Political News

పోసానికి షాక్… ఫ్యామిలీ అంతా చంద్రబాబు వైపు

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా నిరంత‌రం మీడియాలో ప్ర‌చారం చేస్తున్న వైసీపీ నాయ‌కుడు, సినీ న‌టుడు, ర‌చ‌యిత‌, నిర్మాత పోసాని కృష్ణ‌ముర‌ళికి సొంత కుటుంబంలోనే భారీ షాక్ తగిలింది. ఆయ‌నేమో.. నిరంత‌రం సీఎం జ‌గ‌న్ భ‌జ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఏపీ ఫిల్మ్  డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్న పోసాని.. జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్త‌స్తున్నారు. ఇదేసమ‌యంలో ఆయ‌న చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై నిరంతరం విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కానీ, అనూహ్యంగా పోసాని కుటుంబం మాత్రం చంద్ర‌బాబుకు జై కొట్టింది. అంతేకాదు.. మ‌రోసారి ఏపీ సీఎం జగన్ అయితే.. త‌ప్ప రాష్ట్రానికి ద‌శ‌, దిశ ఉండ‌ద‌ని కూడా తేల్చి చెప్పేయ‌డం గ‌మ‌నార్హం. తాజాగా పోసాని కృష్ణ‌ముర‌ళి త‌మ్ముడి కుమారుడు.. పోసాని యోగేంద్ర‌నాథ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్ర‌బాబును క‌లిసిన ఆయ‌న త‌న అభిమానాన్ని వ్య‌క్త ప‌రిచి.. రూ.20 ల‌క్ష‌ల పార్టీ ఫండ్‌ను కూడా అందించారు. చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీ కండువా క‌ప్పుకొన్నారు.

అంతేకాదు.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో చిల‌క‌లూరిపేట‌(పోసాని సొంత నియోజ‌క‌వ‌ర్గం) స‌హా గుంటూరు , న‌ర‌సారావుప‌పేట నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేస్తాన‌ని కూడా యోగేంద్ర‌నాథ్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చంద్ర‌బాబు వంటి నాయ‌కుడిని గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉంద‌న్నారు. ఆయ‌న విజ‌న్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తార‌ని తేల్చిచెప్పారు. అందుకే తాను సైకిల్ ఎక్కిన‌ట్టు చెప్పారు. టీడీపీలో చేరి.. పార్టీ విజ‌యానికి కృషి చేస్తాన‌న్నారు. కాగా, బ్రిట‌న్‌లో వ్యాపారాలు చేస్తున్న యోగేంద్ర‌నాథ్‌.. చంద్ర‌బాబు హ‌యాంలో హైద‌రాబాద్‌లోనూ ఇక్క‌డ వ్యాపారాలు ప్రారంభించారు.  ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న టీడీపీ కండువా క‌ప్పుకొన్న‌ట్టు చెప్పారు. 

This post was last modified on April 29, 2024 2:44 pm

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

1 hour ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

1 hour ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

1 hour ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

2 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

2 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

2 hours ago