Political News

మోడీ వ‌స్తున్నారు.. కూట‌మిలో జోష్‌, వైసీపీలో టెన్ష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్న కూట‌మిలో మ‌రింత జోష్ పెర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే విజ‌యం ఖాయ‌మ‌నే ధీమాతో ఉన్న కూట‌మికి మ‌రింత న‌మ్మ‌కం క‌ల‌గ‌బోతోంది. అవును.. ఏపీలో విజ‌య‌ఢంకా మోగించేందుకు సిద్ధ‌మ‌వుతున్న టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిలో మ‌రింత ఉత్సాహాన్ని నింపేందుకు ప్ర‌ధాని మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌తో క‌లిసి ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.

చిల‌కలూరిపేట‌లో మోడీ స‌భ‌తో ఏపీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించిన కూట‌మి హుషారుగా సాగిపోతోంది. ఇప్పుడు మ‌రోసారి మోడీ వ‌స్తుండ‌టం కూట‌మికి మ‌రింత‌గా క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది. మే 6, 8 తేదీల్లో రాష్ట్రంలో మోడీ ప్ర‌చారం నిర్వ‌హిస్తారు. 6న రాజ‌మండ్రి స‌మీపంలోని వేమ‌న‌గిరిలో స‌భ‌లో పాల్గొంటారు. అన‌కాప‌ల్లిలో రోడ్ షో నిర్వ‌హిస్తారు. 8న పీలేరు అసెంబ్లీ ప‌రిధిలోని క‌లికిరి వ‌ద్ద బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు. అనంత‌రం విజ‌య‌వాడ‌లో రోడ్‌షో ఉంటుంది.

మోడీ రాక‌తో వైసీపీ టెన్ష‌న్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కూట‌మి మేనిఫెస్టోపై మోడీ ఫొటో లేద‌ని, కూట‌మిలో ఉండ‌టం బీజేపీకి ఇష్టం లేద‌ని వైసీపీ ప్ర‌చారం చేస్తోంది. కేంద్రంలో ఎన్డీయే కూట‌మికి మ‌ద్దతిస్తామ‌ని జ‌గ‌న్ కూడా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో మోడీ వ‌చ్చి వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తే ప‌రిస్థితి ఏమిట‌ని ఆ పార్టీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అది పార్టీకి తీవ్ర న‌ష్టం చేకూరుస్తుంద‌ని భ‌య‌ప‌డుతున్నార‌ని టాక్‌.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

4 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

4 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

5 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

6 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

6 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

6 hours ago