందుకు ప్ర‌ధాని మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌తో క‌లిసి ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.

చిల‌కలూరిపేట‌లో మోడీ స‌భ‌తో ఏపీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించిన కూట‌మి హుషారుగా సాగిపోతోంది. ఇప్పుడు మ‌రోసారి మోడీ వ‌స్తుండ‌టం కూట‌మికి మ‌రింత‌గా క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది. మే 6, 8 తేదీల్లో రాష్ట్రంలో మోడీ ప్ర‌చారం నిర్వ‌హిస్తారు. 6న రాజ‌మండ్రి స‌మీపంలోని వేమ‌న‌గిరిలో స‌భ‌లో పాల్గొంటారు. అన‌కాప‌ల్లిలో రోడ్ షో నిర్వ‌హిస్తారు. 8న పీలేరు అసెంబ్లీ ప‌రిధిలోని క‌లికిరి వ‌ద్ద బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు. అనంత‌రం విజ‌య‌వాడ‌లో రోడ్‌షో ఉంటుంది.

మోడీ రాక‌తో వైసీపీ టెన్ష‌న్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కూట‌మి మేనిఫెస్టోపై మోడీ ఫొటో లేద‌ని, కూట‌మిలో ఉండ‌టం బీజేపీకి ఇష్టం లేద‌ని వైసీపీ ప్ర‌చారం చేస్తోంది. కేంద్రంలో ఎన్డీయే కూట‌మికి మ‌ద్దతిస్తామ‌ని జ‌గ‌న్ కూడా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో మోడీ వ‌చ్చి వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తే ప‌రిస్థితి ఏమిట‌ని ఆ పార్టీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అది పార్టీకి తీవ్ర న‌ష్టం చేకూరుస్తుంద‌ని భ‌య‌ప‌డుతున్నార‌ని టాక్‌.

This post was last modified on May 4, 2024 2:44 pm

Share
Show comments

Recent Posts

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

15 mins ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

35 mins ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

2 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

3 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

10 hours ago

సీమ ఓట్ల హైజాక్‌.. ఎవ‌రికి మేలు?

రాయ‌లసీమ‌లో ఓట్ల హైజాక్ జ‌రిగిందా? వైసీపీకి ప‌డాల్సిన ఓట్లు.. కాంగ్రెస్‌కు ప‌డ్డాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు.…

14 hours ago