Political News

పోసానికి షాక్… ఫ్యామిలీ అంతా చంద్రబాబు వైపు

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా నిరంత‌రం మీడియాలో ప్ర‌చారం చేస్తున్న వైసీపీ నాయ‌కుడు, సినీ న‌టుడు, ర‌చ‌యిత‌, నిర్మాత పోసాని కృష్ణ‌ముర‌ళికి సొంత కుటుంబంలోనే భారీ షాక్ తగిలింది. ఆయ‌నేమో.. నిరంత‌రం సీఎం జ‌గ‌న్ భ‌జ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఏపీ ఫిల్మ్  డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్న పోసాని.. జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్త‌స్తున్నారు. ఇదేసమ‌యంలో ఆయ‌న చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై నిరంతరం విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కానీ, అనూహ్యంగా పోసాని కుటుంబం మాత్రం చంద్ర‌బాబుకు జై కొట్టింది. అంతేకాదు.. మ‌రోసారి ఏపీ సీఎం జగన్ అయితే.. త‌ప్ప రాష్ట్రానికి ద‌శ‌, దిశ ఉండ‌ద‌ని కూడా తేల్చి చెప్పేయ‌డం గ‌మ‌నార్హం. తాజాగా పోసాని కృష్ణ‌ముర‌ళి త‌మ్ముడి కుమారుడు.. పోసాని యోగేంద్ర‌నాథ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్ర‌బాబును క‌లిసిన ఆయ‌న త‌న అభిమానాన్ని వ్య‌క్త ప‌రిచి.. రూ.20 ల‌క్ష‌ల పార్టీ ఫండ్‌ను కూడా అందించారు. చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీ కండువా క‌ప్పుకొన్నారు.

అంతేకాదు.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో చిల‌క‌లూరిపేట‌(పోసాని సొంత నియోజ‌క‌వ‌ర్గం) స‌హా గుంటూరు , న‌ర‌సారావుప‌పేట నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేస్తాన‌ని కూడా యోగేంద్ర‌నాథ్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చంద్ర‌బాబు వంటి నాయ‌కుడిని గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉంద‌న్నారు. ఆయ‌న విజ‌న్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తార‌ని తేల్చిచెప్పారు. అందుకే తాను సైకిల్ ఎక్కిన‌ట్టు చెప్పారు. టీడీపీలో చేరి.. పార్టీ విజ‌యానికి కృషి చేస్తాన‌న్నారు. కాగా, బ్రిట‌న్‌లో వ్యాపారాలు చేస్తున్న యోగేంద్ర‌నాథ్‌.. చంద్ర‌బాబు హ‌యాంలో హైద‌రాబాద్‌లోనూ ఇక్క‌డ వ్యాపారాలు ప్రారంభించారు.  ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న టీడీపీ కండువా క‌ప్పుకొన్న‌ట్టు చెప్పారు. 

This post was last modified on April 29, 2024 2:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హమ్మయ్యా… మిథున్ రెడ్డికీ ఊరట లభించింది

వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో పాటుగా ఆ పార్టీ పేరు చెప్పుకుని చాలా మంది…

18 minutes ago

స్టేడియం బయటికి వెళ్లిన ‘పెద్ది’ షాట్

దేనికైనా టైమింగ్, ప్లానింగ్ ఉంటే ఫలితాలు కరెక్ట్ గా వస్తాయి. నిన్నపెద్ది టీజర్ విషయంలో దర్శక నిర్మాతలు తీసుకున్న ఈ…

58 minutes ago

అమరావతికి మరో గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి రూ.750 కోట్లు విడుదల

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి నిధుల కష్టాలు తొలగిపోయాయి. అమరావతిలోని ప్రధాన భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు,…

1 hour ago

కిం క‌ర్త‌వ్యం.. వ‌క్ఫ్‌పై చిక్కుల్లో వైసీపీ ..!

వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లుకు అనుకూలంగా వైసీపీ ఓటేసింద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీనిపై మై నారిటీ ముస్లింలు.. చ‌ర్చ…

3 hours ago

కండలవీరుడి హిట్టు కోసం బాహుబలి రచయిత

దర్శకధీర రాజమౌళి సినిమాలన్నింటికి కథలు ఇచ్చే విజయేంద్ర ప్రసాద్ హిందీలోనూ తన ముద్ర వేస్తుంటారు. సల్మాన్ ఖాన్ భజరంగి భాయ్…

3 hours ago

మార్కెట్ దారుణంగా పడిన వేళలో.. బఫెట్ ఆస్తి రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది

ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తున్నాయో తెలిసిందే.ఆయన తీసుకుంటున్న దూకుడు…

4 hours ago