ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడం జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కానీ వ్యతిరేకత అనేది తన మీద కాదని, తన ఎమ్మెల్యేల మీద మాత్రమే అని జగన్ అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని తెలిపారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగి ఉంటే 81 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చారనే ప్రశ్నకు జగన్ ఇలా సమాధానం ఇచ్చారు. సొంత సర్వేలో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలపై మాత్రమే వ్యతిరేకత ఉందని వచ్చిందని జగన్ చెప్పారు. అందుకే ఆ ఎమ్మెల్యేలను మార్చామన్నారు.
అభ్యర్థుల ఎంపిక అనేది రిస్క్తో కూడింది కాదని, తన పాలనపై ఉన్న నమ్మకంతోనే మర్చానని జగన్ పేర్కొన్నారు. ఇక విశాఖ రాజధాని విషయంపై మాట్లాడుతూ.. ఎవరైనా లక్ష కోట్లు అమరావతితో పెట్టాలని ఎందుకు అనుకుంటారని? ఈ విషయంలో ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నామని చెప్పారు. ఎవరు కరెక్ట్ అనేది కోర్టులే నిర్ణయిస్తాయన్నారు. అంతే కాకుండా చంద్రబాబు జైలుకు వెళ్లిన విషయంపైనా జగన్ స్పందించారు. ఏ తప్పు చేయకపోతే 52 రోజులు ఓ వ్యక్తి జైల్లో ఎందుకుంటారంటూ జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోవైపు కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదనేలా జగన్ పేర్కొనడం గమనార్హం. రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిశామని బాబు, మోడీ అంటున్నారని జగన్ చెప్పారు. ఈ అయిదేళ్లు అభివృద్ధి కోసమే మోడీతో సత్సంబంధాలు మెయింటైన్ చేశామని అన్నారు. ఈ సారి మోడీకి 20 సీట్లు తగ్గితే మద్దతునిస్తారా అనే ప్రశ్నకు మాత్రం అది ఊహాజనిత ప్రశ్న అని జగన్ సమాధానం ఇచ్చారు. తాను పోరాడేవాళ్లతో కలిసి తనమీద బీజేపీ పోరాడుతోందని జగన్ పేర్కొన్నారు. అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వడం కుదరదనే అర్థం వచ్చేలా జగన్ వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on May 4, 2024 3:03 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…