ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కూటమిలో మరింత జోష్ పెరగబోతోంది. ఇప్పటికే విజయం ఖాయమనే ధీమాతో ఉన్న కూటమికి మరింత నమ్మకం కలగబోతోంది. అవును.. ఏపీలో విజయఢంకా మోగించేందుకు సిద్ధమవుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ప్రధాని మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. చంద్రబాబు, పవన్తో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు.
చిలకలూరిపేటలో మోడీ సభతో ఏపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కూటమి హుషారుగా సాగిపోతోంది. ఇప్పుడు మరోసారి మోడీ వస్తుండటం కూటమికి మరింతగా కలిసొచ్చే అవకాశం ఉంది. మే 6, 8 తేదీల్లో రాష్ట్రంలో మోడీ ప్రచారం నిర్వహిస్తారు. 6న రాజమండ్రి సమీపంలోని వేమనగిరిలో సభలో పాల్గొంటారు. అనకాపల్లిలో రోడ్ షో నిర్వహిస్తారు. 8న పీలేరు అసెంబ్లీ పరిధిలోని కలికిరి వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడలో రోడ్షో ఉంటుంది.
మోడీ రాకతో వైసీపీ టెన్షన్ మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి మేనిఫెస్టోపై మోడీ ఫొటో లేదని, కూటమిలో ఉండటం బీజేపీకి ఇష్టం లేదని వైసీపీ ప్రచారం చేస్తోంది. కేంద్రంలో ఎన్డీయే కూటమికి మద్దతిస్తామని జగన్ కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ వచ్చి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తే పరిస్థితి ఏమిటని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అది పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని భయపడుతున్నారని టాక్.
This post was last modified on May 4, 2024 2:44 pm
అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…
ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
దేశ రాజధానిలో ఈరోజు భారత్ ట్యాక్సీ అడుగుపెట్టడంతో క్యాబ్ సర్వీసుల రంగంలో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు ఓలా, ఉబేర్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…