ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడం జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కానీ వ్యతిరేకత అనేది తన మీద కాదని, తన ఎమ్మెల్యేల మీద మాత్రమే అని జగన్ అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని తెలిపారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగి ఉంటే 81 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చారనే ప్రశ్నకు జగన్ ఇలా సమాధానం ఇచ్చారు. సొంత సర్వేలో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలపై మాత్రమే వ్యతిరేకత ఉందని వచ్చిందని జగన్ చెప్పారు. అందుకే ఆ ఎమ్మెల్యేలను మార్చామన్నారు.
అభ్యర్థుల ఎంపిక అనేది రిస్క్తో కూడింది కాదని, తన పాలనపై ఉన్న నమ్మకంతోనే మర్చానని జగన్ పేర్కొన్నారు. ఇక విశాఖ రాజధాని విషయంపై మాట్లాడుతూ.. ఎవరైనా లక్ష కోట్లు అమరావతితో పెట్టాలని ఎందుకు అనుకుంటారని? ఈ విషయంలో ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నామని చెప్పారు. ఎవరు కరెక్ట్ అనేది కోర్టులే నిర్ణయిస్తాయన్నారు. అంతే కాకుండా చంద్రబాబు జైలుకు వెళ్లిన విషయంపైనా జగన్ స్పందించారు. ఏ తప్పు చేయకపోతే 52 రోజులు ఓ వ్యక్తి జైల్లో ఎందుకుంటారంటూ జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోవైపు కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదనేలా జగన్ పేర్కొనడం గమనార్హం. రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిశామని బాబు, మోడీ అంటున్నారని జగన్ చెప్పారు. ఈ అయిదేళ్లు అభివృద్ధి కోసమే మోడీతో సత్సంబంధాలు మెయింటైన్ చేశామని అన్నారు. ఈ సారి మోడీకి 20 సీట్లు తగ్గితే మద్దతునిస్తారా అనే ప్రశ్నకు మాత్రం అది ఊహాజనిత ప్రశ్న అని జగన్ సమాధానం ఇచ్చారు. తాను పోరాడేవాళ్లతో కలిసి తనమీద బీజేపీ పోరాడుతోందని జగన్ పేర్కొన్నారు. అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వడం కుదరదనే అర్థం వచ్చేలా జగన్ వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on May 4, 2024 3:03 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…