ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడం జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కానీ వ్యతిరేకత అనేది తన మీద కాదని, తన ఎమ్మెల్యేల మీద మాత్రమే అని జగన్ అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని తెలిపారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగి ఉంటే 81 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చారనే ప్రశ్నకు జగన్ ఇలా సమాధానం ఇచ్చారు. సొంత సర్వేలో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలపై మాత్రమే వ్యతిరేకత ఉందని వచ్చిందని జగన్ చెప్పారు. అందుకే ఆ ఎమ్మెల్యేలను మార్చామన్నారు.
అభ్యర్థుల ఎంపిక అనేది రిస్క్తో కూడింది కాదని, తన పాలనపై ఉన్న నమ్మకంతోనే మర్చానని జగన్ పేర్కొన్నారు. ఇక విశాఖ రాజధాని విషయంపై మాట్లాడుతూ.. ఎవరైనా లక్ష కోట్లు అమరావతితో పెట్టాలని ఎందుకు అనుకుంటారని? ఈ విషయంలో ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నామని చెప్పారు. ఎవరు కరెక్ట్ అనేది కోర్టులే నిర్ణయిస్తాయన్నారు. అంతే కాకుండా చంద్రబాబు జైలుకు వెళ్లిన విషయంపైనా జగన్ స్పందించారు. ఏ తప్పు చేయకపోతే 52 రోజులు ఓ వ్యక్తి జైల్లో ఎందుకుంటారంటూ జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోవైపు కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదనేలా జగన్ పేర్కొనడం గమనార్హం. రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిశామని బాబు, మోడీ అంటున్నారని జగన్ చెప్పారు. ఈ అయిదేళ్లు అభివృద్ధి కోసమే మోడీతో సత్సంబంధాలు మెయింటైన్ చేశామని అన్నారు. ఈ సారి మోడీకి 20 సీట్లు తగ్గితే మద్దతునిస్తారా అనే ప్రశ్నకు మాత్రం అది ఊహాజనిత ప్రశ్న అని జగన్ సమాధానం ఇచ్చారు. తాను పోరాడేవాళ్లతో కలిసి తనమీద బీజేపీ పోరాడుతోందని జగన్ పేర్కొన్నారు. అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వడం కుదరదనే అర్థం వచ్చేలా జగన్ వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on May 4, 2024 3:03 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…