మొన్నటిదాకా తెలుగు సినిమాల్లో కనిపించడమే తగ్గించేసిన అనుపమ పరమేశ్వరన్ కు టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఎక్కడ లేని ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. బోల్డ్ సీన్స్ విషయంలో అభిమానులు తొలుత సంశయం వ్యక్తం చేసినా తర్వాత తను తీసుకున్నది ఎంత సరైన నిర్ణయమో ఫలితం ఋజువు చేసింది. నటనకు లోటు లేకపోయినప్పటికీ గ్లామర్ షోకు నో చెబుతూ వచ్చిన అనుపమ ఇప్పుడు టిల్లు తరహాలో డిఫరెంట్ షేడ్స్ ఉంటే ఎస్ చెప్పేస్తోంది కాబట్టి దర్శక నిర్మాతలు తనను కలుస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ లో తనదే ముఖ్య పాత్రనే సంగతి తెలిసిందే. ఇంకా అనౌన్స్ మెంట్ రాలేదు.
సినిమా బండితో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రవీణ్ దర్శకత్వంలో రూపొందుతున్న పరదాలో అనుపమదే లీడ్ రోల్. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తి రేపింది. తాజాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన కొత్త ప్రాజెక్టు ఓకే అయ్యిందని సమాచారం. కార్తికేయ చావు కబురు చల్లగాతో డెబ్యూ చేసిన కౌశిక పెగళ్ళపాటి తీస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ లో అనుపమ పరమేశ్వరన్ నే తీసుకున్నట్టు తెలిసింది. కిష్కిందపురి టైటిల్ పరిశీలనలో ఉంది. క్రియేటివ్ కాన్సెప్ట్స్ రాసుకుంటున్న దర్శకులకు అనుపమ మంచి ఛాయస్ అవుతోంది. అందుకే ఏరికోరి మరీ ఆఫర్లు ఇస్తున్నారు.
ఇవి కాకుండా మలయాళంలో చేస్తున్న జెఎస్కెని ప్యాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. టిల్లు స్క్వేర్ కు ముందు అనుపమ చేసిన ఈగల్ తీవ్రంగా నిరాశపరచగా తమిళంలో జయం రవి సరసన నటించిన సైరెన్ లో కేవలం క్యామియో కావడంతో ఎక్కువ పేరు కీర్తి సురేష్ కు వెళ్ళింది. ఇప్పుడు ఒక్క సక్సెస్ దారి మార్చేసింది. అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉన్న టైంలో అనుపమ లాంటి సీనియర్లు మళ్ళీ పుంజుకోవడం మంచిదే. సాయిశ్రీనివాస్ తో తను గతంలో రాక్షసుడు చేసింది కానీ అందులో ఎక్కువ స్కోప్ దొరకలేదు. ఈసారి అలాంటి టెన్షన్ ఏమీ ఉండదు.
This post was last modified on April 29, 2024 3:25 pm
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…