ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలా

ఏపీ సీఎం జ‌గ‌న్ తాజాగా పులివెందుల‌లో నిర్వ‌హించిన స‌భ‌లో సొంత చెల్లి.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌.. వైఎస్ ష‌ర్మిల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆమె క‌ట్టుకునే చీర‌ల‌పై ఆయ‌న వ్యాఖ్య‌లు సంధించారు. ప‌సుపు చీర క‌ట్టుకుని.. వైఎస్ శ‌త్రువుల‌కు ఆహ్వానించారంటూ.. కామెంట్లు కురిపించారు. నిజానికి ష‌ర్మిల‌ త‌న కుమారుడు రాజా వివాహాన్ని పుర‌స్క‌రించుకుని ఫిబ్ర‌వ‌రిలో ఆమె ప‌లువురు అగ్ర‌నేత‌ల‌ను వారి ఇళ్ల‌కు వెళ్లి ఆహ్వానించారు.

ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఆమె హైద‌రాబాద్ నివాసంలో క‌లుసుకున్నారు. కుమారుడి వివాహ ప‌త్రిక‌ను ఇవ్వ‌డంతోపాటు.. స్వీట్లు, కానుక‌లు కూడా ఇచ్చారు. ఈ స‌మ‌యంలో ఆమె లైట్ ఎరుపు రంగు బార్డ‌ర్ ఉన్న‌ ప‌సుపు రంగు చీర‌ను క‌ట్టుకున్నారు. ఇది అనుకుని చేశారో.. లేదా.. యాదృచ్ఛికంగా జ‌రిగిందో తెలియ‌దు. ఎవ‌రూ కూడా.. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు కామెంట్లు చేయ‌లేదు. ఇది స‌భ్య‌త కూడా కాదని అంద‌రికీ తెలిసిందే.

కానీ, తాజాగా సీఎం జ‌గ‌న్‌.. ఇదే చీర‌పై కామెంట్లు చేశారు. ప‌సుపు రంగు చీర క‌ట్టుకుని.. వైఎస్ శ‌త్రువుల‌కు ఆహ్వాన ప‌త్రిక‌లు అందించారంటూ.. నాటి ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావించారు. దీనిపై తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫైర‌య్యారు.
“తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా…
మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా?
ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం?“ అని సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి నిప్పులు చెరిగారు. మ‌రి ఇది ఎటు వైపు దారి తీస్తుందో చూడాలి.