ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడం జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కానీ వ్యతిరేకత అనేది తన మీద కాదని, తన ఎమ్మెల్యేల మీద మాత్రమే అని జగన్ అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని తెలిపారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగి ఉంటే 81 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చారనే ప్రశ్నకు జగన్ ఇలా సమాధానం ఇచ్చారు. సొంత సర్వేలో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలపై మాత్రమే వ్యతిరేకత ఉందని వచ్చిందని జగన్ చెప్పారు. అందుకే ఆ ఎమ్మెల్యేలను మార్చామన్నారు.
అభ్యర్థుల ఎంపిక అనేది రిస్క్తో కూడింది కాదని, తన పాలనపై ఉన్న నమ్మకంతోనే మర్చానని జగన్ పేర్కొన్నారు. ఇక విశాఖ రాజధాని విషయంపై మాట్లాడుతూ.. ఎవరైనా లక్ష కోట్లు అమరావతితో పెట్టాలని ఎందుకు అనుకుంటారని? ఈ విషయంలో ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నామని చెప్పారు. ఎవరు కరెక్ట్ అనేది కోర్టులే నిర్ణయిస్తాయన్నారు. అంతే కాకుండా చంద్రబాబు జైలుకు వెళ్లిన విషయంపైనా జగన్ స్పందించారు. ఏ తప్పు చేయకపోతే 52 రోజులు ఓ వ్యక్తి జైల్లో ఎందుకుంటారంటూ జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోవైపు కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదనేలా జగన్ పేర్కొనడం గమనార్హం. రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిశామని బాబు, మోడీ అంటున్నారని జగన్ చెప్పారు. ఈ అయిదేళ్లు అభివృద్ధి కోసమే మోడీతో సత్సంబంధాలు మెయింటైన్ చేశామని అన్నారు. ఈ సారి మోడీకి 20 సీట్లు తగ్గితే మద్దతునిస్తారా అనే ప్రశ్నకు మాత్రం అది ఊహాజనిత ప్రశ్న అని జగన్ సమాధానం ఇచ్చారు. తాను పోరాడేవాళ్లతో కలిసి తనమీద బీజేపీ పోరాడుతోందని జగన్ పేర్కొన్నారు. అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వడం కుదరదనే అర్థం వచ్చేలా జగన్ వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on May 4, 2024 3:03 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…