టాలీవుడ్ లో చాలా మీడియం రేంజ్ సినిమాల ఓటిటి డీల్స్ డోలాయమానంలో ఉన్నాయి. ప్రాజెక్టు మొదలుపెట్టిన టైంలో ఏవేవో ఊహించుకున్న నిర్మాతల ఆశలకు అనుగుణంగా డిజిటల్ కంపెనీలు రేట్లు ఆఫర్లు చేయడం లేదు. చాలా కఠినంగా బేరాలు పెడుతున్నాయి. ఇమేజ్ ఉన్న స్టార్ అయినా సరే ససేమిరా అంటున్నాయి. దీని వల్ల కొన్ని బడ్జెట్లలో కోత వేసుకోగా మరికొన్ని షూటింగులు వాయిదా వేసుకుంటున్నాయి. ఇంకొన్ని ఏకంగా క్యాన్సిల్ దిశగా వెళ్తున్నాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నాగ చైతన్య తండేల్ కు నెట్ ఫ్లిక్స్ భారీ ధర ఇచ్చిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.
చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ ని సుమారు 40 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఇది చైతు కెరీర్ లోనే పెద్ద మొత్తం. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఇండియా పాకిస్థాన్ దేశాల్లో జరుగుతుంది. సాయిపల్లవి హీరోయిన్ కావడం, దేవిశ్రీ ప్రసాద్ లాంటి హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ పని చేయడం, కార్తికేయ 2 తర్వాత చందూ మూవీ కావడం ఇవన్నీ ధర వచ్చేందుకు దోహదం చేశాయి. వీటికి తోడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్రాండ్ ప్లస్ అయ్యింది. ఫ్లాపుల సంగతి పక్కనపెడితే చైతు ఇమేజ్ ఎలాగూ మొదటి ఫ్యాక్టర్ అవుతుంది.
ఈ లెక్కన నలభై కోట్లు ఆఫర్ చేసింది నిజమే అయితే రికవరీ శాతం బాగా పెరిగినట్టు. ఎందుకంటే తండేల్ మొత్తం బడ్జెట్ వంద కోట్ల దాకా అవ్వొచ్చని ఆల్రెడీ టాక్ ఉంది. నాగ చైతన్య మార్కెట్ కి అంత మొత్తం థియేటర్ల నుంచి రాదు. సో నాన్ థియేట్రికల్ హక్కులు కీలకమవుతాయి. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓకే చేసుకుంది కాబట్టి టెన్షన్ ఉండదు. ముందు అక్టోబర్ విడుదలనుకున్నారు కానీ అప్పటికంతా టార్గెట్ చేరుకోవడం సాధ్యం కాదని గుర్తించి డిసెంబర్ ఆప్షన్ ని సీరియస్ గా చూస్తున్నారు. సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో అక్కినేని లక్కీ మంత్ ఎంచుకోవడం బెటర్.
This post was last modified on April 29, 2024 1:38 pm
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం జగన్ తొలిసారి బయటకు వచ్చారు. విజయవాడలోని ఐ-ప్యాక్ ఆఫీసును జగన్ సందర్శించారు.…
ఒకేసారి ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన రెండు వేర్వేరు ప్యాన్ ఇండియా సినిమాలతో గ్రాండ్ టాలీవుడ్…
నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…