టాలీవుడ్ లో చాలా మీడియం రేంజ్ సినిమాల ఓటిటి డీల్స్ డోలాయమానంలో ఉన్నాయి. ప్రాజెక్టు మొదలుపెట్టిన టైంలో ఏవేవో ఊహించుకున్న నిర్మాతల ఆశలకు అనుగుణంగా డిజిటల్ కంపెనీలు రేట్లు ఆఫర్లు చేయడం లేదు. చాలా కఠినంగా బేరాలు పెడుతున్నాయి. ఇమేజ్ ఉన్న స్టార్ అయినా సరే ససేమిరా అంటున్నాయి. దీని వల్ల కొన్ని బడ్జెట్లలో కోత వేసుకోగా మరికొన్ని షూటింగులు వాయిదా వేసుకుంటున్నాయి. ఇంకొన్ని ఏకంగా క్యాన్సిల్ దిశగా వెళ్తున్నాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నాగ చైతన్య తండేల్ కు నెట్ ఫ్లిక్స్ భారీ ధర ఇచ్చిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.
చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ ని సుమారు 40 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఇది చైతు కెరీర్ లోనే పెద్ద మొత్తం. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఇండియా పాకిస్థాన్ దేశాల్లో జరుగుతుంది. సాయిపల్లవి హీరోయిన్ కావడం, దేవిశ్రీ ప్రసాద్ లాంటి హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ పని చేయడం, కార్తికేయ 2 తర్వాత చందూ మూవీ కావడం ఇవన్నీ ధర వచ్చేందుకు దోహదం చేశాయి. వీటికి తోడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్రాండ్ ప్లస్ అయ్యింది. ఫ్లాపుల సంగతి పక్కనపెడితే చైతు ఇమేజ్ ఎలాగూ మొదటి ఫ్యాక్టర్ అవుతుంది.
ఈ లెక్కన నలభై కోట్లు ఆఫర్ చేసింది నిజమే అయితే రికవరీ శాతం బాగా పెరిగినట్టు. ఎందుకంటే తండేల్ మొత్తం బడ్జెట్ వంద కోట్ల దాకా అవ్వొచ్చని ఆల్రెడీ టాక్ ఉంది. నాగ చైతన్య మార్కెట్ కి అంత మొత్తం థియేటర్ల నుంచి రాదు. సో నాన్ థియేట్రికల్ హక్కులు కీలకమవుతాయి. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓకే చేసుకుంది కాబట్టి టెన్షన్ ఉండదు. ముందు అక్టోబర్ విడుదలనుకున్నారు కానీ అప్పటికంతా టార్గెట్ చేరుకోవడం సాధ్యం కాదని గుర్తించి డిసెంబర్ ఆప్షన్ ని సీరియస్ గా చూస్తున్నారు. సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో అక్కినేని లక్కీ మంత్ ఎంచుకోవడం బెటర్.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…