Political News

మోడీ వ‌స్తున్నారు.. కూట‌మిలో జోష్‌, వైసీపీలో టెన్ష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్న కూట‌మిలో మ‌రింత జోష్ పెర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే విజ‌యం ఖాయ‌మ‌నే ధీమాతో ఉన్న కూట‌మికి మ‌రింత న‌మ్మ‌కం క‌ల‌గ‌బోతోంది. అవును.. ఏపీలో విజ‌య‌ఢంకా మోగించేందుకు సిద్ధ‌మ‌వుతున్న టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిలో మ‌రింత ఉత్సాహాన్ని నింపేందుకు ప్ర‌ధాని మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌తో క‌లిసి ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.

చిల‌కలూరిపేట‌లో మోడీ స‌భ‌తో ఏపీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించిన కూట‌మి హుషారుగా సాగిపోతోంది. ఇప్పుడు మ‌రోసారి మోడీ వ‌స్తుండ‌టం కూట‌మికి మ‌రింత‌గా క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది. మే 6, 8 తేదీల్లో రాష్ట్రంలో మోడీ ప్ర‌చారం నిర్వ‌హిస్తారు. 6న రాజ‌మండ్రి స‌మీపంలోని వేమ‌న‌గిరిలో స‌భ‌లో పాల్గొంటారు. అన‌కాప‌ల్లిలో రోడ్ షో నిర్వ‌హిస్తారు. 8న పీలేరు అసెంబ్లీ ప‌రిధిలోని క‌లికిరి వ‌ద్ద బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు. అనంత‌రం విజ‌య‌వాడ‌లో రోడ్‌షో ఉంటుంది.

మోడీ రాక‌తో వైసీపీ టెన్ష‌న్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కూట‌మి మేనిఫెస్టోపై మోడీ ఫొటో లేద‌ని, కూట‌మిలో ఉండ‌టం బీజేపీకి ఇష్టం లేద‌ని వైసీపీ ప్ర‌చారం చేస్తోంది. కేంద్రంలో ఎన్డీయే కూట‌మికి మ‌ద్దతిస్తామ‌ని జ‌గ‌న్ కూడా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో మోడీ వ‌చ్చి వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తే ప‌రిస్థితి ఏమిట‌ని ఆ పార్టీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అది పార్టీకి తీవ్ర న‌ష్టం చేకూరుస్తుంద‌ని భ‌య‌ప‌డుతున్నార‌ని టాక్‌.

This post was last modified on May 4, 2024 2:44 pm

Share
Show comments

Recent Posts

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

35 minutes ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

2 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

2 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

3 hours ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

3 hours ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

7 hours ago